MP High Court: ” వేరే వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకున్న వివాహిత”.. హైకోర్టు కీలక తీర్పు..
- వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకున్న వివాహిత..
- తప్పుడు వివాహ హామీతో సంబంధం పెట్టుకున్నన్న మహిళ..
- వివాహిత స్త్రీ ‘‘తప్పుడు హామీ’’తో అంగీకరించానని చెప్పడం సరైంది కాదన్న కోర్టు..
- నిందితుడిపై దాఖలైన అత్యాచారం కేసుని కొట్టేసిన న్యాయస్థానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP High Court: ఒక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకున్న వివాహిత మహిళ దాఖలు చేసిన అత్యాచారం కేసుని మధ్యప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. పెళ్లి చేసుకుంటాననే హామీపై వివాహిత స్త్రీ మరొక పురుషుడితో శారీరక సంబంధానికి సమ్మతించానని చెప్పుకోవడానికి వీలులేదని జస్టిస్ మణీందర్ ఎస్ భట్టీ తన తీర్పులో వెల్లడించారు. తప్పుడు వివాహ హమీ సాకుతో శారీరక సంబంధానికి అంగీకరించానని వివాహిత స్త్రీ చెప్పడం సరైనది కాదని హైకోర్టు పేర్కొంది.
వివాహిత తనతో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు ఫిర్యాదు చేయడంతో ఒక వ్యక్తిపై అత్యాచారం కేసు నమోదైంది. ఈ కేసు ఫిబ్రవరి 10న హైకోర్టులో విచారణకు వచ్చింది. సదరు వ్యక్తిపై ఉన్న అత్యాచారం కేసుని న్యాయమూర్తి కొట్టివేశారు. సదరు పురుషుడు తన భార్యకు విడాకులు ఇచ్చి, తనను పెళ్లి చేసుకుంటాననే హామీ ఇచ్చినట్లు, దీని ఆధారంగానే అతడితో లైంగిక సంబంధం ఏర్పరచుకున్నట్లు వివాహిత పేర్కొంది.
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
Read Also: Vishvambhara : విశ్వంభర సినిమాలో ఆ పాటకు థియేటర్లలో బాక్స్ లు బద్దలు కావడం ఖాయం
ఫిర్యాదుదారు వివాహిత అయినప్పుడు, తప్పుడు వాగ్దానం సాకుతో శారీరక సంబంధానికి సమ్మతి ఇవ్వడం, ‘‘వాస్తవానికి దురాభిప్రాయంగా’’ పరిగణించలేమని న్యాయమూర్తి పేర్కొన్నారు. శారీరక సంబంధం పెట్టుకున్న వివాహిత మహిళ, సదరు వ్యక్తి తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి హైకోర్టుని ఆశ్రయించాడు. అప్పటికే మహిళకి వేరే వ్యక్తితో పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
మహిళ ఫిర్యాదు ప్రకారం.. నిందితుడు, మహిళ ఒకే ఏరియాలో నివసించే వారు. మూడు నెలల స్నేహం తర్వాత వీరిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. తన భార్యకు విడాకులు ఇచ్చి, పెళ్లి చేసుకుంటానని నిందితుడు మొదట హామీ ఇచ్చాడు. ఆ తర్వాత భార్యకు విడాకులు ఇచ్చే పరిస్థితి లేదని వెనక్కి తగ్గాడని ఆరోపించింది. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, ఫిర్యాదు చేసిన వివాహిత స్త్రీని బలవంతంగా ఒత్తిడి చేసి లైంగిక సంబంధంలోకి ప్రవేశించేలా చేసినట్లు ఎఫ్ఐఆర్లో ఎలాంటి వివరాలు లేవని కోర్టు గుర్తించింది. ఫిర్యాదు స్వయంగా నేరం జరిగిందని సూచించలేదు కాబట్టి, ఇలాంటి ఎఫ్ఐఆర్లను తొలి లోనే తుంచేయాలని జస్టిస్ భట్టి అన్నారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!