BJP: మీకు దమ్ముంటే ఇప్పుడు “భజరంగ్ దళ్”ని బ్యాన్ చేయండి.. కాంగ్రెస్కు సవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. భారీ మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది. 224 అసెంబ్లీ స్థానాలు ఉన్న 136 స్థానాలను గెలుచుకోగా.. బీజేపీ కేవలం 65 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. కింగ్ మేకర్ అవుతామని భావించిన జేడీఎస్ కేవలం 19 స్థానాల్లో గెలుపొందింది. దాదాపుగా 34 ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ గణనీయంగా ఓట్లను, సీట్లను సంపాదించుకుంది. బీజేపీకి పట్టున్న చోట్ల కూడా ఓడిపోవడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు.
Read Also: PM Shahbaz Sharif: ఇమ్రాన్ ఉగ్రవాది కన్నా తక్కువ కాదు.. ఆందోళకారుల అరెస్ట్కు 72 గంటల డెడ్లైన్
Also Read
ఇదిలా ఉంటే కర్ణాటక ఎన్నికల్లో కీలకంగా మారిన ‘భజరంగ్ దళ్’ బ్యాన్ అంశం ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అదే చర్చకు కారణం అవుతోంది. మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి గెలుపొందిన కర్ణాటక మాజీ మంత్రి సీఎన్ అశ్వత్ నారాయణ సమాచార లోపమే తమ ఓటమికి కారణం అని, తమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామని అన్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ కు దమ్ముంటే ఇప్పుడు ‘భజరంగ్ దళ్’ని నిషేధించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ బ్యాన్ చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. ఇది మాకు దిగ్భ్రాంతికరమైనదని, మేము చాలా సీట్లు కోల్పోయామని, ఇది ఎప్పుడూ ఊహించలేదని అచ్యుత్ నారాయణ అన్నారు.
భజరంగ్ దళ్ ను నిషేధించేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేయనీవ్వండి…. అప్పుడు మేం ఏం చేయగలమో చూపిస్తాం అంటూ సవాల్ చేశారు. శనివారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దక్షిణాదిలో ఏకైక రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దాన్ని కోల్పోయింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ భజరంగ్ దళ్ బ్యాన్ హామీ ఇచ్చింది. అయితే దీన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. నిషేధిత పీఎఫ్ఐ లాగే భజరంగ్ దళ్ ను నిషేధిస్తామనడం కాంగ్రెస్, బీజేపీల మధ్య విమర్శలకు దారితీసింది.
తాజావార్తలు
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
-
Nagadurga: సుకుమార్ – బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
-
Afghan: పాక్ గడ్డపై ఆఫ్ఘన్ డ్రోన్ల పంజా.. గురితప్పని దాడి, కుప్పకూలిన ఐసిస్ అడ్డాలు!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
ట్రెండింగ్
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!