Maharashtra Political Crisis: ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఫడ్నవీస్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజకీయం తుది అంకానికి చేరుకుంది. బల పరీక్షకు ముందే ఉద్ధవ్ ఠాక్రే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. బుధవారం సుప్రీం కోర్ట్ బలపరీక్షకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఉద్ధవ్ ఠాక్రే, గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి తన రాజీనామాను సమర్పించారు. దీంతో రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి కుప్పకూలింది.
ఇదిలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కు మార్గం సుగమం అయింది. గవర్నర్, ఫడ్నవీస్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరే అవకాశం ఉంది. తమకు 161 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఫడ్నవీస్ చెబుతున్నారు. మూడో సారి ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఏర్పాటులో అనుసరించాల్సిన వ్యూహాల గురించి గురువారం 11 గంటలకు దేవేంద్ర ఫడ్నవీస్ ఇంట్లో బీజేపీ కోర్ కమిటీ సమావేశం కానుంది. కోర్ కమిటీ సమావేవం అనంతరం ప్రెస్ మీట్ ఉండనుంది. భవిష్యత్ కార్యాచరణ గురించి ఇటు బీజేపీ నేతలతో పాటు గోవాలో క్యాంప్ లో ఉన్న ఏక్ నాథ్ షిండేతో ఫోన్లో సంప్రదించనున్నారు ఫడ్నవీస్. గవర్నర్, ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరడం ఆలస్యం అయితే తామే అతిపెద్ద పార్టీగా (106 ఎమ్మెల్యేలు) ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గవర్నర్ కు తెలపనున్నారు.
Also Read
- Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
- CJI Surya Kant: లండన్లో సీజేఐ సూర్యకాంత్కు అవమానం.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై నిరసనలు
- Car Accident: యమునా ఎక్స్ప్రెస్వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
- Lalu-Rabri Security: లాలూ, రబ్రీదేవికి జెడ్ ప్లస్ భద్రత తొలగింపు.. కర్రలతో కాపలా కాస్తోన్న కార్యకర్తలు
గోవా తాజ్ రిసార్ట్ లో ఉన్న షిండే క్యాంప్ ఎమ్మెల్యేలను కలిశారు గోవా సీఎం ప్రమోద్ సావంత్. గవర్నర్ కోషియారి, దేవేంద్ర ఫడ్నవీస్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానిస్తే ప్రమాణ స్వీకారం సమాయానికి రెబెల్ వర్గం ముంబై చేరుకోవాలని బీజేపీ తెలియజేసినట్లు సమాచారం. రెబెల్ వర్గం ఎమ్మెల్యేలు ముంబైకి వస్తే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ముంబై, థానే, కళ్యాణ్ ప్రాంతాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో బలగాలు మోహరించాయి.
ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీ బలం చూస్తే బీజేపీకి సొంతంగా 106 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. శివసేన రెబెల్ వర్గం 39 మందితో పాటు ఎంపీజేఎస్ పార్టీకి చెందిన 02 ఎమ్మెల్యేలు, స్వతంత్రులు, చిన్న పార్టీల ఎమ్మెల్యేలు కలుపుకుని 18 మంది మద్దతు ఉంది. అయితే కొత్తగా ఏర్పాటు అయ్యే ప్రభుత్వంలో రెబెల్ వర్గంలోని 10 మందికి మంత్రి పదవులు వస్తాయని తెలుస్తోంది. సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఏక్ నాథ్ షిండే ప్రమాణం చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
-
Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
-
Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
-
Trump-Iran: ‘వాస్తవ ప్రపంచంలో జీవించండి’.. ట్రంప్కు ఇరాన్ ఘాటు రిప్లై
-
The Earth: భూగర్భ జలాల దోపిడి.. 31.5 అంగుళాలు వంగిన భూమి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!