LPG Crisis: వారికి కేంద్రం షాక్.. “నో బుకింగ్, సిలిండర్ సరెండల్ చేయాలి “..
- పీఎన్జీ కనెక్షన్ ఉన్నవారికి కేంద్రం షాక్..
- సిలిండర్ సరెండర్ చేయాలని ఆదేశాలు..
- కొత్త ఎల్పీజీ కనెక్షన్లకు, రీఫిల్ బుకింగ్స్కు నో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG Crisis: ఇరాన్ యుద్ధం దేశంలో వంటగ్యాస్ (LPG) ఆందోళన్ని పెంచుతోంది. యుద్ధం వల్ల ఎల్పీజీ కొరత ఏర్పడుతుందనే భయంతో ప్రజలు ‘‘పానిక్ బుకింగ్స్’’ చేస్తున్నారు. సాధారణం కన్నా ప్రతీ రోజు 25 లక్షల సిలిండర్లు ఎక్కువగా బుక్ అవుతున్నట్లు ఇటీవల కేంద్ర ప్రకటించింది. అయితే, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, దేశంలో చమురు, గ్యాస్ కొరత లేదని చెబుతోంది. అయినప్పటికీ, ప్రజల భయాలు ఇంకా తగ్గడం లేదు.
ఇదిలా ఉంటే, ఈ సంక్షోభం నేపథ్యంలో కేంద్రం కొందరికి షాక్ ఇచ్చింది. పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ మరియు డొమెస్టిక్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) కనెక్షన్ రెండూ ఉన్నవారు రెండో దాన్ని సరెండర్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా ప్రభుత్వ చమురు కంపెనీ లేదా పంపిణీదారుడు ద్వారా వారికి సిలిండర్ రీఫిల్ బుకింగ్స్ నిలిపేయాలని పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ శనివారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
Also Read
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
Read Also: Robin Uthappa: “ఇదే లాస్ట్”.. ఎంఎస్ ధోని రిటైర్మెంట్పై రాబిన్ ఉతప్ప సంచలన ప్రకటన..
నోటిఫికేషన్ ప్రకారం.. ఇంట్లో పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్ ఉన్న కుటుంబాలు తమ వద్ద ఉన్న డొమెస్టిక్ ఎల్పీజీ (సిలిండర్) కనెక్షన్ను వెంటనే సరెండర్ (వదులుకోవాలి) చేయాలని కేంద్ర పెట్రోలియం శాఖ ఆదేశించింది. పీఎన్జీ కనెక్షన్ ఉన్నవారు ఇకపై సిలిండర్ రీఫిల్స్ బుక్ చేయకూడదని, ప్రభుత్వ చమురు సంస్థల నుంచి కొత్త ఎల్పీజీ కనెక్షన్లు తీసుకోవడంపై కేంద్రం నిషేధించింది. ఈ నిబంధనలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం నోటిఫికేషన్ పేర్కొంది.
ఇరాన్, ఇజ్రాయిల్-అమెరికా యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. దీంతో గల్ఫ్ ప్రాంతాల నుంచి చమురు, గ్యా్స్ సరఫరాలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దిగమతి చేసుకుంటుంది. ఇందులో 85-90 శాతం సౌదీ, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల నుంచి వస్తోంది. ఈ కారణంగా దేశంలో ఎల్పీజీ సంక్షోభం ఏర్పడింది.
తాజావార్తలు
-
Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
-
Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
ISI Spy Trap: పాక్ ISI స్పై ట్రాప్.. ‘నగ్న ఫొటోలు’ ఎరగా వేసి భారత రక్షణ అధికారులను టార్గెట్ చేస్తున్న పాక్ ISI?
-
Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
ట్రెండింగ్
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!