KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
- ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్ సర్కార్కు కేటీఆర్ వార్నింగ్
- రైతుల మరణాలపై సీఎం రేవంత్ను నిలదీసిన బీఆర్ఎస్ నేత
- కేబినెట్ సమావేశంలో ధాన్యం అంశం చర్చించాలని డిమాండ్
- పెండింగ్ కొనుగోళ్లు వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల ఆలస్యంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలాయని, అన్నదాతలు రోడ్డున పడుతున్నా పాలకుల్లో చలనం లేదంటూ మండిపడ్డారు.
కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కుప్పల మీదే రైతన్నలు గుండెలు ఆగి కుప్పకూలిపోతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. “రైతులు రాలిపోతున్నా చలనం లేని రాక్షస పాలన సాగుతోంది. అన్నదాతల చావులను చూసి ఆనందిస్తున్నావా ముఖ్యమంత్రి?” అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఆయన సూటిగా నిలదీశారు. మండుటెండల్లో ఐయక కేంద్రాల (కొనుగోలు కేంద్రాల) కాడ రైతుల గుండెలు ఆగిపోతున్నా, ఈ కర్కశ ప్రభుత్వానికి కనీసం కనికరం కలగడం లేదా అని ప్రశ్నించారు. పంటలు కొనకుండా ఇంకెంత కాలం రైతులను యాతన పెడతారని, ఇంకెన్ని చావులు కావాలి, ఇంకెన్ని కుటుంబాలు రోడ్డున పడాలో చెప్పాలని అడిగారు.
Also Read
- TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
- Supreme Court: చిన్నారుల మిస్సింగ్లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Modi-Marco Rubio: వైట్హౌస్ను సందర్శించండి.. ట్రంప్ తరపున మోడీకి రూబియో ఆహ్వానం
- Modi-Marco Rubio: సేవా తీర్థ్లో మోడీతో మార్కో రూబియో భేటీ.. గంటకుపైగా కీలక చర్చలు
ప్రభుత్వ తీరును విమర్శిస్తూ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “దున్నపోతు మీద వానపడ్డట్టు ప్రవర్తించడం ఆపండి” అంటూ కాంగ్రెస్ సర్కార్పై ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, మంత్రులు సోయి తెచ్చుకోవాలని హితవు పలికారు. ఈరోజు జరగబోయే కేబినెట్ భేటీలోనైనా ధాన్యం కొనుగోలు అంశంపై చిత్తశుద్ధితో చర్చించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో ఉన్న పంట కొనుగోళ్లను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు అవసరమైన సదుపాయాలు కల్పించడంతో పాటు, తక్షణమే ధాన్యం సేకరించి అన్నదాతల తిప్పలు తప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. కేటీఆర్ చేసిన ఈ ఎక్స్ పోస్ట్ ప్రస్తుతం తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది.
తాజావార్తలు
-
KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
-
TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
-
Rohit Sharma: “నన్ను క్షమించు..” మహిళా అభిమానికి ‘హిట్ మ్యాన్’ స్పెషల్ రిక్వెస్ట్..!
-
Supreme Court: చిన్నారుల మిస్సింగ్లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
-
Film Chamber: ఆ కలరింగ్ అంతా అబద్ధం.. ‘పెద్ది’ పర్సెంటేజ్ డీల్ను తిరస్కరించిన ఎగ్జిబిటర్లు
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!