Womens Asia Cup: రప్ఫాడించిన రోడ్రిగ్స్.. లంకపై భారత్ ఘనవిజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Women Team Won First Match In Asia Cup Against Sri Lanka: మహిళల ఆసియా కప్-2022 టోర్నీ ఈరోజు నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే! ఈ టోర్నీలో భాగంగా భారత్, శ్రీలంక మధ్య తొలి పోరు జరగ్గా.. భారత్ ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 150 పరుగులు చేయగా.. 109 పరుగులకే శ్రీలంక కుప్పకూలింది. భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు కుదురుగా రాణించలేకపోయారు. దీంతో మొదటి పోరులో భారత్ అఖండ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
తొలుత టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు భారత జట్టు బరిలోకి దిగింది. ఓపెనర్లు పెద్దగా సత్తా చాటలేకపోయారు. టీమిండియాకు శుభారంభాన్ని అందించలేకపోయారు. షెఫాలి వర్మ (10), స్మృతి మందాన (6) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. అయితే.. ఆ తర్వాత వచ్చిన రోడ్రిగ్స్(53 బంతుల్లో 76) , హర్మన్ప్రీత్(30 బంతుల్లో 33) బాగా రాణించారు. వెంటనే వికెట్ పడనివ్వకుండా, ఆచితూచి ఆడుతూ.. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు బాదుతూ వచ్చారు. వీళ్లిద్దరు కలిసి మూడో వికెట్కి 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత వచ్చిన వాళ్లు అంతగా రాణించలేకపోయారు. దీంతో.. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో రణసింగే మూడు వికెట్లతో సత్తా చాటగా.. కుమారి, చమరి చెరో వికెట్ తీసుకున్నారు.
Also Read
- Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
- RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
- Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
- Vaibhav: ‘నా 7 ఐపీఎల్ కెరీర్లో ఇలాంటి ఆట చూడలేదు.. వైభవ్ సూర్యవంశీకి హ్యాట్సాప్’
ఇక 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు మొదట్లో కొన్ని మెరుపులు మెరిపించింది కానీ, ఆ తర్వాత కుదేలైంది. ఓపెనర్ హర్షిత (26) ఐదు ఫోర్లతో రాణించగా.. ఆమెతో పాటు క్రీజులోకి వచ్చిన చమరి (5) తక్కువ స్కోరుకే వెనుదిరిగింది. ఆ తర్వాత మాల్షా కూడా రనౌట్తో పెవిలియన్ చేరింది. హసిని పెరీరా (32 బంతుల్లో 30) జట్టుని ముందుకు నడిపించేందుకు ప్రయత్నించింది కానీ, ఆమెకి ఎవ్వరూ మద్దతు ఇవ్వలేదు. ఇతర బ్యాటర్లు క్రీజులో అడుగుపెట్టినట్టే పెట్టి, వెంటనే వెనుదిరిగారు. రణసింగే (11) మినహాయించి.. మిగతా వాళ్లంతా భారత బౌలర్ల ధాటికి సింగిల్ డిజిట్కే ఔటయ్యారు. దీంతో.. 109 పరుగులకే లంక జట్టు కుప్పకూలగా, 41 పరుగుల తేడాతో భారత విజయం సాధించింది. భారత బౌలర్లలో హేమలత 3 వికెట్లు తీయగా.. పూజ, దీప్తి చెరో రెండు వికెట్లు, రాధ ఒక వికెట్ తీశారు.
తాజావార్తలు
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసి TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
-
Delhi Hotel Fire: మాతృమూర్తికి కుమారుడు కాలేయం దానం.. అగ్నిప్రమాదంలో ఇద్దరూ మృతి.. ‘కిర్గిజ్స్తాన్’ కుటుంబ విషాద గాథ
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!