Womens Asia Cup: రప్ఫాడించిన రోడ్రిగ్స్.. లంకపై భారత్ ఘనవిజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Women Team Won First Match In Asia Cup Against Sri Lanka: మహిళల ఆసియా కప్-2022 టోర్నీ ఈరోజు నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే! ఈ టోర్నీలో భాగంగా భారత్, శ్రీలంక మధ్య తొలి పోరు జరగ్గా.. భారత్ ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 150 పరుగులు చేయగా.. 109 పరుగులకే శ్రీలంక కుప్పకూలింది. భారత బౌలర్ల ధాటికి లంక బ్యాటర్లు కుదురుగా రాణించలేకపోయారు. దీంతో మొదటి పోరులో భారత్ అఖండ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
తొలుత టాస్ గెలిచిన శ్రీలంక జట్టు ఫీల్డింగ్ ఎంపిక చేసుకుంది. దీంతో.. బ్యాటింగ్ చేసేందుకు భారత జట్టు బరిలోకి దిగింది. ఓపెనర్లు పెద్దగా సత్తా చాటలేకపోయారు. టీమిండియాకు శుభారంభాన్ని అందించలేకపోయారు. షెఫాలి వర్మ (10), స్మృతి మందాన (6) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. అయితే.. ఆ తర్వాత వచ్చిన రోడ్రిగ్స్(53 బంతుల్లో 76) , హర్మన్ప్రీత్(30 బంతుల్లో 33) బాగా రాణించారు. వెంటనే వికెట్ పడనివ్వకుండా, ఆచితూచి ఆడుతూ.. వీలు చిక్కినప్పుడల్లా భారీ షాట్లు బాదుతూ వచ్చారు. వీళ్లిద్దరు కలిసి మూడో వికెట్కి 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత వచ్చిన వాళ్లు అంతగా రాణించలేకపోయారు. దీంతో.. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో రణసింగే మూడు వికెట్లతో సత్తా చాటగా.. కుమారి, చమరి చెరో వికెట్ తీసుకున్నారు.
Also Read
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
- PBSK Vs MI: ఐపీఎల్లో పంజాబ్ అరుదైన రికార్డు.. ఒక్క ఇన్నింగ్స్తో ఆ రికార్డులన్నీ పటాపంచల్..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
- Tilak Varma: తిలక్ వర్మకు కొత్త బాధ్యతలు.. కెప్టెన్గా ఎంపిక చేసిన బీసీసీఐ..
ఇక 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు మొదట్లో కొన్ని మెరుపులు మెరిపించింది కానీ, ఆ తర్వాత కుదేలైంది. ఓపెనర్ హర్షిత (26) ఐదు ఫోర్లతో రాణించగా.. ఆమెతో పాటు క్రీజులోకి వచ్చిన చమరి (5) తక్కువ స్కోరుకే వెనుదిరిగింది. ఆ తర్వాత మాల్షా కూడా రనౌట్తో పెవిలియన్ చేరింది. హసిని పెరీరా (32 బంతుల్లో 30) జట్టుని ముందుకు నడిపించేందుకు ప్రయత్నించింది కానీ, ఆమెకి ఎవ్వరూ మద్దతు ఇవ్వలేదు. ఇతర బ్యాటర్లు క్రీజులో అడుగుపెట్టినట్టే పెట్టి, వెంటనే వెనుదిరిగారు. రణసింగే (11) మినహాయించి.. మిగతా వాళ్లంతా భారత బౌలర్ల ధాటికి సింగిల్ డిజిట్కే ఔటయ్యారు. దీంతో.. 109 పరుగులకే లంక జట్టు కుప్పకూలగా, 41 పరుగుల తేడాతో భారత విజయం సాధించింది. భారత బౌలర్లలో హేమలత 3 వికెట్లు తీయగా.. పూజ, దీప్తి చెరో రెండు వికెట్లు, రాధ ఒక వికెట్ తీశారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!