Divorce case: భార్య మాటల్ని గుట్టుగా రికార్డ్ చేసిన వ్యక్తి.. సుప్రీంకోర్టులో కీలక చర్చ..
- భార్య మాటల్ని గుట్టుగా రికార్డ్ చేసిన వ్యక్తి..
- విడాకుల కేసులో కోర్టు ముందుకు సాక్ష్యంగా రికార్డులు..
- గోప్యతా హక్కు, ఎవిడెన్స్ యాక్ట్ మధ్య సుప్రీంలో కీలక చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Divorce case: భార్యభర్తల మధ్య విడాకుల కేసు సుప్రీంకోర్టు కీలక చర్చకు దారి తీసింది. ఈ కేసు ఆర్టికల్ 21 ద్వారా సంక్రమించే ‘‘గోప్యత హక్కు’’, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్పై ప్రశ్నల్ని లేవనెత్తింది. విడాకులు పిటిషన్ విచారిస్తున్న సుప్రీంకోర్టు, ఒక వ్యక్తి తన భార్య ప్రైవేట్ సంభాషణల్ని గుట్టుచప్పుడు కాకుండా కొన్ని ఏళ్లుగా రికార్డ్ చేసి, వాటిని కోర్టులో సాక్ష్యం కింద సమర్పించాడు. దీనిని సుప్రీంకోర్టు తీవ్రంగా విమర్శించింది. సదరు భర్త తన భార్యతో జరిగిన ప్రైవేట్ మాటల్ని మొబైల్ యాప్ ద్వారా రికార్డ్ చేసినట్లు సమచారం. ఈ రికార్డులను విడాకుల కేసులో సాక్ష్యంగా సమర్పించారు. ఇక్కడ ఇదే వాటి చట్టబద్ధత, నైతిక చిక్కులపై చర్చకు దారి తీసింది.
Read Also: Haj yatra: ముస్లింలకు గుడ్ న్యూస్.. ఇండియా-సౌదీల మధ్య ‘‘హజ్ అగ్రిమెంట్’’
Also Read
- Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
- AAP: ప్రధాని నివాసం ముందు ధర్నా.. కాంగ్రెస్పై ఆప్ ఎదురుదాడి
- CJP Protest: సీజేపీ నిరసనలో పాల్గొన్న శరద్ పవార్, సుప్రియా సూలే
- IMD Big Alert: దేశాన్ని కమ్ముకున్న మేఘాలు.. భారీ వర్షాలకు హెచ్చరిక.. ఇస్రో చిత్రాలు విడుదల
ఈ కేసు విచారణ సందర్భంగా.. జస్టిన్ నాగరత్న, ‘‘ ఇన్ని సంవత్సరాలుగా భార్య మాటల్ని రికార్డ్ చేసే భర్త ఎవరుంటారు..?’’ అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద గోప్యతా హక్కుకు, భారత సాక్ష్య చట్టంలోని నిబంధనలకు మధ్య పరస్పర చర్య గురించి ఈ కేసు ప్రశ్నలను లేవనెత్తుతుంది. భార్యాభర్తల మధ్య జరిగే సంభాషణలను రక్షించేందుకు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ యొక్క సెక్షన్ 122 వర్తిస్తుందా అనే అంశాన్ని కోర్టు పరిశీలించనుంది. ఈ సెక్షన్ ప్రకారం, భర్త లేదా భార్య తాము కలసి పంచుకున్న వ్యక్తిగత సంభాషణల గురించి కోర్టులో వెల్లడించరాదు. ఈ సెక్షన్ ప్రకారం, భార్యాభర్తల మధ్య సంభాషణలు ప్రత్యేక సంబంధాన్ని సూచిస్తాయి. అవి వ్యక్తిగతమైనవి మరియు గోప్యంగా ఉండాల్సినవి. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చట్టపరమైన వివాదాలు ఉంటే, ఈ సంభాషణలను సాక్ష్యంగా కోర్టులో సమర్పించవచ్చు.
డిజిటల్ యుగానికి ముందు అమలులోకి వచ్చిన ఈ నిబంధనకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వెలుగులో కొత్త వివరణ అవసరమని సీనియర్ న్యాయవాది వృందా గ్రోవర్ అన్నారు. జస్టిస్ నాగరత్న, ‘‘ ఒక సెక్షన్ వివరణ ద్వారా అది పనికిరానిదిగా చేయలేము. పిటిషన్ వివాహిత జంట మధ్య ఉన్నప్పుడు ఈ నిబంధనలు మినహాయింపు సృష్టిస్తుంది’’ అని చెప్పారు. సమ్మతి లేకుండా ఒకరి మాటల్ని రికార్డ్ చేయడం ఆమోదయోగ్యం కాదని గతంలో ఒక హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, అనేక హైకోర్టు తీర్పులు సెక్షన్ 122 కింద చట్టబద్ధమైన మినహాయింపులను పట్టించుకోకుండా గోప్యతా సమస్యలపై మాత్రమే దృష్టి సారించాయని జస్టిస్ నాగరత్న పేర్కొన్నారు. ఈ విషయంపై ఫిబ్రవరి 18న తదుపరి విచారణకు రానుంది.
తాజావార్తలు
-
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
-
Rahul Gandhi: ప్రధాని ఇంటి ముందు ధర్నాకు రావాలి.. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ విజ్ఞప్తి
-
El Nino : ఎల్నీనో ఎఫెక్ట్.. తెలంగాణలో డ్రౌట్ అలర్ట్.!
-
Ambati Rambabu: నా దిష్టిబొమ్మ తగలబెడితే గడ్డి కాలడం తప్ప నాకేం కాదు: అంబటి రాంబాబు
-
AAP: ప్రధాని నివాసం ముందు ధర్నా.. కాంగ్రెస్పై ఆప్ ఎదురుదాడి
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!