Tripura: త్రిపుర సీఎంగా మాణిక్ సాహా.. ప్రమాణ స్వీకారానికి హాజరైన ప్రధాని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tripura: త్రిపురలో మరోసారి బీజేపీ అధికారం చేపట్టబోతోంది. త్రిపుర ముఖ్యమంత్రిగా నేడు మాణిక్ సాహా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. రాష్ట్రంలో బీజేపీని వరసగా రెండోసారి అధికారంలోకి తీసుకురావడంతో మాణిక్ సాహా కీలకంగా పనిచేశారు. దంతవైద్యుడు, రాజకీయనాయకుడిగా సాహాకు క్లీన్ ఇమేజ్ ఉంది. అగర్తలా వివేకానంద మైదాన్ లో ప్రమాణస్వీకారం జరిగింది. ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Read Also: Russia-Ukraine War: బఖ్ముత్ రష్యా సొంతం అయితే అంతే సంగతులు.. జెలన్ స్కీ భయం..
Also Read
- Mahua Moitra: రామమందిర విరాళాల స్కామ్పై స్పందించరే.. బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Case: షాపింగ్ కోసం కేతన్ నుంచి రూ.కోటి కొట్టేసిన సియా.. అవి ఎవరికిచ్చిందంటే..!
- Viral Video: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న తాతా.. 18 వేల అడుగుల ఎత్తు నుంచి దూకేసిన 80 ఏళ్ల వృద్ధుడు!
మాణిక్ సాహా 2016లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 2020లో రాష్ట్ర పార్టీ చీఫ్ గా నియమితుడయ్యారు. మార్చి 2022లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే గతేడాది త్రిపుర సీఎంగా ఉన్న బిప్లవ్ దేవ్ స్థానంలో మాణిక్ సాహాను ముఖ్యమంత్రిగా నియమించింది బీజేపీ. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ 60 స్థానాల్లో తన మిత్ర పక్షం ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర(ఐపీఎఫ్టీ) పార్టీతో కలిసి 32 స్థానాల్లో గెలిచింది. ఇందులో బీజేపీనే 31 స్థానాలను కైవసం చేసుకుంది.
త్రిపురలో బీజేపీ 32 సీట్లు మరియు దాదాపు 39 శాతం ఓట్లతో పూర్తి మెజారిటీని గెలుచుకోవడం ద్వారా తిరిగి అధికారంలోకి వచ్చినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. తిప్ర మోత పార్టీ 13 సీట్లు గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది.మ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 11 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ మూడు సీట్లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సాహాను సోమవారం గవర్నర్ సత్యదేశ్ నారాయన్ ఆర్య పిలిచారు. అంతకుముందు రోజు కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలందరితో సమావేశం నిర్వహిచారు మాణిక్ సహా. సభ్యులంతా మాణిక్ సాహాను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
తాజావార్తలు
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
Cleaning Tips: ఇల్లాళ్లకు స్మార్ట్ కిచెన్ ఐడియాస్.. వంటగదిని క్లీన్గా ఉంచే 12 అదిరిపోయే చిట్కాలు!
-
Nitin Nabin: గిరిజనుల అభివృద్ధికి బీజేపీ కట్టుబడింది.. కాంగ్రెస్ తెలంగాణను ఏటీఎంగా వాడుకుంటోంది
-
Trump-Iran: ఇరాన్ చర్చలు కోరింది.. రేపు దోహాలో కీలక భేటీ అంటూ ట్రంప్ ప్రకటన
-
Mahua Moitra: రామమందిర విరాళాల స్కామ్పై స్పందించరే.. బీజేపీపై మహువా మొయిత్రా ఫైర్
ట్రెండింగ్
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!