India-Pak Tensions: భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు.. అమిత్ షా- అజిత్ దోవల్ కీలక భేటీ..
- భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు..
- కేంద్రమంత్రి అమిత్ షాతో అజిత్ దోవల్ భేటీ..
- సరిహద్దుల్లో, ఎయిర్ పోర్టుల్లో భద్రతా ఏర్పాట్లపై ఆరా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India-Pak Tensions: ఆపరేషన్ సిందూర్తో భారత్- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతుంది. దాయాది దేశం రెచ్చగొట్టే చర్యలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు మోడీ సర్కార్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అన్ని వ్యవస్థల పని తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలోనే వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. డైరెక్టర్ జనరల్ ఆఫ్ బీఎస్ఎఫ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సీఐఎస్ఎఫ్, హోంశాఖలోని సీనియర్ అధికారులతో సమావేశం అయ్యారు. సరిహద్దుల్లో, ఎయిర్ పోర్టుల్లో భద్రతా ఏర్పాట్లపై ఆరా తీశారు. కాగా, ఈ భేటీకి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. కేంద్రమంత్రి ఇంట్లో ఈ కీలక సమావేశం జరిగింది.
Read Also: Amala Paul : నేను హీరోయిన్ని అనే విషయం నా భర్తకి చెప్పలేదు..
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
అయితే, చొరబాటు ఘటనలు జరుగుతున్న తరుణంలో పాకిస్తాన్ తో సరిహద్దు పంచుకుంటున్న ఆయా రాష్ట్రాలు ఇప్పటికే కీలక చర్యలు తీసుకుంటున్నాయి. భారతదేశంలోకి చొరబాటుకు ప్రయత్నించిన పాక్ కు చెందిన ఓ వ్యక్తిని పంజాబ్ సరిహద్దు దగ్గర బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన్లు హతమార్చారు. రాజస్థాన్లో 1,037 కిలోమీటర్లున్న పాక్ సరిహద్దును బంద్ చేశారు. ఎవరైనా సరిహద్దుల దగ్గర అనుమానాస్పదంగా కనిపిస్తే.. కాల్చివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇక, జమ్మూ కాశ్మీర్ లోని సాంబా జిల్లాలోని సరిహద్దు దాటి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను బీఎస్ఎఫ్ గట్టిగా తిప్పికొట్టింది. ఈ దాడుల్లో సుమారు ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు ఆ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ నేడు కూడా ఎల్ఓసీకి ఆవలివైపు నుంచి భారీ స్థాయిలో కాల్పులు జరుపుతుంది. ముఖ్యంగా యూరి, జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో వీటి తీవ్రత భారీగా కనిపిస్తుంది. ఈ కాల్పుల్లో చాలా మంది ప్రజలు తమ ఇళ్లు ఖాళీ చేసి దూర ప్రాంతాలకు వెళ్తున్నారు.
తాజావార్తలు
-
Agadha Pre Release Event: ‘అగధ’తో ఎంఎస్ రాజు కమ్బ్యాక్.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అదిరిపోయే రెస్పాన్స్.. కల్ట్ క్లాసిక్ అవుతుందా?
-
Astrology: ఆగస్టు 11 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!