Raghav Chadha: కేజ్రీవాల్ని జైలులో వేసి, 7 సీట్లు గెలవండి.. ఆప్ నేత విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghav Chadha: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత(ఆప్) అరవింద్ కేజ్రీవాల్కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీ లిక్కర్ కేసులో సమన్లు జారీ చేసింది. దీంతో ఆప్ నేతలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఆప్ నేత రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీపై మండిపడ్డారు. కేజ్రీవాల్ని బీజేపీ ఏజెన్సీలు అరెస్ట్ చేయబోతున్నాయని ఆరోపించారు.
ఢిల్లీలో 7 లోక్సభ స్థానాలు ఉన్నాయి, ఇండియా కూటమి ఇక్కడ పోటీ చేస్తే ఢిల్లీలోని ఏడు స్థానాల్లో బీజేపీ ఓడిపోతుందని అందరికి తెలుసు. దీంతో అధికార పక్షం భయపడి, ప్రతిపక్షాలను అరెస్ట్ చేయాలని చూస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల్లో మొదటగా అరవింద్ కేజ్రీవాల్ నే టార్గెట్ చేస్తున్నారంటూ విమర్శించారు.
Also Read
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
- Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
Read Also: Yogi Adityanath: “తాలిబాన్లకు బజరంగ్బలి” పరిష్కారం.. యోగీ సంచలన వ్యాఖ్యలు..
అరవింద్ కేజ్రీవాల్ ని జైలులో వేసి, 7 సీట్లను జేబులో వేసుకోవాలనేదే బీజేపీ ప్లాన్ అని రాఘవ్ చద్దా అన్నారు. బీజేపీ తదుపరి టార్గెట్ జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అని అన్నారు. హేమంత్ సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఆయనకు ప్రజాదరణ పెరిగిందని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో జార్ఖండ్లోని 19 సీట్లలో 14 గెలుచుకున్న బీజేపీ 2024 ఎన్నికల్లో 4 సీట్లను కూడా గెలవదని ఆయన జోస్యం చెప్పారు. అందుకే బీజేపీ ఆయన్ను అరెస్ట్ చేయాలని అనుకుంటోందని అన్నారు.
వీరే కాకుండా బీహార్ లో ఆర్జేడీ నేత, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఇలా బీజేపీ టార్గె్ట్ చేస్తుందని మండిపడ్డారు. ఇండియా కూటమిలోని అగ్రనేతల్ని కటకటాల వెనక్కి నెట్టితే, బీజేపీ మాత్రమే రేసులో ఉంటుందని, గెలుస్తుందని చద్దా అన్నారు. ఇదే బీజేపీ వ్యూహమని ఆయన ఆరోపించారు.
ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్లను ఈడీ అరెస్ట్ చేసింది. తాజాగా సీఎం కేజ్రీవాల్ కి సమన్లు జారీ చేసింది. ఆయను ప్రశ్నించిన తర్వాత నవంబర్ 2న అరెస్ట్ చేస్తుందని ఆప్ ఆరోస్తోంది. అయితే ఈ కేసులో గతంలో సీబీఐ కేజ్రీవాల్ ని ప్రశ్నించింది.
తాజావార్తలు
-
Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
-
Chiranjeevi: ఈ కొరియన్ కనకరాజు సక్సెస్ కి కారణం మా వరుణ్ తేజ్ కొడుకే
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..