Mamata Benerjee: మోడీకి మద్దతుగా మమత కామెంట్స్.. ఆశ్చర్యంలో పార్టీ నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Benerjee: ప్రధానిపై మోడీపై వీలు చిక్కినప్పుడల్లా విమర్శనాస్త్రాలు సంధిస్తారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కానీ బెంగాల్ అసెంబ్లీలో మోడీకి మద్దతుగా మాట్లాడడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. కేంద్ర దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై బెంగాల్ అసెంబ్లీలో సోమవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన మమత.. సీబీఐ, ఈడీకి బయపడి దేశంలోని వ్యాపారస్థులు విదేశాలకు పారిపోతున్న విషయాన్ని ప్రస్తావించారు. పశ్చిమ బెంగాల్లో సీబీఐ, ఈడీ దాడులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ దాడుల వెనుక ప్రధాని మోడీ ఉన్నారని తాను అనుకోవడం లేదని భావిస్తున్నట్లు చెప్పారు.
బీజేపీలోని ఒక వర్గం నేతలు మాత్రమే తమ స్వలాభం కోసం అధికారాన్ని దుర్వినియోం చేస్తున్నారని ఆరోపించారు. సీబీఐ హోంశాఖ పరిధిలోకి వస్తుందని, ప్రధాని కార్యాలయానికి దీనితో సంబంధం లేదని చెప్పారు. కొందరు బీజేపీ నేతలు తరచూ హోంమంత్రిని కలిసి తమపై కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎప్పుడూ మోదీపై విమర్శలు గుప్పించే మమత.. ఇప్పుడు ఆయనకు మద్దతుగా మాట్లాడటం సొంత పార్టీ నేతలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.
Also Read
- Ashok Gehlot: కాంగ్రెస్లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
- Anil Vij: "బొద్దింకల్ని చెప్పుతో నలిపేస్తారు".. కాక్రోచ్ పార్టీకి బీజేపీ మంత్రి సలహా..
Shashi Tharoor: కాంగ్రెస్ అధ్యక్ష పోటీలో శశిథరూర్.. ఓకే చెప్పిన సోనియా!
పశ్చిమ బెంగాల్లో సీబీఐ, ఈడీ దాడులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ దాడుల వెనుక ప్రధాని మోదీ ఉన్నారని తాను అనుకోవడం లేదని చెప్పారు. భాజపాలోని ఒక వర్గం నేతలు మాత్రమే తమ స్వలాభం కోసం అధికారాన్ని దుర్వినియోం చేస్తున్నారని ఆరోపించారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం కేంద్ర దర్యాప్తు సంస్థల మితిమీరిన జోక్యం చేసుకుంటున్నాయంటూ ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం అజెండాను, పార్టీ ప్రయోజనాలను కలిపి చూడొద్దని ఈ సందర్భంగా ప్రధాని మోడీని మమత కోరారు. ఇది ఏ ఒక్కరినీ వ్యతిరేకిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానం కాదని, స్వతంత్ర దర్యాప్తు సంస్థలు ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ ప్రవేశపెట్టినట్టు మమత పేర్కొన్నారు. రాష్ట్రంలో పలువురు నేతలపై సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో టీఎంసీ నేతలు నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా ఈ తీర్మానం ప్రవేశపెట్టారు.
మమత వ్యాఖ్యలపై బీజేపీ నేత సువేంధు అధికారి స్పందించారు. బొగ్గు కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అల్లుడు అభిషేక్ బెనర్జీని కాపాడుకునేందుకే ఆమె ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. మమత కుతంత్రాలను బీజేపీ ఆ మాత్రం పసిగట్టలేదా అని సెటైర్లు వేశారు.
తాజావార్తలు
-
Ashok Gehlot: కాంగ్రెస్లో నాపై కుట్ర.. అధ్యక్ష పదవి లాక్కున్నారు
-
Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!