Karnataka: “గృహలక్ష్మీ”కి కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం.. మహిళలకు నెలకు రూ. 2000
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమై 5 వాగ్ధానాల్లో ఒకటైన ‘గృహ లక్ష్మీ’ పథకాన్ని సిద్ధరామయ్య ప్రభుత్వం నేడు ప్రారంభించనుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతున్న సందర్భంగా ఈ పథకాన్ని లాంచ్ చేయనుంది. ఈ పథకం ద్వారా కుటుంబంలో పెద్దగా ఉన్న మహిళలకు ప్రతీ నెల రూ. 2000లను ప్రభుత్వం అందిస్తుంది.
ప్రభుత్వ డేటా ప్రకారం రాష్ట్రంలో దాదాపు 1.10 కోట్ల మంది మహిళలు ఈ పథకం కోసం నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ‘గృహలక్ష్మి’ కార్యక్రమానికి కర్ణాటక ప్రభుత్వం రూ.17,500 కోట్లు కేటాయించింది.
Also Read
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
READ ALSO: Asia Cup 2023: ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే పాకిస్తాన్ పటిష్ఠంగా మారింది.. జాగ్రత్తగా ఉండాల్సిందే!
ఈ ఏడాది మేలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో అధికార బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ గద్దె దించింది. తిరుగులేని మెజారిటితో కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. అధికారంలోకి రావడానికి శక్తి, గృహ జ్యోతి, అన్న భాగ్య, గృహ లక్ష్మి, యువనిధి అనే 5 పథకాలు ఉపయోగపడ్డాయి. అయితే ఇప్పుడు అమలు కాబోతున్న గృహలక్ష్మీ పథకం నాలుగోది. 5వది నిరుద్యోగ భృతికి సంబంధించిన యువనిధి.
గృహలక్ష్మీ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు జూలై 19న ప్రారంభించింది. అంత్యోదయ, దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్), దారిద్రరేఖకు ఎగువన ఉండీ రేషన్ కార్డులు కలిగిన కుటుంబ పెద్దలైన మహిళలు గృహలక్ష్మీ పథకానికి అర్హులు. ఒక కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా సర్కార్ ప్రకటించింది. మహిళా ప్రభుత్వ ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, భర్తలు ఆదాయపు పన్ను చెల్లింపుదారులైతే, జీఎస్టీ రిటర్న్లను ఫైల్ చేసిన కుటుంబాలు ఈ పథకానికి అర్హులు కాదు.
తాజావార్తలు
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
-
CM Chandrababu: భూ వివాదాలకు చెక్.. పేదరికం లేని సమాజమే నా లక్ష్యం..
-
Sanjay Manjrekar: హార్దిక్ చాప్టర్ క్లోజ్? ముంబై ఇండియన్స్కు అతడే కరెక్ట్ కెప్టెన్ అంటున్న మాజీ స్టార్
-
Veera Bhadrudu OTT: సూర్య ‘వీర భద్రుడు’ ఓటీటీ లాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..