kolkata doctor case: కోల్కతా డాక్టర్ హత్యచార కేసు.. మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్కి సీబీఐ సమన్లు..
- కోల్కతా వైద్యురాలి హత్యాచార కేసులో కీలక పరిణామం..
- కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్కి సీబీఐ సమన్లు..
- విచారణకు రావాలని పిలుపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
kolkata doctor case: కోల్కతా వైద్యురాలి అత్యాచార ఘటన యావత్ దేశాన్ని షాక్కి గురిచేసింది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్, ఆస్పత్రిలో ట్రైనీ పీజీ డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న 31 ఏళ్ల యువతిపై అత్యంత దారుణంగా అత్యాచారం, హత్య జరిగింది. నైట్ డ్యూటీలో ఉన్న వైద్యురాలి మృతదేహం శుక్రవారం తెల్లవారుజామున కాలేజ్ సెమినార్ హాలులో కనిపించింది. పోస్టుమార్టం నివేదికలో ఆమె పెదవులు, గొంతు, ముఖంపై గాయాలు ఉండటమే కాకుండా ఆమె కళ్లు, నోరు, ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం అయినట్లు నివేదించింది. ఇదే కాకుండా ఆమె శరీరంలో 150 మిల్లిగ్రాముల వీర్యం గణనీయమైన స్థాయిలో కనిపించినట్లు పోస్టుమార్టం నివేదిక గురించి బాధితురాలి తల్లిదండ్రులు హైకోర్టులో వెల్లడించారు. ఇది ముమ్మాటికి సామూహిక అత్యాచారామనే అని వారు ఆరోపించారు.
Read Also: Nandamuri Balakrishna: బాలయ్యతో మాములుగా ఉండదు.. జిమ్ లో ఏం చేస్తున్నాడో చూశారా?
Also Read
- Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
- Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి 'రోమాన్స్ స్కామ్' కథ వింటే నోరెళ్లబెడతారు!
- Air India Plane Crash Anniversary: 260 మంది ప్రాణాలు గాల్లో కలిసిన వేళ.. ఏడాది గడిచినా వీడని సస్పెన్స్?
- Rajnath Singh: హైదరాబాద్కు రక్షణ మంత్రి రాక.. నేడు, రేపు మేధావులతో భేటీలు, శాస్త్రవేత్తలతో ప్రత్యేక సమావేశం
ఈ కేసులో బెంగాల్ ప్రభుత్వం, కోల్కతా పోలీసులు వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించడంతో ఈ కేసును హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉన్న వ్యక్తి తన విద్యార్థుల భద్రత విషయంలో ఉదాసీనంగా ఉండటంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్జీ కర్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ సుదీప్ ఘోష్ని అక్కడ నుంచి తొలగించి వేరే కాలేజీలో ఇదే స్థాయిలో నియమించడంపై హైకోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తి చేస్తూ.. అతడిని సెలవులపై పంపాల్సిందిగా కోరింది. ఇదిలా ఉంటే ఈ రోజు జరిగిన విచారణలో మెడికల్ కాలేజీపై జరిగిన విధ్వంసంపై రాష్ట్రపోలీసులపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉంటే ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న సీబీఐ, మాజీ ప్రిన్సిపాల్ సుదీప్ ఘోష్కి విచారణ కోసం హాజరు కావాల్సిందిగా సమన్లు జారీచేసింది.
తాజావార్తలు
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Gold Rate Today: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజులోనే షాకిచ్చిన బులియన్ మార్కెట్!
-
Cyber Crime: ఆన్లైన్ డేటింగ్ ఉచ్చులో మహిళా న్యాయమూర్తి.. జడ్జిగారి ‘రోమాన్స్ స్కామ్’ కథ వింటే నోరెళ్లబెడతారు!
-
Ben Stokes-ECB: పూర్తిస్థాయి నిషేధంపై ఆలోచిస్తున్నాం.. బాంబ్ పేల్చిన ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు!
-
The Odyssey : ‘ది ఒడిస్సీ’కి భయపడి ప్రీ పోన్ చేసుకుంటోన్న బాలీవుడ్ ఫిల్మ్స్
ట్రెండింగ్
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!
-
FIFA World Cup: రెండు గోల్స్, మూడు రెడ్ కార్డ్స్.. దక్షిణాఫ్రికాను చిత్తు చేసి బోణి కొట్టిన మెక్సికో.!
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..