Mamata Banerjee: సిగ్గుపడాలి.. పాలకులే హంతకులుగా మారారు.. బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
- పాలకులే హంతకులుగా మారారు
- బీజేపీ ప్రభుత్వంపై మమత ఆగ్రహం
- అభిషేక్ బెనర్జీపై దాడి చేసిన ప్రజలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాలకులే హంతకులుగా మారారని.. బెంగాల్ బీజేపీ ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనార్పూర్లో మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడిపై ఎక్స్లో స్పందిస్తూ ఫైరయ్యారు. ‘‘వారు సిగ్గుపడాలి.. పాలకులు హంతకులుగా మారారు. బీజేపీకి సిగ్గుచేటు.’’ అని పేర్కొన్నారు.
ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లలో గాయపడిన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. ఈ సమయంలో
సోనార్పూర్లో అభిషేక్పై దాడి జరిగింది. గ్రామస్తులు ఇష్టానురీతిగా దాడి చేశారు. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో అభిషేక్ బెనర్జీ హెల్మెట్ ధరించి అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపింది. ఈ ఘటనకు ప్రభుత్వం సిగ్గుపడాలని మమతా బెనర్జీ విమర్శించారు. బీజేపీ మద్దతు ఉన్న దుండగులు దారుణంగా దాడి చేసినప్పటికీ… మా జాతీయ ప్రధాన కార్యదర్శి వెనకడుగు వేయలేదని.. పైగా ఆ కుటుంబానికి అండగా నిలిచారని టీఎంసీ తన అధికారిక ఖాతాలో పోస్ట్ చేసింది. మమతా బెనర్జీ ఈ ట్వీట్ను రీట్వీట్ చేసి ప్రకటన విడుదల చేశారు.
Also Read
- Kesar Mango Record: పండ్ల రాజు గిర్ కేసర్ మామిడి.. 10 ఏళ్ల రికార్డులు బద్దలు
- Uddhav Thackeray: అధికారం కోసం కాదు, సిద్ధాంతాల కోసమే పదవిని వదులుకున్నా: ఉద్ధవ్ ఠాక్రే
- MK Stalin: రాహుల్గాంధీకి వెరైటీగా బర్త్డే విషెస్ చెప్పిన స్టాలిన్
- Rahul Gandhi: ఖర్గే ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేసిన రాహుల్ గాంధీ.. అభిమానులతో ఫొటోలు
“దొంగ.. దొంగ” అంటూ బీజేపీ నినాదాలు
పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లా సోనార్పూర్లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండలో గాయపడిన బాధితులను పరామర్శించడానికి వెళ్లిన తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ (టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీపై శనివారం కొందరు దాడి చేశారు. డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడిగా ఉన్న బెనర్జీపై రాళ్లు, గుడ్లు విసిరారు. అంతేకాకుండా, కొందరు వ్యక్తులు ఆయనపై చెంపదెబ్బ కొట్టడానికి ప్రయత్నించి, కాళ్లతో తన్నారు. పార్టీలో నంబర్ 2గా పరిగణించే ఆయనపై ఈ దాడి జరగడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.
ఇదే సమయంలో అక్కడ పెద్ద ఎత్తున మోహరించిన భారతీయ జనతా పార్టీ (BJP) కార్యకర్తలు టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీని టార్గెట్ చేస్తూ తీవ్ర నిరసనలకు దిగారు. ఆయనను ఉద్దేశించి “దొంగ.. దొంగ” (చోర్.. చోర్) అంటూ గట్టిగా నినాదాలు చేస్తూ ముట్టడించే ప్రయత్నం చేశారు. మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడైన అభిషేక్ బెనర్జీపై నడిరోడ్డుపై దాడి జరగడం, అదే సమయంలో బీజేపీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించడంతో సోనార్పూర్లో పరిస్థితి ఒక్కసారిగా అదుపు తప్పింది. టీఎంసీ, బీజేపీ కార్యకర్తల పోటాపోటీ చర్యలతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు.
#WATCH | Sonarpur, West Bengal: TMC MP Abhishek Banerjee was attacked during his visit to Sonarpur to meet the post-poll violence victims' families
He says, "It's all BJP-sponsored. Look what they have done. This is their example of democracy. It hasn't even been a month,… pic.twitter.com/UXM9dzsb4U
— ANI (@ANI) May 30, 2026
West Bengal | On the attack on the party MP Abhishek Banerjee, TMC Chairperson Mamata Banerjee tweets, "Rulers became killers- shame on you BJP." https://t.co/MIZUJSZi3y pic.twitter.com/sBQZj1qZjd
— ANI (@ANI) May 30, 2026
తాజావార్తలు
-
Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!