Pakistan: పాక్ ఆర్మీని చావు దెబ్బతీసిన బీఎల్ఏ.. 90 మంది మృతి..
- పాక్ ఆర్మీని చావు దెబ్బ తీసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ..
- వరసగా దాడులు చేస్తూ పాకిస్తాన్కి ముప్పతిప్పలు పెడుతున్న బీఎల్ఏ..
- సైనిక కాన్వాయ్ లక్ష్యంగా దాడి, 90 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ సైన్యానికి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే ట్రైన్ హైజాక్తో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని సవాల్ చేసింది. బెలూచిస్తాన్ని విముక్తి చేసేందుకు సాయుధ పోరాటం చేస్తున్న బీఎల్ఏ పాక్ ఆర్మీని ముప్పుతిప్పలు పెడుతోంది. నిజానికి బలూచ్ ప్రావిన్సులో కొన్ని ప్రాంతాల్లో తప్పితే, మరే ప్రాంతానికి కూడా పాక్ అధికారులు, సైన్యం వెళ్లలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే జఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఘటనలో, బీఎల్ఏ డిమాండ్లకు పాక్ ప్రభుత్వం తలొగ్గకపోవడంతో 200 మందికి పైగా ఆర్మీ సిబ్బందిని చింపేసినట్లు బీఎల్ఏ ప్రకటించింది.
Read Also: CNG cars: ప్రీమియం ఫీచర్లు.. మైలేజీలో తోపు.. టాప్ వేరియంట్ CNG కార్లు ఇవే
Also Read
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
ఇదెలా ఉంటే, తాజాగా క్వెట్టా నుంచి టఫ్తాన్ వెళ్తున్న పాకిస్తాన్ సైనికులు కాన్వాయ్పై జరిగిన దాడిలో కనీసం ఏడుగురు సైనికులు మరణించగా, 21 మంది గాయపడినట్లు అధికార వర్గాలు చెప్పాయి. అయితే, బీఎల్ఏ ఈ దాడికి బాధ్యత వహించినట్లు పేర్కొంది. 90 మంది సైనిక సిబ్బంది మరణించినట్లు చెప్పింది. ఏడు బస్సులు, రెండు వాహనాలతో కూడిన కాన్వాయ్పై బీఏల్ఏ ఐఈడీ బాంబులు, ఆర్పీజీలతో దాడులు చేసింది. కాన్వాయ్ని చుట్టుముట్టి దాడులు నిర్వహించింది.
ఈ ఘటన తర్వాత గాయపడిన వారిని తరలించడానికి ఆర్మీ హెలికాప్టర్లను మోహరించింది. ఈ ప్రాంతంలో నిఘా కోసం డ్రోన్లను ఉపయోగిస్తోంది. ‘‘ఆదివారం బీఎల్ఏ చేసిన దాడిలో, బీఎల్ఏకి చెందిన ఫిరాయి యూనిట్ అయిన మజీద్ బ్రిగేడ్, కొన్ని గంటల క్రితం నోష్కిలోని ఆర్సీడీ హైవేపై రక్షన్ మిల్ సమీపంలో జరిగిన దాడిలో ఆక్రమిత పాకిస్తాన్ మిలిటరీ కాన్వాయ్ని లక్ష్యంగా చేసుకున్నాము. కాన్వాయ్లో 8 బస్సులు ఉన్నాయి. వాటిలో ఒకటి పేలుడు ధాడికి పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడిలో 90 మంది పాక్ సైనిక సిబ్బంది మరణించారు’’ అని బీఎల్ఏ ఒక ప్రకటనలో పేర్కొంది. దాడి జరిగిన వెంటనే బీఎల్ఏకి చెందిన ఫతే స్క్వాడ్ మరో బస్సుని చుట్టుముట్టింది. అందులో ఉన్న సైనిక సిబ్బందిని క్రమపద్ధతిలో తొలగించింది. మొత్తం శత్రువుల మరణాలు(పాక్ ఆర్మీ సిబ్బంది) 90కి చేరుకున్నట్లు చెప్పింది.
తాజావార్తలు
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Off The Record : కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి సీఎం చంద్రబాబు వార్నింగ్..?
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!