Pakistan: పాక్ ఆర్మీని చావు దెబ్బతీసిన బీఎల్ఏ.. 90 మంది మృతి..
- పాక్ ఆర్మీని చావు దెబ్బ తీసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ..
- వరసగా దాడులు చేస్తూ పాకిస్తాన్కి ముప్పతిప్పలు పెడుతున్న బీఎల్ఏ..
- సైనిక కాన్వాయ్ లక్ష్యంగా దాడి, 90 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ సైన్యానికి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే ట్రైన్ హైజాక్తో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని సవాల్ చేసింది. బెలూచిస్తాన్ని విముక్తి చేసేందుకు సాయుధ పోరాటం చేస్తున్న బీఎల్ఏ పాక్ ఆర్మీని ముప్పుతిప్పలు పెడుతోంది. నిజానికి బలూచ్ ప్రావిన్సులో కొన్ని ప్రాంతాల్లో తప్పితే, మరే ప్రాంతానికి కూడా పాక్ అధికారులు, సైన్యం వెళ్లలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే జఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఘటనలో, బీఎల్ఏ డిమాండ్లకు పాక్ ప్రభుత్వం తలొగ్గకపోవడంతో 200 మందికి పైగా ఆర్మీ సిబ్బందిని చింపేసినట్లు బీఎల్ఏ ప్రకటించింది.
Read Also: CNG cars: ప్రీమియం ఫీచర్లు.. మైలేజీలో తోపు.. టాప్ వేరియంట్ CNG కార్లు ఇవే
Also Read
- Iran-US: ఈసారి బాధాకరమైన పరిణామాలుంటాయి.. అమెరికాకు ఇరాన్ వార్నింగ్
- Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
- Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
- Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు...
ఇదెలా ఉంటే, తాజాగా క్వెట్టా నుంచి టఫ్తాన్ వెళ్తున్న పాకిస్తాన్ సైనికులు కాన్వాయ్పై జరిగిన దాడిలో కనీసం ఏడుగురు సైనికులు మరణించగా, 21 మంది గాయపడినట్లు అధికార వర్గాలు చెప్పాయి. అయితే, బీఎల్ఏ ఈ దాడికి బాధ్యత వహించినట్లు పేర్కొంది. 90 మంది సైనిక సిబ్బంది మరణించినట్లు చెప్పింది. ఏడు బస్సులు, రెండు వాహనాలతో కూడిన కాన్వాయ్పై బీఏల్ఏ ఐఈడీ బాంబులు, ఆర్పీజీలతో దాడులు చేసింది. కాన్వాయ్ని చుట్టుముట్టి దాడులు నిర్వహించింది.
ఈ ఘటన తర్వాత గాయపడిన వారిని తరలించడానికి ఆర్మీ హెలికాప్టర్లను మోహరించింది. ఈ ప్రాంతంలో నిఘా కోసం డ్రోన్లను ఉపయోగిస్తోంది. ‘‘ఆదివారం బీఎల్ఏ చేసిన దాడిలో, బీఎల్ఏకి చెందిన ఫిరాయి యూనిట్ అయిన మజీద్ బ్రిగేడ్, కొన్ని గంటల క్రితం నోష్కిలోని ఆర్సీడీ హైవేపై రక్షన్ మిల్ సమీపంలో జరిగిన దాడిలో ఆక్రమిత పాకిస్తాన్ మిలిటరీ కాన్వాయ్ని లక్ష్యంగా చేసుకున్నాము. కాన్వాయ్లో 8 బస్సులు ఉన్నాయి. వాటిలో ఒకటి పేలుడు ధాడికి పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడిలో 90 మంది పాక్ సైనిక సిబ్బంది మరణించారు’’ అని బీఎల్ఏ ఒక ప్రకటనలో పేర్కొంది. దాడి జరిగిన వెంటనే బీఎల్ఏకి చెందిన ఫతే స్క్వాడ్ మరో బస్సుని చుట్టుముట్టింది. అందులో ఉన్న సైనిక సిబ్బందిని క్రమపద్ధతిలో తొలగించింది. మొత్తం శత్రువుల మరణాలు(పాక్ ఆర్మీ సిబ్బంది) 90కి చేరుకున్నట్లు చెప్పింది.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
-
Deewana : గుండెల్ని పిండేసే లవ్ స్టోరీ.. ‘దీవానా’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
-
Vizag Steel Plant Accident: విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం ఎఫెక్ట్.. కీలక అధికారులపై వేటు..
-
New IRCTC Website: శుభవార్త చెప్పిన రైల్వే మంత్రి.. జులై 15 నాటికి అందుబాటులోకి కొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్..
-
Jagapathi Babu: ‘పెద్ది’పై కావాలనే నెగిటివిటీ.. గెలిచినా పోరాడాల్సి వస్తోంది !
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!