PM Shahbaz Sharif: ఇమ్రాన్ ఉగ్రవాది కన్నా తక్కువ కాదు.. ఆందోళకారుల అరెస్ట్కు 72 గంటల డెడ్లైన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Shahbaz Sharif: ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత పాకిస్తాన్ లో తీవ్ర ఆందోళనలు జరిగాయి. రాజధాని ఇస్లామాబాద్ తో పాటు కరాచీ, లాహోర్, పెషావర్ నగరాల్లో ఆయన మద్దతుదారులు విధ్వంసం సృష్టించారు. ఆర్మీ కంటోన్మెంట్లు, ప్రభుత్వ ఆస్తులే లక్ష్యంగా దాడులు చేశారు. అయితే ఈ విధ్వంసంపై పాక్ ప్రధాని షహజాబ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ మరియు అతని మద్దతుదారులు “ఉగ్రవాదుల కంటే తక్కువ కాదు” అని అన్నారు. ప్రభుత్వం ఆస్తులు, ఆర్మీ అధికారులు నివాసాలపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read Also: Bandi Sanjay : దేశంలో ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలు ఇవి.. ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు వేరు
Also Read
దశాబ్ధాలుగా బయట నుంచి శతృవులు కూడా చేయలేని విధ్వంసాన్ని ఇమ్రాన్ ఖాన్ అతని మద్దతుదారులు చేశారని ఆరోపించారు. దాడులకు తెగబడిన వారంతా చట్టం, రాజ్యాంగ ప్రకారం శిక్షించబడతారని హెచ్చరించారు. నిందితులను గుర్తించేందుకు పంజాబ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రికి, అధికారులకు 72 గంటల డెడ్ లైన్ విధించారు.
ఇటీవల ‘అల్ ఖదీర్ ట్రస్ట్’ అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ ను ‘నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో’ అరెస్ట్ చేసింది. అయితే ఈ వ్యవహారంపై అక్కడి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించడంతో ఆయన అరెస్ట్ నుంచి విడుదలయ్యారు. విడుదల తర్వాత ఇస్లామాబాద్ నుంచి లాహోర్ చేరుకున్న ఆయనకు అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
తాజావార్తలు
-
RCB Player: ‘విరాట్ కోహ్లీ వల్లనే ఇదంతా.. రెండేళ్ల నిషేధాన్ని ఎదుర్కొన్నాను’
-
Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
-
BCCI: బంగ్లాదేశ్ సిరీస్లపై స్పందించిన బీసీసీఐ.. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే పర్యటనలు..
-
Rahul Gandhi: ఖర్గే ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేసిన రాహుల్ గాంధీ.. అభిమానులతో ఫొటోలు
-
Virat Kohli: కోహ్లీ ఫ్యాన్స్కు శుభవార్త.. ఇక దూసుకెళ్లుడే..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?