Madhya Pradesh: భోజ్శాల ఆలయం-కమల్ మౌలా మసీదుపై రేపటి నుంచి ఏఎస్ఐ సర్వే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: మధ్యప్రదేశ్ ధార్లోని వివాదాస్పద భోజ్శాల ఆలయం కాంప్లెక్స్ ఆలయంలో రేపటి నుంచి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) సర్వే ప్రారంభించనుంది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు భోజ్శాల-కమల్ మౌలా మసీదు ప్రాంగణంలో సర్వే చేపట్టనున్నట్లు ఏఎస్ఐ గురువారం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెల ప్రారంభంలో భోజ్శాల ఆలయం, కమల్ మౌలా మసీదు ‘మల్టీ డిసిప్లినరీ సైంటిఫిక్ సర్వే’ సర్వే చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ వివాదం గతంలో మతఘర్షణలకు కారణమైంది. రెండు వర్గాలు కూడా దీనిపై తమకే హక్కులు ఉన్నాయని క్లెయిమ్ చేసుకుంటున్న తరుణంలో ఈ వివాదాస్పద ప్రాంతం నిజ స్వరూపం, స్వభావాన్ని నిర్ధారించేందుకు హైకోర్టు ఆదేశించింది. ఏఎస్ఐ సర్వే నేపథ్యంలో ధార్ ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. సర్వే పనులకు అందరూ సహకరించాలని ధార్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సర్వే పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
Read Also: Actress Accident: ఇంకా విషమంగానే జయలక్ష్మీ ఆరోగ్యం.. విరాళాల కోసం కుటుంబం ఎదురు చూపులు!
Also Read
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
- Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తులు ఎస్ఏ ధర్మాధికారి, దేవనారాయణ్ మిశ్రాలతో కూడిన డివిజన్ బెంచ్, ఐదుగురు సీనియర్ అధికారులతో కూడిన ప్యానెల్ ఏర్పాటు చేయాలని ఏఎస్ఐని ఆదేశించింది. ఆరువారాల్లో నివేదిక సమర్పించాలని కోరింది. భోజ్శాలను సరస్వతి ఆలయంగా హిందువులు భావిస్తున్నారు, 11వ శతాబ్ధానికి చెందిన స్మారక చిహ్నాలను ఏఎస్ఐ రక్షిస్తోంది. ఇదిలా ఉంటే ముస్లిం వర్గం దీనిని మసీదుగా పేర్కొంటోంది. ఏప్రిల్ 2003 నుంచి ఏఎస్ఐ ఆదేశాల మేరకు హిందువులు మంగళవారం పూజలు నిర్వహిస్తుంటే, శుక్రవారం ముస్లింలు నమాజ్ చేస్తున్నారు. కోర్టు విచారణలో 1958 మాన్యుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 16పై దృష్టి సారించింది. ఇది ప్రార్థనా స్థలాల దుర్వినియోగం, అపవిత్రం నుంచి రక్షణ ఇచ్చేందుకు సంబంధించినది. ప్రాథమికతను నిర్ణయించడానికి ప్రార్థనా స్థలం యొక్క స్వభావాన్ని నిర్ణయించడం చాలా అవసరం అని కోర్టు పేర్కొంది.
Madhya Pradesh | ASI (Archaeological Survey of India) survey of Bhojshala in Dhar to begin tomorrow, 22nd March, after the order of High Court, Madhya Pradesh at Indore. pic.twitter.com/T9le6PfZl3
— ANI (@ANI) March 21, 2024
తాజావార్తలు
-
IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
-
Vishwa Prasad : అందుకే సుమలతకు సపోర్ట్ చేయడానికి వచ్చా!
-
PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
-
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..