Maoists: 3 రాష్ట్రాల సీఎంలకు మావోల లేఖ.. సారాంశం ఇదే!
- 3 రాష్ట్రాల సీఎంలకు మావోల లేఖ
- మూడు జోనల్కు ప్రతినిధిగా ఉన్న అనంత్ అభ్యర్థన లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశంలో మావోల ఏరివేత కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు తమ ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలను పట్టించుకోని మావోయిస్టులను మాత్రం భద్రతా దళాలు అంతమొందిస్తున్నాయి. మార్చి నెల నాటికి మావో రహిత దేశంగా మార్చాలని కేంద్రం కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారతదేశంలో మావోల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు
Also Read
- Delhi: చాట్జీపీటీకి శుభవార్త.. ఏఎన్ఐ కంటెంట్ వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఊరట
- Modi-Instagram: వైరల్ వీడియోతో ప్రధాని మోడీకి భారీ క్రేజ్.. ఒక్క రాత్రిలోనే సరికొత్త చరిత్ర
- IMD Alert: 17 రాష్ట్రాలకు అతి భారీ వర్ష సూచన.. రెడ్ అలర్ట్ జారీ
- Jantar Mantar: కాక్రోచ్ వేదికపై కానిస్టేబుల్ రాజీనామా.. అసలు నిజం తెలిసి అంతా షాక్..
ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాలకు చెందిన మావోయిస్ట్ కమిటీ ప్రభుత్వాలకు లేఖ రాసింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్కు లేఖలు రాసింది. మూడు జోనల్కు ప్రతినిధిగా ఉన్న అనంత్ అభ్యర్థన లేఖ రాశాడు.
లేఖ సారాంశం ఇదే..
సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నామని.. ప్రభుత్వ పునరావాసం పథకంలో చేరాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. అయితే లొంగిపోవడానికి మూడు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు కోరాడు. తమ పార్టీ ప్రజాస్వామ్య కేంద్రకరణ సూత్రాలకు కట్టుబడి ఉందని.. సమిష్టి నిర్ణయానికి కొంత సమయం పడుతుందని.. సహచరులను సంప్రదించి సందేశం తెలియజేసేంత వరకు తమకు సమయం ఇవ్వాలని కోరాడు.
ఇది కూడా చదవండి: Supreme Court: సీజేఐగా సూర్య కాంత్ ప్రమాణస్వీకారం.. హాజరైన మోడీ
మావోయిజాన్ని అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గడువు మార్చి 31, 2026 లోపు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు కొంత సంయమనం పాటించాలని, భద్రతా దళాల కార్యకలాపాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశాడు. ఇకపై ఎలాంటి వారోత్సవాలు జరుపుకోబోమని.. ప్రస్తుతం ఆ కార్యక్రమాలన్నీ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నాడు. లేఖ అందిన తర్వాత ప్రభుత్వం నుంచి ఆహ్లాదకరంగా.. సానుకూలంగా నిర్ణయాలు వస్తాయని భావిస్తున్నట్లు తెలిపాడు. అలాగే మా సందేశం సహచరులకు త్వరగా అందేలా కొద్దిరోజులు రేడియోలో కూడా ప్రసారం చేయాలని అభ్యర్థించాడు. సమాచారం చేరడానికి తమకు ఏకైక మార్గం ఒక్క రేడియోనేనని పేర్కొన్నాడు. అలాగే ప్రజా ప్రతినిధులను, జర్నలిస్టులను కూడా కలిసే అవకాశం కూడా ఇస్తారని భావిస్తున్నట్లు కోరాడు. సహచరులను సంప్రదించిన తర్వాత లొంగిపోయే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించాడు. సహచరులైన సోను దాదా, సతీష్ దాదాలకు సమాచారం అందేలా జర్నలిస్టులు మధ్యవర్తిత్వం వహించాలని కోరాడు.
తాజావార్తలు
-
Delhi: చాట్జీపీటీకి శుభవార్త.. ఏఎన్ఐ కంటెంట్ వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఊరట
-
CM Revanth Reddy : హైదరాబాద్ ట్రాఫిక్కు బిగ్ ప్లాన్.. ప్రత్యేక బ్యూరో ఏర్పాటు!
-
Prabhas: ప్రభాస్ ఇటలీ విల్లా రెంట్ ఎంతో చెప్పిన ప్రభాస్ శ్రీను!
-
Prabhas Srinu: “నా ఫస్ట్ రెమ్యూనరేషన్ రూ.10 వేలు.. అత్యధికంగా రెండు రోజులకు రూ.3 లక్షలు అందుకున్నా”
-
Maruti Suzuki Brezza Facelift: మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్లిఫ్ట్ లాంచ్.. కొత్త ఇంజన్, 5- స్టార్ సేఫ్టీ, ధర రూ. 7.39 లక్షల నుంచి స్టార్ట్..
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!