Tamil Nadu hooch tragedy: కళ్లకురిచి కల్తీ మద్యం మరణాలు ‘‘అన్నామలై కుట్ర’’.. డీఎంకే ఆరోపణ..
- కళ్లకురిచి కల్తీ మద్యం ఘటన అన్నామలై కుట్ర..
- ఈ విషాదంలో 56 మంది మృతి..
- బీజేపీ పాలిత పుదుచ్చేరి నుంచే మిథనాల్..
- డీఎంకే నేత సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu hooch tragedy: తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం కాటుకు 56 మంది మరణించారు. ఈ ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తమిళనాడులో అధికార పార్టీ డీఎంకే, సీఎం స్టాలిన్ నాయకత్వంపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలు స్టాలిన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కోలీవుడ్ యాక్టర్స్ సూర్య, విజయ్, కమల్ హాసన్ వంటివారు ఈ విషాదంపై ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: Canada: కెనడాలో భారతీయ విద్యార్థుల పరిస్థితి ఇది.. కాఫీ షాప్ ఉద్యోగం కోసం బారులు..
Also Read
- Ram Mandir Donation Theft Case: అయోధ్య రామ మందిర కేసులో కీలక మలుపు.. కొత్త సిట్ ఏర్పాటు..!
- CJP Protest: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..118 మంది పోలీసులకు గాయాలు.. పోలీసుల అదుపులో 70 మంది
- Sikkim: సిక్కింలో కొండచరియలు విరిగిపడి 7 మంది మృతి.. సొరంగంలో చిక్కుకున్న 27 మంది కార్మికులు!
- CJP Protest: జంతర్ మంతర్ వీడేదిలేదు.. మరోసారి పార్లమెంట్ మార్చ్.. సీజేపీ స్పష్టమైన హెచ్చరిక
ఇదిలా ఉంటే, సీఎం స్టాలిన్పై సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఆ పార్టీ నేత కల్తీ మద్యం మరణాలు బీజేపీ కుట్రగా అనుమానించారు. డీఎంకేకి చెందిన ఆర్ఎస్ భారతీ మాట్లాడుతూ కళ్లకురిచి మద్యం మరణాలను అన్నామలై కుట్రగా అభివర్ణించారు. బీజేపీ పాలిత పదుచ్చేరి నుంచి మిథనాల్ తీసుకువచ్చి కల్తీ సారా తయారు చేసినట్లు చెప్పారు. ఈ ఘటన అన్నామలై పథకం ప్రకారం చేసిన కుట్ర అని డీఎంకే నేత వ్యాఖ్యానించారు.
తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో జూన్ 18న కల్తీ మద్యం సేవించి 50 మందికి పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనపై స్టాలిన్ రాజీనామా చేయాలని అన్నామలై డిమాండ్ చేశారు. దీని తర్వాత భారతీ మాట్లాడుతూ.. అన్నామలైపై ఆరోపణలు చేశారు. పుదుచ్చేరిలోని బీజేపీ మంత్రులు, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డార్జిలింగ్ రైలు ప్రమాదం తర్వాత రైల్వేమంత్రి రాజీనామా చేశారా..? నీట్ వ్యవహారంలో కేంద్రమంత్రి రాజీనామా చేశారా..? 2009లో కల్తీ మద్యం తాగి 137 మంది చనిపోతే నరేంద్ర మోడీ రాజీనామా చేశారా? అని భారతి ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
2027 వరల్డ్కప్కు Ravi Shastri డ్రీమ్ టీమిండియా ఇదే.. రో-కోకు చోటు.. నలుగురు పేసర్లతో జట్టు మాములుగా లేదుగా.!
-
Avengers Doomsday : అవెంజర్స్ డూమ్స్ డే తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. థోర్ మాస్ విధ్వంసం
-
Traffic Police New Rules: ట్రాఫిక్ పోలీసులకు కొత్త రూల్స్.. డ్యూటీలో మొబైల్ వాడకం కుదరదు..!
-
Chennai LoveStory : ‘చెన్నై లవ్స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరు
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!