Karnataka: అమ్మాయితో మాట్లాడినందుకు స్కూల్ విద్యార్థిపై పిడిగుద్దులు..
- బాలికతో మాట్లాడినందుకు పాఠశాల విద్యార్థిపై దాడి
- కర్ణాటకలోని హుబ్బళ్లిలో జరిగిన ఘటన
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: పాఠశాలలో బాలికతో మాట్లాడినందుకు పాఠశాల విద్యార్థిపై దాడి చేసిన ఘటన కర్ణాటకలోని హుబ్బళ్లిలో సోమవారం చోటుచేసుకుంది. హుబ్బళ్లి-ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ మాట్లాడుతూ.. ఐదు నుంచి ఆరుగురు సభ్యుల ముఠా ఓ పాఠశాల విద్యార్థిపై దాడికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిందని తెలిపారు. ఈ ఘటనతో పాఠశాలలు, కళాశాలలు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చర్యలు ప్రారంభించామని, పాఠశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామని తెలిపారు. పాఠశాలలో బాలికతో మాట్లాడినందుకు బాధితుడిపై దాడి చేసినట్లు విచారణలో తేలిందని పోలీసు కమిషనర్ శశికుమార్ తెలిపారు.
Read Also: Suicide: సెల్ఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
Also Read
- Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
- IRCTC: తత్కాల్ టికెట్ దొరకలేదని బాధపడొద్దు.. మీకు ఈ ఆప్షన్ ఉందని తెలుసా!
- Punjab Politics: నిన్న బాదల్, నేడు రాఘవ్ చద్దాలతో ప్రధాని మోడీ భేటీ.. రసవత్తరంగా పంజాబ్ పాలిటిక్స్..
- Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
తనపై దాడి చేసిన వారు వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు అని బాధిత విద్యార్థి పోలీసులకు చెప్పాడు. నలుగురు నిందితులపై జువైనల్ జస్టిస్ చట్టం కింద కేసు నమోదు చేశామని, 19 ఏళ్ల నర్సింగ్ కాలేజీ విద్యార్థిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, నిందితుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా అబ్బాయిలకు అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. హుబ్బళ్లి-ధార్వాడ్ జంటనగరాల పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని హుబ్బళ్లి-ధార్వాడ్ పోలీస్ కమిషనరేట్ ఆదేశించింది. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే పోలీసులను సంప్రదించాలని వారికి సూచించామని పోలీసు కమిషనర్ తెలిపారు.
బాలికతో ఎందుకు మాట్లాడుతున్నాడని బాధితురాలిని ముఠా ప్రశ్నించిందని, వారి మధ్య వాగ్వాదం జరగడంతో ముఠా అతనిపై దాడి చేసిందని పోలీసులు తెలిపారు. వారు బాధితుడిపై పిడిగుద్దులు కురిపించడంతో పాటు తీవ్రంగా తన్నారని.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
-
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
-
North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
-
Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
-
Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!