BJP: రాష్ట్ర ఎన్నికలపై పాకిస్తాన్ కూడా కన్నేసింది.. బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP: ఈ నెల 25న రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. ఈ సారి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని దింపేయాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు రాజస్థాన్ ఓటర్ల సెంటిమెంట్ రిపీట్ చేస్తారని బీజేపీ భావిస్తోంది. రాజస్థాన్ లో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా వరసగా రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకోలేదు. ఇది తమకు కలిసి వస్తోందని బీజేపీ అనుకుంటోంది.
ఇలా ప్రచారం జరుగుతున్న సమయంలో బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదమయ్యాయి. మంగళవారం రాజస్థాన్ రాష్ట్రంలోని టోంక్లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ..‘‘ మొత్తం దేశంతో పాటు పాకిస్తాన్ కూడా రాజస్థాన్ ఎన్నికలపై కన్నేసింది. లాహోర్ టోంక్ సీటుపై కన్ను వేసింది’’అని అన్నారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
Read Also: Bandi Sanjay: తాగి పండుకునే కేసీఆర్ ను అల్లాతో పోలుస్తారా? కేటీఆర్ కు బండి సంజయ్ కౌంటర్
కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్ టోంక్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండటం గమనార్హం. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)కి టోంక్ లోని ప్రజలు ఆశ్రయం కల్పిస్తున్నారని దక్షిణ ఢిల్లీ బీజేపీ ఎంపీ ఆరోపించారు. లాహోర్ ఎన్నికలపై నిఘా ఉంచింది, ఎన్నికల తర్వాత లాహోర్ లో లడ్డూలు పంపిణీ చేయకుండా జాగ్రత్త వహించాలని ప్రజలకు సూచించారు. రాబోయే ఎన్నికల ఫలితాలపై హమాస్ వంటి ఉగ్రవాదుల కన్ను కూడా ఉందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో ఎలాగైనా గెలవాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు టోంక్ నియోజకవర్గానికి రమేష్ బిధూరిని ఇంఛార్జిగా నియమించింది. బిధూరి తన రాజకీయ వ్యాఖ్యలతో వివాదాస్పదం కావడం ఇదే తొలిసారి కాదు. గత పార్లమెంట్ సెషన్ లో బీఎస్పీ ఎంపీ కున్వర్ డానిష్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ వ్యాఖ్యలపై స్పీకర్ ఓంబిర్లా సీరియస్ అయ్యారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశం వాస్తు ప్రకారం ఎలా ఉండాలి? చాలామందికి తెలియని విషయాలు ఇవే!
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!