Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Lt Governor Orders Probe Into Aap Schemes

AAP Vs LG: ఆప్ పథకాలపై లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశం

Published Date :December 28, 2024 , 4:04 pm
By Suresh Maddala
  • ఆప్ పథకాలపై లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశం
  • కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు వీకే.సక్సేనా ఆదేశాలు
  • ఎల్జీ తీరును తప్పుపట్టిన ఆమ్ ఆద్మీ ప్రభుత్వం
AAP Vs LG: ఆప్ పథకాలపై లెఫ్టినెంట్ గవర్నర్ విచారణకు ఆదేశం
  • Follow Us :
  • google news
  • dailyhunt

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ఆప్ ప్రభుత్వం వర్సెస్ లెఫ్టినెంట్ గవర్నర్‌ వ్యవహారం మరోసారి హీటెక్కుతోంది. ఎన్నికల ముంగిట ఘర్షణ వాతావరణం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. త్వరలోనే హస్తినలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే సన్నద్ధమైపోయింది. ఆయా స్కీమ్‌లు ప్రకటించుకుంటూ వెళ్లిపోతుంది. 60 ఏళ్లు దాటిన వృద్ధులకు ఉచిత వైద్యం, మహిళలకు నెలకు రూ.2,100 నగదు సాయం వంటి పథకాలను ప్రకటించింది. ఇందుకోసం ఇంటింటా తిరుగుతూ ఆప్ శ్రేణులు వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పుడు ఇదే రాజకీయ దుమారం రేపుతోంది. వ్యక్తిగత వివరాలు సేకరించడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇది కూడా చదవండి: Pawan Kalyan: “ఎప్పుడు ఏ స్లోగన్‌ ఇవ్వాలో మీకు తెలియదు”.. అభిమానులపై పవన్ ఫైర్ (వీడియో)

ఆప్ పథకాలపై విచారణ జరపాలంటూ కాంగ్రెస్ నాయకుడు సందీప్ దీక్షిత్.. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే. సక్సేనాకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎల్జీ వీకే.సక్సేనా విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఢిల్లీ చీఫ్ సెక్రటరీ, పోలీస్ కమిషనర్‌కు వేర్వేరు ఆదేశాలు జారీ చేశారు. మహిళా సమ్మాన్ యోజన పేరుతో ఆమ్ పార్టీ నేతలు వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం, ఇంటింటికి పంజాబ్ ఇంటెలిజెన్స్ అధికారులు వెళ్తున్నారని.. అంతేకాకుండా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు పంజాబ్ నుంచి ఢిల్లీకి నగదు బదిలీ అవుతోందని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మహిళలకు నెలకు రూ.2,100 చెల్లింపుపై ఆందోళన వ్యక్తం చేశారు. లబ్ధిదారుల ఎన్‌రోల్‌మెంట్ పేరుతో ప్రైవేటు వ్యక్తులు వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై డివిజనల్ కమిషనర్ ద్వారా విచారణ జరిపించాలని ఎల్జీని కోరారు. అనధికార రిజిస్ట్రేషన్ క్యాంపులను నిర్వహించడం ద్వారా.. పౌరుల గోపత్యను తెలుసుకునేవారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత విజ్ఞప్తి చేయగా.. ఆ మేరకు వీకే.సక్సేనా దర్యాప్తునకు ఆదేశించారు.

ఇక కాంగ్రెస్ నేతల ఇళ్ల దగ్గర పంజాబ్ ఇంటెలిజెన్స్ అధికారులు మకాం వేశారని కాంగ్రెస్ ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు చేసి మూడు రోజుల్లో వివరణాత్మక నివేదికను సమర్పించాలని పోలీస్ కమిషనర్‌కు ఎల్జీ ఆదేశించారు. అంతేకాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి నగదు దిగుమతి అవుతుందన్న ఆరోపణల నేపథ్యంలో పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లో ఎటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరగకుండా పోలీసు బలగాలను అప్రమత్తం చేశారు. అంతేకాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని పోలీసులకు ఎల్జీ ఆదేశించారు.

లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలపై ఆప్ ధ్వజమెత్తింది. ఈ ఉత్తర్వు ఎల్జీ కార్యాలయం నుంచి రాలేదని.. అమిత్ షా కార్యాలయం నుంచి వచ్చిందని పేర్కొంది. మహిళలంటే గౌరవం లేదని.. మహిళా సమ్మాన్ యోజనను అడ్డుకునేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆప్ ఆరోపించింది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని అంగీకరించిందని.. ఈసారి బీజేపీకి డిపాజిట్లు గల్లంతవుతాయని ఆప్ పేర్కొంది. ప్రత్యర్థులను దెబ్బ తీసేందుకు కేంద్రం.. ఎల్జీని పావుగా ఉపయోగించుకుంటుందని ధ్వజమెత్తింది. ఆప్‌పై వచ్చిన ఆరోపణలను మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తోసిపుచ్చారు. ఈ ఆరోపణలు ఫేక్ అంటూ కొట్టిపారేశారు. ఏం దర్యాప్తు చేస్తారో చూస్తామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Bank Holidays In January: 2025 జనవరిలో దాదాపు 15 రోజులు బ్యాంక్ సెలవులు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AAP
  • AAP Schemes
  • Arvind Kejriwal
  • congress
  • Lt Governor Orders

తాజావార్తలు

  • Nora fatehi : ట్రోల్స్ చేసిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చిన హాట్ బ్యూటీ!

  • Shreya Ghoshal: సంచలన నిర్ణయం తీసుకున్న మరో స్టార్ సింగర్..

  • Nepal Elections: “జెన్ Z” నిరసనల తర్వాత, తొలిసారిగా నేపాల్‌లో ఎన్నికలు..

  • Today Horoscope: నేటి రాశిఫలాలు.. ఆ రాశి పిల్లల చదువు, ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిందే..!

  • IND vs ENG: నేడే సెమీఫైనల్-2.. ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడేది ఎవరో.!

ట్రెండింగ్‌

  • Summer Alert : శరీరంలో నీరు తగ్గిందని తెలిపే ‘రెడ్ ఫ్లాగ్’ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!

  • Karnataka Special Carrot Palya : నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రెసిపీ.. టేస్ట్ అదిరిపోతుంది.!

  • Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Stomach Pain After Eating.? తిన్న వెంటనే కడుపు నొప్పా..? ఈ 5 కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

  • Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. బిక్కుబిక్కుమంటున్న మదుపరులు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions