Khalistan: ఖలిస్తానీ ఉగ్రవాదుల్ని వరసగా లేపేస్తున్నారు.. యూకే, పాక్, కెనడాల్లో ఘటనలు.. వీటి వెనక “రా” ఉందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khalistan: ఇటీవల కాలంలో ఖలిస్తానీ వేర్పాదువాద శక్తులు నానా హంగామా చేస్తున్నాయి. ముఖ్యంగా కెనడా, యూకే, ఆస్త్రేలియా దేశాల్లో భారత వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. దీంతో పాటు ఇండియాలో ఉన్న ఖలిస్తానీ గ్రూపులకు ఆర్థికంగా సాయం చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా ఇదిలా ఉంటే ఇటీవల పలువురు ఖలిస్తానీ ఉగ్రవాదుల్ని అనుమానిత వ్యక్తుల వరసగా చంపేస్తున్నారు. తుపాకీతో తక్కువ దూరం నుంచి కాల్చేసి పరారవుతున్నారు. పాకిస్తాన్ తో పాటు యూకే, కెనడాల్లో పలువురు ఖలిస్తానీ ఉగ్రవాదుల్ని హతమార్చారు. నెల వ్యవధిలో ముగ్గురు కీలక ఖలిస్తాన్ ఉగ్రవాదులు చంపివేయబడ్డారు.
నిన్న ‘ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్’ చీఫ్ గా ఉన్న హర్దీప్ సింగ్ నిజ్జర్ ను కెనడాలో అతి సమీపం నుంచి కాల్చి చంపారు. పంజాబీలు ఎక్కువగా ఉండే సర్రేలో ఓ గురుద్వారా వద్ద కాల్చి చంపారు. ఇతను భారత్ కు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ఉన్నాడు. అంతకుముందు వారం రోజుల క్రితం ఖలిస్తాన్ వేర్పాటువాది యూకేలో ఉంటున్న అవతార్ సింగ్ ఖండా బర్మింగ్ హామ్ లోని ఓ ఆస్పత్రిలో అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఇటీవల అమృత్ పాల్ సింగ్ అరెస్ట్ నేపథ్యంలో లండన్ లోని భారత రాయబార కార్యాలయంపై దాడి చేసి, జాతీయ జెండాను కిందికి దించి, ఖలిస్తాన్ జెండాను ఎగరేసేందుకు ప్రయత్నించాడు. ఇది జరిగిన కొన్ని రోజులకే ఇతను మరణించాడు.
Also Read
అంతకుముందు మే 6న పాకిస్తాన్ లాహోర్ కేంద్రంగా ఖలిస్తాన్ ఉగ్రవాద సంస్థ అయిన ‘ఖలిస్తాన్ కమాండో ఫోర్స్’ చీఫ్ పరమ్ జిత్ సింగ్ పంజ్వార్ ను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. లాహోర్లోని అతని ఇంటి దగ్గర మార్నింగ్ వాక్ చేస్తున్నప్పుడు కాల్చి చంపబడ్డాడు. పంజ్వార్ ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ కీలక నాయకుడు. 1960లో పంజాబ్ లోని తరన్ తరన్ లో జన్మించాడు. జూలై 2020లో ఇతడిని ఉపా చట్టం కింద ఉగ్రవాదిగా భారత ప్రభుత్వం ప్రకటించింది. దీనికి ముందు 2020లో హ్యాపీ పీహెచ్డీగా పిలువబడే హర్మీత్ సింగ్ లాహోర్ సమీపంలో కాల్చి చంపబడ్డాడు. ఇతను ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ మాడ్యుల్స్ కి శిక్షణ ఇవ్వడంలో కీలకంగా వ్యవహరించేవాడు.ఖలిస్తాన్ పేరుతో హింసకు పాల్పడుతున్న వాధావా సింగ్ బబ్బర్, లఖ్బీర్ సింగ్ రోడ్, రంజీత్ సింగ్ నీతా, భూపిందర్ సింగ్ భిండా, గుర్మీత్ సింగ్ బగ్గా , గురుపత్వంత్ సింగ్ పన్నూన్, పరమజిత్ సింగ్ పమ్మా, అర్ష్దీప్ సింగ్ గిల్ అలియాస్ అర్ష్ దాలా , హర్విందర్ సింగ్ సంధు వంటి వారు భారత్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నారు.
‘రా’ హస్తం ఉందా..?
అయితే ఇలా వరసగా భారత వ్యతిరేక ఉగ్రవాదులు చంపబడటం వెనక భారత నిఘా సంస్థ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్(RAW) హస్తం ఉందా..? అనే అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు అంతకుముందు ఇస్లామిక్ జిహదీ శక్తులు కూడా ఇలాగే పాకిస్తాన్ లో హతమార్చవేయబడ్డారు. హతమైన వారు జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదాన్ని దీంతో ఈ అనుమానాలు బలపడుతున్నాయి. మన దేశానికి వ్యతిరేకంగా ఉండీ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని రా అంతం చేస్తుందనే అనుమానం కలుగుతోంది.
తాజావార్తలు
-
El Nino-Centre: ఎల్నినోపై కేంద్రం అప్రమత్తం.. భయాందోళన అక్కర్లేదని హామీ
-
Special TET: తెలంగాణ టీచర్లకు భారీ శుభవార్త.. ఇక నుంచి ప్రత్యేక టెట్.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విద్యాశాఖ..
-
TMC Crisis: మమతకు భారీ షాక్.. 60 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!
-
Jagapathi Babu: ఒకప్పటి స్టార్ హీరో.. రోడ్డుపై అంతలా తిరిగినా ఎవరూ గుర్తుపట్టలేదు? వైరల్ అవుతున్న వీడియో!
ట్రెండింగ్
-
Chicken Keema Paratha Recipe: యమ్మీ.. యమ్మీ.. చికెన్ కీమా పరోటా.. సింపుల్గా ఇలా ఇంట్లోనే చేసుకోండి..!
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!