Manipur: మణిపూర్లో కీలక పరిణామం.. కేంద్రంతో తిరుగుబాటు గ్రూపు UNLF శాంతి ఒప్పందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manipur: గత కొంత కాలంగా జాతి ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే శాంతి నెలకొంటోంది. రాష్ట్రంలో మైయిటీ, కుకీల మధ్య కొన్ని నెలలుగా ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో సుమారుగా 200 మంది వరకు మరణించగా.. చాలా మంది వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇదిలా ఉంటే మణిపూర్ రాష్ట్రంలో చాలా కాలంగా ఉన్న తిరుగుబాటు గ్రూప్ యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్(UNLF), కేంద్ర ప్రభుత్వంతో శాంతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం తెలిపారు.
ఈ శాంతి ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ అమిత్ షా ట్వీట్ చేశారు. ‘మణిపూర్ లోని పురాతన సాయుధ సమూహం UNLF హింసను త్యజించి ప్రజా స్రవంతిలో చేరడానికి అంగీకరించింది. నేను వారిని ప్రజాస్వామ్య ప్రక్రియలోకి స్వాగతిస్తున్నాను. వారి ప్రయాణానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శాంతి, పురోగతికి ఇది మార్గం’ అని ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.
Also Read
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
- PM Modi: "మార్క్ జుకర్బర్గ్ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, లేకపోతే..." మెటా సీఈఓకు పార్లమెంటరీ ప్యానెల్ అల్టిమేటం?
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
మే 3న రాష్ట్రంలో జాతి హింస చెలరేగింది. ఆ తర్వాత ఇఫాల్ లోయలో ప్రధాన నిషేధిత సంస్థగా ఉన్న మిలిటెంట్ గ్రూపుతో శాంతి చర్చలు జరపడం ఇదే తొలిసారి. ఆర్కే మేఘన్ నేతృత్వంలో ఈ సాయుధ సమూహం ఏర్పడింది. మణిపూర్ సార్వభౌమాధికారం కోసం గెరిల్లా యుద్ధంతో ఈ సంస్థ పోరాడుతోంది. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ)లాగే ఈ తాజాగా శాంతి ఒప్పందానికి అంగీకరించిన UNLF కూడా మణిపూర్, భారతదేశంలో కలవడాన్ని చట్టవిరుద్ధంగా పరిగణిస్తోంది. తాజా శాంతి ఒప్పందంతో ఆరు దశాబ్ధాల సుదీర్ఘ సాయుధ పోరాటానికి ముగింపు పలికినట్లైంది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, యువతకు మంచి భవిష్యత్తును అందించాలనే ప్రధాని మోడీ దార్శనికతకు ఇది మైలు రాయి అని అమిత్ షా అన్నారు.
The peace agreement signed today with the UNLF by the Government of India and the Government of Manipur marks the end of a six-decade-long armed movement.
It is a landmark achievement in realising PM @narendramodi Ji's vision of all-inclusive development and providing a better… pic.twitter.com/P2TUyfNqq1
— Amit Shah (@AmitShah) November 29, 2023
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?