Sajjala Ramakrishna Reddy: అమిత్ షా.. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీకి వచ్చిన కేంద్ర హోం మంత్రి ఆధారాలు లేకుండా వైసీపీ, జగన్ పై ఆరోపణలు చేశారని సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. టీడీపీ ఇప్పటి వరకు చేస్తున్న ఆరోపణలే అమిత్ షా చేశార చెప్పారు. డీబీటీ ద్వారా 2 లక్షల 70 వేల కోట్లు ఒక్క రూపాయి అవినీతికి అవకాశం లేకుండా లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు. జగన్ ప్రభుత్వంలో పారదర్శకంగా, అవినీతికి అవకాశం లేకుండా పాలన సాగిందన్నారు. బీజేపీ కేంద్రంలో ఉందని.. చెక్ చేస్తే అమిత్ షాకు తెలిసేదని పేర్కొన్నారు. చంద్ర బాబు హయాంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. అప్పుడు బీజేపీ ఆ కూటమిలో పార్టనర్ అని తెలిపారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ లో టీడీపీ పార్టనర్.. చంద్రబాబు అవినీతి చూడలేకే జనం 2019 లో చీకొట్టారన్నారు. కానీ 2019 ఎన్నికల ప్రచారంలో పోలవరం టీడీపీ ప్రభుత్వం ఏటీఎం అని ప్రధాని మోడీ అన్నారన్నారు. 2014 లో టీడీపీ జనసేన, బీజేపీ అధికారంలోకి వచ్చాయని.. 2017 వరకు పోలవరం విషయంను చంద్రబాబు ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు. చంద్ర బాబు పాపం వల్లే పోలవరం ఆలస్యం అయ్యిందన్నారు.
Also Read
- Kitchen Cleaning Hacks: కడాయిపై పేరుకుపోయిన మొండి మురికి, జిడ్డు తొలగించే సహజ పద్ధతి.. అమ్మమ్మ చెప్పిన సీక్రెట్ ఇదే
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
- Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
జగన్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండర్ కు వెళ్లి 8 వందల కోట్ల రూపాయలు వ్యయం తగ్గించారని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు వల్ల కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సివేవీ రావడం లేదన్నారు. కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టు కు సంబంధించి 2500 కోట్లు రీయింబర్స్మెంట్ రావాలని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారణం ఉంటే చంద్రబాబు లోపం పాపమని.. ఒత్తిడికి గురి అవుతున్న బీజేపీ నాయకత్వం ది మాత్రమే అన్నారు. అన్ని మతాలను వైయస్ జగన్ గౌరవిస్తారన్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభం ఒక ప్రైవేట్ కార్యక్రమన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తప్పడు ప్రచారంపై సీఐడీ కేసు మంచి పరిణామమని.. తప్పు చేసిన వారికి శిక్ష పడాలని ఉద్ఘాటించారు.
తాజావార్తలు
-
Anil Ravipudi: జగపతి బాబుతో కామెడీ సినిమా ప్రకటన.. అనిల్ రావిపూడి ధైర్యమిదే!
-
Kitchen Cleaning Hacks: కడాయిపై పేరుకుపోయిన మొండి మురికి, జిడ్డు తొలగించే సహజ పద్ధతి.. అమ్మమ్మ చెప్పిన సీక్రెట్ ఇదే
-
CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
-
Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
-
UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!