Karnataka: బీజేపీ తెచ్చిన “మతమార్పిడి నిరోధక చట్టాన్ని” రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, గతంలో బీజేపీ తీసుకువచ్చిన అన్ని చట్టాలను సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ తీసుకువచ్చని మతమార్పిడి నిరోధక చట్టాన్ని గురువారం కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. దీంతో పాటు పాఠశాల్లలో హిస్టరీ సిలబస్ మార్పు, వ్యవసాయ మార్కెట్లపై చట్టంలో కూడా మార్పులకు ఈ రోజు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Read Also: Edible oil prices: దిగిరానున్న వంటనూనెల ధరలు.. దిగుమతి సుంకాన్ని తగ్గించిన కేంద్రం
Also Read
- Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
- Bihar: ఇన్స్టాలో ప్రేమ.. పెళ్లైన గంటల్లోనే వధువు మృతి.. ఏం జరిగిందంటే..!
- Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
బలవంతంగా, ఆకర్షించడం, తప్పుడు ప్రాతినిధ్యం ద్వారా మతమార్పిడికి వ్యతిరేకంగా గత బీజేపీ ప్రభుత్వం మే నెలలో ఆర్డినెస్స్ రూపంలో ప్రవేశపెట్టింది. అంతకుముందు ఏడాది సెప్టెంబర్ నెలలో రాష్ట్ర అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లు బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య చిచ్చు పెట్టింది. మైనారిటీలను వేధించే ప్రక్రియలో భాగంగానే బీజేపీ ఈ బిల్లును తీసుకువచ్చిందని ఆ సమయంలో కాంగ్రెస్ ఆరోపించింది. ఈ చట్టం కోర్టు వరకు వెళ్లింది. ఇది మత స్వేచ్ఛను ఉల్లంఘించడమే అని క్రైస్తవ సంస్థలు కోర్టులో వాదించాయి.
ఇదిలా ఉంటే బీజేపీ సైద్ధాంతిక సంస్థ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన వీడీ సావార్కర్, కేబీ హెడ్గేవార్ అధ్యయాలను బీజేపీ పాఠ్యాంశాలుగా చేర్చింది. అయతే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వీటిని తొలగిస్తుందని క్యాబినెట్ మంత్రి పాటిల్ వెల్లడించారు. పాఠశాల సిలబస్ లో బీజేపీ చేసిన అన్ని మార్పులను తొలగిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. పాఠశాల్లలో రాజ్యాంగ ప్రవేశికను తప్పనిసరిగా చదవాలని మంత్రి వర్గం నిర్ణయించింది. బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన చట్టం స్థానంలో వ్యవసాయ మార్కెట్ల (ఏపీఎంసీ)పై కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!