Maldives: మాల్దీవులకు 33 శాతం తగ్గిన భారత టూరిస్టులు.. టాప్ ప్లేసులో చైనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maldives: మాల్దీవులకు కొత్త అధ్యక్షుడిగా మహ్మద్ ముయిజ్జూ వచ్చిన తర్వాత భారత వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ, చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ లక్షద్వీప్ వెళ్లిన సందర్భంలో మాల్దీవుల మంత్రులు ప్రధానిని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు క్షీణించాయి. ఈ పరిణామాలతో భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకులు తమ టికెట్స్, హోటల్ బుకింగ్స్ క్యాన్సిల్ చేసుకున్నారు.
తాజాగా మాల్దీవుల పర్యాటక మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన తాజా నివేదిక ప్రకారం ఆ దేశానికి వెళ్తున్న భారత పర్యాటకుల్లో గతేడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది 33 శాతం తగ్గింది. మార్చి 2023లో, 41,000 మంది భారతీయ పర్యాటకులు మాల్దీవులను సందర్శించారని, మార్చి 2024లో ఆ సంఖ్య కేవలం 27,224కి పడిపోయిందని, 33 శాతం క్షీణతను చూపుతుందని నివేదిక తెలిపింది. మార్చి 2023 వరకు, మార్కెట్లో 10 శాతం వాటాతో మాల్దీవులకు భారతదేశం రెండో అతిపెద్ద పర్యాటక వనరుగా ఉంటే, ప్రస్తుతం ఆరు శాతంతో ఆరో స్థానానికి పడిపోయింది.
Also Read
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Assam Shocker: భార్య తల నరికి ఫ్రిజ్లో పెట్టిన నిందితుడు.. పోలీసు వాహనం నుంచి దూకి మృతి
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్గా మారిన స్వీట్!
- Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా.. వైరల్గా మారిన ఘటన
Read Also: Sardar Ramesh Singh Arora: పాకిస్తాన్ చరిత్రలోనే తొలి సిక్కు మంత్రిగా సర్దార్ రమేష్ సింగ్ అరోరా..
భారత పర్యాటకులు తగ్గుతుంటే, మరోవైపు చైనా నుంచి పర్యాటకుల సంఖ్య అకాస్మాత్తుగా పెరిగింది. మాల్దీవులు-చైనా సంబంధాలు బలపడుతున్న వేళ 2024లో ఆ దేశానికి 54000 చైనా పర్యాటకులు వెళ్లారు. చైనా ప్రస్తుతం టూరిస్టుల లిస్టులో టాప్లో ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మాల్దీవులకు మొత్తం 2,17,394 మంది పర్యాటకులు వస్తే, వీరిలో 34,600 మంది చైనీయులు ఉన్నారు. 2021, 2022, 2023లో మాల్దీవులకు వెళ్లిన టూరిస్టుల్లో భారత్ టాప్ ప్లేస్లో ఉంది. ఏడాదికి 2 లక్షల కంటే ఎక్కువ మంది ఆ దేశానికి వెళ్లారు.
ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఇండియా వ్యతిరేక విధానాలను అవలంభిస్తు్న్నాడు. ఆ దేశంలో మానవతా సాయం అందిస్తున్న భారత సైనికుల్ని వెంటనే దేశం వదిలి వెళ్లాలని ఆదేశించాడు. ప్రధాని మోడీపై మాల్దీవుల మంత్రులు అవమానకరమైన పోస్టులు చేసిన వారం రోజులకే ముయిజ్జూ చైనాను సందర్శించాడు. ఈ దేశంలో సైనిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. చైనా నుంచి ఎక్కువ పర్యాటకులను తమ దేశానికి పంపాలని అతను కోరాడు.
తాజావార్తలు
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
-
Saif Ali Khan : సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో గణపతి విగ్రహం.. తయ్యారు చేసింది ఎవరో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే!
-
యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!