Manipur: ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారానికి ఐదురోజులే పనిదినాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మణిపూర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కాసేపటికే బీరెన్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు వారంలో ఐదురోజులే పనిదినాలు ఉండేలా కొత్త జీవో విడుదల చేశారు. ఈ నిర్ణయంతో మణిపూర్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పని చేయనున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.
మార్చి నుంచి అక్టోబరు వరకు ఉదయం 9 గంటలకు మొదలయ్యే ప్రభుత్వ కార్యాలయాలు సాయంత్రం ఐదున్నర గంటల వరకు కొనసాగనున్నాయి. అయితే నవంబరు నుంచి ప్రారంభం కానున్న శీతాకాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఉదయం 9 గంటలకు మొదలయ్యే ప్రభుత్వ కార్యాలయాలు సాయంత్రం మాత్రం మరో అరగంట ముందే ముగిసేలా మణిపూర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఎప్పటిలానే మధ్యలో వచ్చే లంచ్ బ్రేక్ కోసం అరగంట సమయం ఇచ్చారు. కాగా వారానికి ఐదురోజులే పనిదినాలుగా ఉంటాయని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అక్కడి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..