Pakistan: పాక్ ఆర్మీని చావు దెబ్బతీసిన బీఎల్ఏ.. 90 మంది మృతి..
- పాక్ ఆర్మీని చావు దెబ్బ తీసిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ..
- వరసగా దాడులు చేస్తూ పాకిస్తాన్కి ముప్పతిప్పలు పెడుతున్న బీఎల్ఏ..
- సైనిక కాన్వాయ్ లక్ష్యంగా దాడి, 90 మంది మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ సైన్యానికి బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) చుక్కలు చూపిస్తోంది. ఇప్పటికే ట్రైన్ హైజాక్తో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని సవాల్ చేసింది. బెలూచిస్తాన్ని విముక్తి చేసేందుకు సాయుధ పోరాటం చేస్తున్న బీఎల్ఏ పాక్ ఆర్మీని ముప్పుతిప్పలు పెడుతోంది. నిజానికి బలూచ్ ప్రావిన్సులో కొన్ని ప్రాంతాల్లో తప్పితే, మరే ప్రాంతానికి కూడా పాక్ అధికారులు, సైన్యం వెళ్లలేని పరిస్థితి ఉంది. ఇప్పటికే జఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఘటనలో, బీఎల్ఏ డిమాండ్లకు పాక్ ప్రభుత్వం తలొగ్గకపోవడంతో 200 మందికి పైగా ఆర్మీ సిబ్బందిని చింపేసినట్లు బీఎల్ఏ ప్రకటించింది.
Read Also: CNG cars: ప్రీమియం ఫీచర్లు.. మైలేజీలో తోపు.. టాప్ వేరియంట్ CNG కార్లు ఇవే
Also Read
- China: కొత్త గేమ్కి రెడీ అవుతున్న చైనా.. ప్రపంచానికి షాక్ తప్పదా?
- Israel-Iran: పర్వతం కింద అణు పదార్థం.. ఇరాన్పై ఇజ్రాయిల్ సంచలన రిపోర్ట్..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై భారత్ కీలక నిర్ణయం.. పాక్కు స్పష్టమైన సందేశం..
- Crude Oil Prices: మరో షాక్.. హార్మూజ్ తర్వాత కొత్త సంక్షోభం.. ముడి చమురు ధరలు భారీగా పెరుగుతాయా..?
ఇదెలా ఉంటే, తాజాగా క్వెట్టా నుంచి టఫ్తాన్ వెళ్తున్న పాకిస్తాన్ సైనికులు కాన్వాయ్పై జరిగిన దాడిలో కనీసం ఏడుగురు సైనికులు మరణించగా, 21 మంది గాయపడినట్లు అధికార వర్గాలు చెప్పాయి. అయితే, బీఎల్ఏ ఈ దాడికి బాధ్యత వహించినట్లు పేర్కొంది. 90 మంది సైనిక సిబ్బంది మరణించినట్లు చెప్పింది. ఏడు బస్సులు, రెండు వాహనాలతో కూడిన కాన్వాయ్పై బీఏల్ఏ ఐఈడీ బాంబులు, ఆర్పీజీలతో దాడులు చేసింది. కాన్వాయ్ని చుట్టుముట్టి దాడులు నిర్వహించింది.
ఈ ఘటన తర్వాత గాయపడిన వారిని తరలించడానికి ఆర్మీ హెలికాప్టర్లను మోహరించింది. ఈ ప్రాంతంలో నిఘా కోసం డ్రోన్లను ఉపయోగిస్తోంది. ‘‘ఆదివారం బీఎల్ఏ చేసిన దాడిలో, బీఎల్ఏకి చెందిన ఫిరాయి యూనిట్ అయిన మజీద్ బ్రిగేడ్, కొన్ని గంటల క్రితం నోష్కిలోని ఆర్సీడీ హైవేపై రక్షన్ మిల్ సమీపంలో జరిగిన దాడిలో ఆక్రమిత పాకిస్తాన్ మిలిటరీ కాన్వాయ్ని లక్ష్యంగా చేసుకున్నాము. కాన్వాయ్లో 8 బస్సులు ఉన్నాయి. వాటిలో ఒకటి పేలుడు ధాడికి పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడిలో 90 మంది పాక్ సైనిక సిబ్బంది మరణించారు’’ అని బీఎల్ఏ ఒక ప్రకటనలో పేర్కొంది. దాడి జరిగిన వెంటనే బీఎల్ఏకి చెందిన ఫతే స్క్వాడ్ మరో బస్సుని చుట్టుముట్టింది. అందులో ఉన్న సైనిక సిబ్బందిని క్రమపద్ధతిలో తొలగించింది. మొత్తం శత్రువుల మరణాలు(పాక్ ఆర్మీ సిబ్బంది) 90కి చేరుకున్నట్లు చెప్పింది.
తాజావార్తలు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
-
Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్మైండ్ అరెస్ట్!
-
OG Telivision Premiere : బుల్లితెర వీక్షకులను అలరించేందుకు వస్తున్న’OG’
-
Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!