Matrimonial fraud: మ్యాట్రిమోని ద్వారా 250 మంది మహిళలను మోసం చేసిన 45 ఏళ్ల వ్యక్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Matrimonial fraud: ఇటీవల కాలంలో మ్యాట్రిమోనియల్ మోసాలు పెరుగుతున్నాయి. గతంలో పెద్దలు కుదర్చిన పెళ్లిళ్లు ఉంటే, ఇప్పుడు మాత్రం అమ్మాయిలు, అబ్బాయిలు తమకు నచ్చిన సంబంధాలను మ్యాట్రిమోని సైట్లలో వెతుక్కుంటున్నారు. ఇదే మోసగాళ్లకు వరంగా మారింది. తాజాగా రాజస్థాన్కి చెందిన 45 ఏళ్ల వ్యక్తి ఒకర్నికాదు ఇద్దర్ని కాదు ఏకంగా 250 మందికి పైగా మహిళల్ని మోసం చేశాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
మ్యాట్రిమోనియల్ సైట్లు మరియు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో 250 మందికి పైగా మహిళలతో స్నేహం చేసి మోసం చేసిన 45 ఏళ్ల వ్యక్తిని బెంగళూరు రైల్వే పోలీసులు బుధవారం అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడిని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన నరేష్ పూజారి గోస్వామిగా గుర్తించారు. గత 20 ఏళ్లుగా అతనున బెంగళూర్ నగరంలో నివసిస్తున్నాడు. మాట్రిమోనీ సైట్లు, సోషల్ మీడియా ఫ్లాట్ఫారమ్స్లలో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేసి మహిళలు, వారి కుటుంబాల నుంచి డబ్బులు కొల్లగొట్టేవాడు. నిందితుడు యువకుల ఫోటోలను ఉపయోగించి ఆన్లైన్ ప్రొఫైల్ క్రియేట్ చేసి కస్టమ్స్ ఆఫీసర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పోజులిచ్చేవాడని పోలీసులు తెలిపారు.
Also Read
- Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
- Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్చుక్ సందేశం
Read Also: Russia-Ukraine war: రష్యా-ఉక్రెయిన్ వార్జోన్లో చిక్కుకుపోయిన 20 మంది భారతీయులు..
నిందితుడు 10 రాష్ట్రాల్లోని మొత్తం 259 మంది మహిళల్ని మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. కస్టమ్స్ అధికారిగా, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఫోజుల ఇచ్చి, పెళ్లి కోసం యువతుల కుటుంబాలను బెంగళూర్కి ఆహ్వానించేవాడు. ఆ తర్వాత నిందితుడు తనకు ఆఫీసులో అర్జంట్ పని ఉందని, మిమ్మల్ని రిసీవ్ చేసుకునేందుకు తమ మామ వస్తాడని, తనే వెళ్లి వారిని కలిసేవాడు. అలా కలిసిన తర్వాత, వారికి కొంతదూరం వెళ్లి మళ్లీ ఫోన్ చేసి, తన మామకు రూ. 5000-10,000 ఇవ్వాలని, తన కుటుంబం కోసం అత్యవసరంగా రైల్వే టికెట్స్ బుక్ చేయాలని, తాము కలుసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాడని నమ్మబలికే వాడు. యువకుడిగా, అతని మామగా రెండు క్యారెక్టర్లను పోషించే వాడు. ఆ తర్వాత అక్కడి నుంచి అదృశ్యమయ్యేవాడు.
కోయంబత్తూర్కి చెందిన బాధితురాలు ఫిబ్రవరి 23 ఫిర్యాదు చేయడంతో రైల్వే పోలీసులు విచారణ ప్రారంభించారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. గోస్వామి విడాకులు తీసుకున్న, వితంతువులను లక్ష్యంగా చేసుకునే వాడని పోలీసులు తెలిపారు. బెంగళూర్కి రమ్మని చెప్పే సమయానికి మహిళలతో అర్థరాత్రి వరకు మాట్లాడుతూ వారి నమ్మకాన్ని చోరగొనే వాడని తెలిపారు. ఇప్పటి వరకు 16 మంది బాధితుల స్టేట్మెంట్స్ రికార్డు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఐపీసీలోని మోసం సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Lalchand Rajput: రోహిత్ మరో రెండేళ్లు హాయిగా ఆడగలడు.. ‘హిట్మ్యాన్’ కెరీర్పై తొలి కోచ్ రాజ్పుత్ ధీమా
-
Yadhu Vamsi: ‘నా కొడుకు సాధించాడు’.. తండ్రి కలను నిజం చేసిన యదు వంశీ! వీడియో వైరల్
-
IND vs ENG 3rd ODI: రోహిత్-కోహ్లీ భవిష్యత్తుపై ప్రశ్న.. హ్యారీ బ్రూక్ సమాధానం ఇదే!
-
OPPO K14x 5G: ఒప్పో K14x 5G.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్!
-
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..? ఆల్-పార్టీ మీటింగ్లో కీలక పరిణామం..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!