Karnataka: అమ్మాయితో మాట్లాడినందుకు స్కూల్ విద్యార్థిపై పిడిగుద్దులు..
- బాలికతో మాట్లాడినందుకు పాఠశాల విద్యార్థిపై దాడి
- కర్ణాటకలోని హుబ్బళ్లిలో జరిగిన ఘటన
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: పాఠశాలలో బాలికతో మాట్లాడినందుకు పాఠశాల విద్యార్థిపై దాడి చేసిన ఘటన కర్ణాటకలోని హుబ్బళ్లిలో సోమవారం చోటుచేసుకుంది. హుబ్బళ్లి-ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ మాట్లాడుతూ.. ఐదు నుంచి ఆరుగురు సభ్యుల ముఠా ఓ పాఠశాల విద్యార్థిపై దాడికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిందని తెలిపారు. ఈ ఘటనతో పాఠశాలలు, కళాశాలలు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చర్యలు ప్రారంభించామని, పాఠశాల ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టామని తెలిపారు. పాఠశాలలో బాలికతో మాట్లాడినందుకు బాధితుడిపై దాడి చేసినట్లు విచారణలో తేలిందని పోలీసు కమిషనర్ శశికుమార్ తెలిపారు.
Read Also: Suicide: సెల్ఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య
Also Read
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
తనపై దాడి చేసిన వారు వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు అని బాధిత విద్యార్థి పోలీసులకు చెప్పాడు. నలుగురు నిందితులపై జువైనల్ జస్టిస్ చట్టం కింద కేసు నమోదు చేశామని, 19 ఏళ్ల నర్సింగ్ కాలేజీ విద్యార్థిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నామని ఆయన చెప్పారు. విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు, నిందితుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా అబ్బాయిలకు అవగాహన కల్పించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. హుబ్బళ్లి-ధార్వాడ్ జంటనగరాల పరిధిలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని హుబ్బళ్లి-ధార్వాడ్ పోలీస్ కమిషనరేట్ ఆదేశించింది. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే పోలీసులను సంప్రదించాలని వారికి సూచించామని పోలీసు కమిషనర్ తెలిపారు.
బాలికతో ఎందుకు మాట్లాడుతున్నాడని బాధితురాలిని ముఠా ప్రశ్నించిందని, వారి మధ్య వాగ్వాదం జరగడంతో ముఠా అతనిపై దాడి చేసిందని పోలీసులు తెలిపారు. వారు బాధితుడిపై పిడిగుద్దులు కురిపించడంతో పాటు తీవ్రంగా తన్నారని.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
-
Telangana Housing: పట్టణ పేదలకు శుభవార్త.. ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?