Karnataka: అమ్మాయితో మాట్లాడినందుకు స్కూల్ విద్యార్థిపై పిడిగుద్దులు..
- బాలికతో మాట్లాడినందుకు పాఠశాల విద్యార్థిపై దాడి
- కర్ణాటకలోని హుబ్బళ్లిలో జరిగిన ఘటన
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: పాఠశాలలో బాలికతో మాట్లాడినందుకు పాఠశాల విద్యార్థిపై దాడి చేసిన ఘటన కర్ణాటకలోని హుబ్బళ్లిలో సోమవారం చోటుచేసుకుంది. హుబ్బళ్లి-ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ మాట్లాడుతూ.. ఐదు నుంచి ఆరుగురు సభ్యుల ముఠా ఓ పాఠశాల విద్యార్థిపై దాడికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిందని తెలిపారు. ఈ ఘటనతో పాఠశాలలు, కళాశాలలు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చర్యలు ప్రారంభించామని, పాఠశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామని తెలిపారు. పాఠశాలలో బాలికతో మాట్లాడినందుకు బాధితుడిపై దాడి చేసినట్లు విచారణలో తేలిందని పోలీసు కమిషనర్ శశికుమార్ తెలిపారు.
Read Also: Suicide: సెల్ఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
Also Read
- Work From Home: కేంద్రం కంపెనీలకు "వర్క్ ఫ్రమ్ హోమ్" ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
- Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
తనపై దాడి చేసిన వారు వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు అని బాధిత విద్యార్థి పోలీసులకు చెప్పాడు. నలుగురు నిందితులపై జువైనల్ జస్టిస్ చట్టం కింద కేసు నమోదు చేశామని, 19 ఏళ్ల నర్సింగ్ కాలేజీ విద్యార్థిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, నిందితుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా అబ్బాయిలకు అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. హుబ్బళ్లి-ధార్వాడ్ జంటనగరాల పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని హుబ్బళ్లి-ధార్వాడ్ పోలీస్ కమిషనరేట్ ఆదేశించింది. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే పోలీసులను సంప్రదించాలని వారికి సూచించామని పోలీసు కమిషనర్ తెలిపారు.
బాలికతో ఎందుకు మాట్లాడుతున్నాడని బాధితురాలిని ముఠా ప్రశ్నించిందని, వారి మధ్య వాగ్వాదం జరగడంతో ముఠా అతనిపై దాడి చేసిందని పోలీసులు తెలిపారు. వారు బాధితుడిపై పిడిగుద్దులు కురిపించడంతో పాటు తీవ్రంగా తన్నారని.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Karuppu : ఫైనాన్స్ అడ్డంకులు తొలగి థియేటర్లలోకి వచ్చిన సూర్య ‘కరుప్పు’
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Tabu: హీరోయిన్ల ఏజ్ షేమింగ్పై టబు ఓపెన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!