Lok Sabha Polls 2024: ఎన్నికల ముందు కాంగ్రెస్కి భారీ షాక్.. బీజేపీలో చేరిన 200 మంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha Polls 2024: లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి వరసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పలువురు కీలక నేతలు ఆ పార్టీని వదిలి వెళ్తున్నారు. తాజాగా గుజరాత్ కాంగ్రెస్కి చెందిన 200 మంది నాయకులు ఈ రోజు బీజేపీలో చేరారు. కాంగ్రెస్కి మూలస్తంభాలుగా, అట్టడుగు స్థాయి నుంచి నేతలు కాంగ్రెస్ని విడిచిపెట్టి బీజేపీలో చేరుతున్నారని, కాంగ్రెస్ మునిగిపోయే నావలా కనిపిస్తోందని, ఆ పార్టీ విభజన, కుల రాజకీయాలపై దృష్టిసారించిందని బీజేపీ అధికార ప్రతినిధి ఆరోపించారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: అమిత్ షా.. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదు
Also Read
- Swine Flu H1N1 in India: H1N1 కొత్త వేరియంట్ వచ్చిందా? కరోనా లాంటి ముప్పు ఉందా? ICMR కీలక సమాచారం
- Kangana Ranaut: ‘వాళ్లంతా పనికిమాలిన వాళ్లు’.. తాప్సీ, బాబా రామ్దేవ్పై కంగనా ఘాటు వ్యాఖ్యలు
- CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
- Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
గుజరాత్ కాంగ్రెస్కి నాయకత్వం లేదని, పార్టీ క్షీణిస్తున్న దశలో మేము బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నామని వారంతా చెప్పారు. దేశ నిర్మాణం కోసం బీజేపీలో చేరుతున్నామని చెప్పారు. పురుషోత్తం రూపాలా, బీజేపీకి పూర్తి మద్దతు ఇస్తున్నామని పార్టీ మారిన కాంగ్రెస్ నేత చెప్పారు. అంతకుముందు మే 4న రాజ్కోట్ మాజీ మేయర్ మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అశోక్ దంగర్, బీజేపీ నాయకులు భరత్ బోఘ్రాలు, పురుషోత్తమ్ రూపాలా సమక్షంలో అధికారికంగా బీజేపీలో చేరారు.
మరోవైపు పాటీదార్ వర్గానికి చెందిన పురుషోత్తమ్ రూపాలా ఇటీవల క్షత్రియ వర్గంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆ వర్గం వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. రాజ్ పుత్, మొఘలుల మధ్య జరిగిన వివాహాల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చివరకు ఆయన క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. గుజరాత్ మే 7న ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపారంలో డబ్బే డబ్బు!
-
Gandhari: తాప్సీ ‘గాంధారి’కి విడుదలకు ముందే షాక్.. కాపీ ఆరోపణలతో ముదిరిన వివాదం!
-
Rajni Autobiography : ఆత్మకథ రాస్తున్న రజనీ.. సినిమాగా తీస్తే అదొక అద్భుతమే
-
YS Jagan: వైసీపీ ముఖ్య నేతలతో నేడు జగన్ కీలక భేటీ.. అజెండాలో కీలక అంశాలు
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!