Maharashtra Political Crisis: ప్రభుత్వ ఏర్పాటు దిశగా ఫడ్నవీస్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్ర రాజకీయం తుది అంకానికి చేరుకుంది. బల పరీక్షకు ముందే ఉద్ధవ్ ఠాక్రే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. బుధవారం సుప్రీం కోర్ట్ బలపరీక్షకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఉద్ధవ్ ఠాక్రే, గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి తన రాజీనామాను సమర్పించారు. దీంతో రెండున్నరేళ్లుగా అధికారంలో ఉన్న శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి కుప్పకూలింది.
ఇదిలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కు మార్గం సుగమం అయింది. గవర్నర్, ఫడ్నవీస్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరే అవకాశం ఉంది. తమకు 161 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఫడ్నవీస్ చెబుతున్నారు. మూడో సారి ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టనున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ ఏర్పాటులో అనుసరించాల్సిన వ్యూహాల గురించి గురువారం 11 గంటలకు దేవేంద్ర ఫడ్నవీస్ ఇంట్లో బీజేపీ కోర్ కమిటీ సమావేశం కానుంది. కోర్ కమిటీ సమావేవం అనంతరం ప్రెస్ మీట్ ఉండనుంది. భవిష్యత్ కార్యాచరణ గురించి ఇటు బీజేపీ నేతలతో పాటు గోవాలో క్యాంప్ లో ఉన్న ఏక్ నాథ్ షిండేతో ఫోన్లో సంప్రదించనున్నారు ఫడ్నవీస్. గవర్నర్, ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరడం ఆలస్యం అయితే తామే అతిపెద్ద పార్టీగా (106 ఎమ్మెల్యేలు) ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గవర్నర్ కు తెలపనున్నారు.
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
గోవా తాజ్ రిసార్ట్ లో ఉన్న షిండే క్యాంప్ ఎమ్మెల్యేలను కలిశారు గోవా సీఎం ప్రమోద్ సావంత్. గవర్నర్ కోషియారి, దేవేంద్ర ఫడ్నవీస్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానిస్తే ప్రమాణ స్వీకారం సమాయానికి రెబెల్ వర్గం ముంబై చేరుకోవాలని బీజేపీ తెలియజేసినట్లు సమాచారం. రెబెల్ వర్గం ఎమ్మెల్యేలు ముంబైకి వస్తే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ముంబై, థానే, కళ్యాణ్ ప్రాంతాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో బలగాలు మోహరించాయి.
ప్రస్తుతం అసెంబ్లీలో బీజేపీ బలం చూస్తే బీజేపీకి సొంతంగా 106 ఎమ్మెల్యేల మద్దతు ఉంది. శివసేన రెబెల్ వర్గం 39 మందితో పాటు ఎంపీజేఎస్ పార్టీకి చెందిన 02 ఎమ్మెల్యేలు, స్వతంత్రులు, చిన్న పార్టీల ఎమ్మెల్యేలు కలుపుకుని 18 మంది మద్దతు ఉంది. అయితే కొత్తగా ఏర్పాటు అయ్యే ప్రభుత్వంలో రెబెల్ వర్గంలోని 10 మందికి మంత్రి పదవులు వస్తాయని తెలుస్తోంది. సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా ఏక్ నాథ్ షిండే ప్రమాణం చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!