Karnataka: “గృహలక్ష్మీ”కి కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం.. మహిళలకు నెలకు రూ. 2000
Karnataka: కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కారణమై 5 వాగ్ధానాల్లో ఒకటైన ‘గృహ లక్ష్మీ’ పథకాన్ని సిద్ధరామయ్య ప్రభుత్వం నేడు ప్రారంభించనుంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతున్న సందర్భంగా ఈ పథకాన్ని లాంచ్ చేయనుంది. ఈ పథకం ద్వారా కుటుంబంలో పెద్దగా ఉన్న మహిళలకు ప్రతీ నెల రూ. 2000లను ప్రభుత్వం అందిస్తుంది.
ప్రభుత్వ డేటా ప్రకారం రాష్ట్రంలో దాదాపు 1.10 కోట్ల మంది మహిళలు ఈ పథకం కోసం నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ‘గృహలక్ష్మి’ కార్యక్రమానికి కర్ణాటక ప్రభుత్వం రూ.17,500 కోట్లు కేటాయించింది.
Also Read
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Mamata Banerjee: తలకిందులుగా వేలాడదీయడం ఏంటి.? అమిత్ షాపై దీదీ ఆగ్రహం..
- AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి...
- LPG Crisis: గ్యాస్ టెన్షన్కు గుడ్బై.. 15 దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతి!
READ ALSO: Asia Cup 2023: ఆ ఇద్దరు ప్లేయర్స్ వల్లే పాకిస్తాన్ పటిష్ఠంగా మారింది.. జాగ్రత్తగా ఉండాల్సిందే!
ఈ ఏడాది మేలో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో అధికార బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ గద్దె దించింది. తిరుగులేని మెజారిటితో కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. అధికారంలోకి రావడానికి శక్తి, గృహ జ్యోతి, అన్న భాగ్య, గృహ లక్ష్మి, యువనిధి అనే 5 పథకాలు ఉపయోగపడ్డాయి. అయితే ఇప్పుడు అమలు కాబోతున్న గృహలక్ష్మీ పథకం నాలుగోది. 5వది నిరుద్యోగ భృతికి సంబంధించిన యువనిధి.
గృహలక్ష్మీ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్లు జూలై 19న ప్రారంభించింది. అంత్యోదయ, దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్), దారిద్రరేఖకు ఎగువన ఉండీ రేషన్ కార్డులు కలిగిన కుటుంబ పెద్దలైన మహిళలు గృహలక్ష్మీ పథకానికి అర్హులు. ఒక కుటుంబంలో ఒక మహిళకు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా సర్కార్ ప్రకటించింది. మహిళా ప్రభుత్వ ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు, భర్తలు ఆదాయపు పన్ను చెల్లింపుదారులైతే, జీఎస్టీ రిటర్న్లను ఫైల్ చేసిన కుటుంబాలు ఈ పథకానికి అర్హులు కాదు.
తాజావార్తలు
-
New OTT Rules 2026 : ఓటీటీలో కొత్త రూల్స్.. నిర్మాతలకు ‘షాక్’.. వసూళ్లు లేకపోతే రైట్స్ కట్!
-
Ashu Reddy: ప్రేమ, పెళ్లి పేరుతో 9 కోట్లు స్వాహ.. బిగ్ బాస్ అషు రెడ్డి పై సైబర్ కేసు
-
న్యూ లుక్లో YS Jagan.. యూరప్ టూర్కు బయల్దేరిన మాజీ సీఎం.!
-
Lungi Ngidi Injury: లుంగి ఎంగిడికి తీవ్ర గాయం.. 11 నిమిషాల్లోనే ఆస్పత్రికి అంబులెన్స్, తాజా అప్డేట్ ఇదే!
-
Amani: అందుకే మెగాస్టార్ సరసన నటించలేదు..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!