Gurpatwant Singh Pannun: ఇండియాను విభజించి అనేక దేశాలు చేయాలనుకున్న ఖలిస్తాన్ ఉగ్రవాది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gurpatwant Singh Pannun: ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కెనడా, ఇండియా మధ్య సంబంధాలను దెబ్బతీసింది. ఎప్పుడూ లేనంతగా ఇరు దేశాల మధ్య సంబంధాలు దిగువస్థాయికి చేరాయి. అయితే ఒక్క నిజ్జరే కాదు చాలా మంది ఖలిస్తానీ వేర్పాటువాదులు, ఉగ్రవాదులు కెనడాలో తలదాచుకుంటూ భారతదేశంపై విద్వేషాన్ని చిమ్ముతున్నారు. సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్జే) చీఫ్, ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ ఏకంగా భారత దేశాన్ని విడగొట్టాలనే కుట్రకు పాల్పడినట్లు మన నిఘా ఏజెన్సీలు చెబుతున్నాయి.
గతంలో ఈ ఉగ్రవాదిని అప్పగించాలని, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్ పోల్ ని కోరింది భారత్. అయితే రెండు సందర్భాల్లో తిరస్కరించింది. కెనడాల, యూఎస్, యూకేల్లో తిరుగుతూ గురుపత్వంత్ సింగ్ పన్నూ ఖలిస్తాన్ ఎజెండాను నూరిపోస్తున్నారు. అంతే కాకుండా పాక్ గూఢాచార సంస్థ ఐఎస్ఐతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారు. కె2 ఎజెండాను ఖలిస్తాన్ ఉగ్రవాదులు-ఐఎస్ఐ ఏజెంట్లు ముందుకు తీసుకువస్తున్నారు. కె2 అంటే ఖలిస్తాన్, కాశ్మీర్ అని అర్థం.
Also Read
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
ఇదిలా ఉంటే ఇతను కాశ్మీర్ ప్రజల కోసం ప్రత్యేకంగా ఓ ముస్లిం దేశాలను ఏర్పాటు చేయాలని , భారత్ నుంచి జమ్మూ కాశ్మీర్ ను వేరు చేయాలని కలలు కంటున్నాడు. ఓ ఆడియో సందేశంలో భారత సమగ్రత, ఐక్యతను పన్నూ ఛాలెంజ్ చేస్తున్నాడు. పంజాబ్ తో పాటు దేశ వ్యాప్తగా ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తున్నాడని చెబుతూ.. 2022లో భారత్ ఇతడిని ఉగ్రవాదిగా గుర్తించింది. అమాయక యువతలో విష బీజాలు నింపుతూ ఖలిస్తాన్ ప్రత్యేక దేశం కోసం ప్రేరేపిస్తున్నాడు.
Read Also: Pakistan: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో అమెరికా రాయబారి పర్యటన.. చెలరేగిన వివాదం..
గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎవరు..?
గతేడాది హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గోడలపై ఖలిస్తాన్ అనుకూల గ్రాఫిటీ, బ్యానర్లు వెలిసిన కేసులో ప్రధాన నిందితుడు. పన్నూ పూర్వీకులు దేశ విభజన సమయంలో 1947లో భారత దేశానికి వలస వచ్చారు. పంజాబ్ లోని ఖాన్ కోట్ ప్రాంతంలో నివాసం ఏర్పాటే చేసుకున్నారు. అతని తల్లిదండ్రులు మరణించారు. సోదరుడు మగ్వంత్ సింగ్ విదేశాల్లో ఉంటున్నాడు.
ముస్లింల మద్దతు కోసం అతను ‘డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఉర్దుస్తాన్’ పేరు పెట్టాలని అనుకున్నాడు. భారత్ నుంచి జమ్మూ కాశ్మీర్ ను వేరు చేసేలా ప్రజలను రెచ్చగొట్టాడు. పన్నూపై ప్రస్తుతం మొత్తం 16 కేసులు ఉన్నాయి. పంజాబ్ తో పాటు ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అతని ఆస్తులను స్వాధీనం చేసుకుంది. 2021లో స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై ఖలిస్తాన్ జెండా ఎగరేస్తే 1 మిలియన్ డాలర్లను, ఇండియా గేటుపై ఎగరేస్తే 2.5 మిలియన్ డాలర్లను ఇస్తానని ప్రజల్ని ప్రేరేపించాడు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!