Pawan Kalyan: “ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు”.. అభిమానులపై పవన్ ఫైర్ (వీడియో)
- అభిమానులపై అసహనం వ్యక్తం చేసిన పవన్
- కడప రిమ్స్లో మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం
- భారీగా తరలి వచ్చిన అభిమానులు
- ఓజీ సినిమాపై స్లోగన్లు
- సీరియస్ అయిన పవన్ కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అభిమానులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబును పరామర్శించడానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఎంపీడీవో, కుటుంబీకులను పరామర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో పవన్ దాడి ఘటన గురించి మాట్లాడుతుండగా.. అక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు నినాదాలు చేయడం ప్రారంభించారు. ‘ఓజీ.. ఓజీ.. ఓజీ’ అంటూ స్లోగన్లు చేశారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన ఆయన.. ‘‘ఏంటయ్యా మీరు. ఎప్పుడు ఏ స్లోగన్ ఇవ్వాలో మీకు తెలియదు. పక్కకు రండి’’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. అనంతరం కొద్ది సేపు మౌనంగా ఉన్న పవన్ తర్వాత దాడి అంశంపై సీరియస్గా మాట్లాడారు.
READ MORE: Bank Holidays In January: 2025 జనవరిలో దాదాపు 15 రోజులు బ్యాంక్ సెలవులు..
Also Read
- Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
- 8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
- GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
- Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
ఇదిలా ఉండగా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా విధుల నిర్వహణలో చాలా బిజీగా ఉన్నారు. ఆయన చాలా రోజుల క్రితమే హరిహర వీరమల్లు , ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ అనే సినిమాలకు కమిట్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇక హరిహర వీరమల్లు సినిమాను మొదలు పెట్టిన తర్వాత భీమ్లా నాయక్, బ్రో అనే సినిమాలను మొదలు పెట్టి వాటిని పూర్తి చేసి విడుదల కూడా చేశాడు. ఇది ఇలా ఉంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ని పవన్ మొదలు పెట్టి కూడా చాలా కాలమే అవుతోంది. వాటితో పాటే ఓజీ మూవీకి కూడా మూహూర్తం పెట్టి చాన్నాళ్లే అవుతుంది. ఇలా ఈ మూడు సినిమాలను మొదలు పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ కావడంతో అవి కాస్త సైడ్ అయ్యాయి. ఈ సినిమాలను తెరపై చూసేందుకు అభిమానులు ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
GV Narayana Rao: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు కన్నుమూత
-
Sandeep Reddy Vanga: ప్రభాస్ ‘స్పిరిట్’ vs మహేశ్ ‘వారణాసి’.. క్లాష్పై వంగా కామెంట్ వైరల్!
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
ట్రెండింగ్
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?