Karnataka: దారుణం.. భార్యపై కోపంతో పెళ్లి కుదిర్చిన మధ్యవర్తి హత్య
- కర్ణాటకలో దారుణం
- భార్యపై కోపంతో పెళ్లి కుదిర్చిన మధ్యవర్తి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పెళ్లి సంబంధం చూసి.. ఓ ఇంటి వాడిని చేసి.. పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని ఆశీర్వదించిన ఓ బ్రోకర్ హత్యకు గురయ్యాడు. సంబంధం చూసి పెళ్లి చేసిన పాపానికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అలా చేయడమే తనకు మరణశాసనం అవుతుందని అతడు ఊహించలేకపోయాడు. భార్య పుట్టింటికి వెళ్లిపోయిందన్న కోపంతో పెళ్లి సంబంధం కుదిర్చిన మధ్యవర్తిని అత్యంత దారుణంగా హతమార్చాడు ఓ భర్త. ఈ ఘోరం కర్ణాటకలోని మంగళూరులో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Off The Record: వైసీపీ మూడు రాజధానుల అంశాన్ని పూర్తిగా మరిచిపోయినట్లేనా..?
Also Read
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
వామంజూర్ నివాసి అయిన సులేమాన్ (50), ముస్తఫా (30) అనే యువకుడికి పెళ్లి సంబంధం చూశాడు. 8 నెలల క్రితం షహీనాజ్ అనే మహిళతో ముస్తఫా (30)కు వివాహం జరిపించాడు. అయితే పెళ్లైన నాటి నుంచి భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో షహీనాజ్ రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె తిరిగి రాకపోవడంతో ముస్తఫా.. పెళ్లి బ్రోకర్ సులేమాన్పై కోపం పెంచుకున్నాడు. బుధవారం రాత్రి ముస్తఫా.. సులేమాన్కు అసభ్యకరమైన ఫోన్ కాల్ చేశాడు. దీంతో సులేమాన్, అతని కుమారులు రియాబ్, సియాబ్లతో కలిసి వలచిల్లోని ముస్తఫా ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా ఏం వాగ్వాదం జరిగిందో.. ఏమో తెలియదు గానీ.. వెళ్లిపోయే ముందు సులేమాన్ చర్చ విఫలమైందని సూచించి బయటకు వెళ్లిపోతుండగా అకస్మాత్తుగా ముస్తఫా కత్తితో పరిగెత్తుకుంటూ వచ్చి సులేమాన్ మెడపై వేటువేశాడు. అంతే అక్కడికక్కడే సులేమాన్ ప్రాణాలు వదిలాడు. అక్కడే ఉన్న ఇద్దరు కుమారులపై కూడా దాడి చేయడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం నిందితుడు ముస్తఫా అక్కడ నుంచి పారిపోయాడు.
ఇది కూడా చదవండి: NIA: పేలుళ్ల కుట్ర కేసులో కూపీ లాగుతున్న ఎన్ఐఏ.. ఏ నగరాలను టార్గెట్ చేసారు..?
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని రాత్రి 11 గంటల ప్రాంతంలో సమీపంలోని ఆస్పత్రికి తరలించగా సులేమాన్ అప్పటికే చనిపోయినట్లు ప్రకటించారు. ఇద్దరు కుమారులు మాత్రం తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళూరు గ్రామీణ పోలీసులు.. భారతీయ న్యాయ సంహిత (BNS), 2023 లోని నేరపూరిత హత్య, హత్యాయత్నం మరియు దాడితో సహా బహుళ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు ముస్తఫాను అరెస్టు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!