Maoists: 3 రాష్ట్రాల సీఎంలకు మావోల లేఖ.. సారాంశం ఇదే!
- 3 రాష్ట్రాల సీఎంలకు మావోల లేఖ
- మూడు జోనల్కు ప్రతినిధిగా ఉన్న అనంత్ అభ్యర్థన లేఖ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం దేశంలో మావోల ఏరివేత కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు తమ ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ హెచ్చరికలను పట్టించుకోని మావోయిస్టులను మాత్రం భద్రతా దళాలు అంతమొందిస్తున్నాయి. మార్చి నెల నాటికి మావో రహిత దేశంగా మార్చాలని కేంద్రం కంకణం కట్టుకుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారతదేశంలో మావోల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు
Also Read
- Bihar Police Exam Chaos: పరీక్ష రోజున రైళ్లు ఆలస్యం.. ఆగ్రహంతో రాళ్ల దాడికి దిగిన కానిస్టేబుల్ అభ్యర్థులు
- NDA Women Cadets: భారత రక్షణ రంగంలో నయా హిస్టరీ.. చరిత్ర సృష్టించిన నారీమణులు! ‘ఎన్డీఏ’ తొలి మహిళా సింహాలు వీరే..
- Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ పెద్దదే.. కానీ బహుగా అపార్థం చేయబడింది.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- Modi-Trump Meet: ఫ్రాన్స్లో మోదీ-ట్రంప్ భేటీ ఖరారు.. ధ్రువీకరించిన వైట్హౌజ్..
ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాలకు చెందిన మావోయిస్ట్ కమిటీ ప్రభుత్వాలకు లేఖ రాసింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ స్పెషల్ జోనల్ కమిటీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా లేఖ రాసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్కు లేఖలు రాసింది. మూడు జోనల్కు ప్రతినిధిగా ఉన్న అనంత్ అభ్యర్థన లేఖ రాశాడు.
లేఖ సారాంశం ఇదే..
సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నామని.. ప్రభుత్వ పునరావాసం పథకంలో చేరాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. అయితే లొంగిపోవడానికి మూడు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు కోరాడు. తమ పార్టీ ప్రజాస్వామ్య కేంద్రకరణ సూత్రాలకు కట్టుబడి ఉందని.. సమిష్టి నిర్ణయానికి కొంత సమయం పడుతుందని.. సహచరులను సంప్రదించి సందేశం తెలియజేసేంత వరకు తమకు సమయం ఇవ్వాలని కోరాడు.
ఇది కూడా చదవండి: Supreme Court: సీజేఐగా సూర్య కాంత్ ప్రమాణస్వీకారం.. హాజరైన మోడీ
మావోయిజాన్ని అంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన గడువు మార్చి 31, 2026 లోపు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలు కొంత సంయమనం పాటించాలని, భద్రతా దళాల కార్యకలాపాలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశాడు. ఇకపై ఎలాంటి వారోత్సవాలు జరుపుకోబోమని.. ప్రస్తుతం ఆ కార్యక్రమాలన్నీ నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నాడు. లేఖ అందిన తర్వాత ప్రభుత్వం నుంచి ఆహ్లాదకరంగా.. సానుకూలంగా నిర్ణయాలు వస్తాయని భావిస్తున్నట్లు తెలిపాడు. అలాగే మా సందేశం సహచరులకు త్వరగా అందేలా కొద్దిరోజులు రేడియోలో కూడా ప్రసారం చేయాలని అభ్యర్థించాడు. సమాచారం చేరడానికి తమకు ఏకైక మార్గం ఒక్క రేడియోనేనని పేర్కొన్నాడు. అలాగే ప్రజా ప్రతినిధులను, జర్నలిస్టులను కూడా కలిసే అవకాశం కూడా ఇస్తారని భావిస్తున్నట్లు కోరాడు. సహచరులను సంప్రదించిన తర్వాత లొంగిపోయే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించాడు. సహచరులైన సోను దాదా, సతీష్ దాదాలకు సమాచారం అందేలా జర్నలిస్టులు మధ్యవర్తిత్వం వహించాలని కోరాడు.
తాజావార్తలు
-
Bihar Police Exam Chaos: పరీక్ష రోజున రైళ్లు ఆలస్యం.. ఆగ్రహంతో రాళ్ల దాడికి దిగిన కానిస్టేబుల్ అభ్యర్థులు
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు, డబ్బే డబ్బు!
-
Vijay Deverakonda : నాగ చైతన్య ‘దూత’ డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ… క్రేజీ కాంబినేషన్ లోడింగ్ ?
-
Trump US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన.. నేడే గుడ్ న్యూస్?
-
Astrology: చిన్న విషయాన్నీ ఎక్కువగా ఆలోచించే 4 రాశులవారు.. మీలో కూడా ఈ లక్షణం ఉందా?
ట్రెండింగ్
-
Garlic for High Cholesterol: ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల బ్లాక్స్ తగ్గుతాయా..?
-
Home Remedies : ఇంట్లో చీమల బెడదా.? 2 పదార్థాలతో శాశ్వత పరిష్కారం.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు బెడదా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Nilufer: టర్కీ యువరాణి నుంచి హైదరాబాద్ ప్రజల ఆరాధ్యురాలిగా.. ‘నీలోఫర్’ అసాధారణ ప్రయాణం.!
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!