Karnataka: హెల్మెట్ లేదని లాయర్పై పోలీసుల దాడి.. ఆరుగురు సస్పెండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక రాష్ట్రంలో ఓ లాయర్పై పోలీసులు దాడి చేయడం వివాదాస్పదం అయింది. ఇది పొలిటికల్ దుమారానికి తెరలేపింది.చిక్కమగళూర్లో బైక్పై వెళ్తున్న ఓ లాయర్పై పోలీసులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ప్రీతమ్ అనే న్యాయవాదిపై దాడి చేయడమే కాకుండా అతని బైక్ తాళాలను ట్రాఫిక్ పోలీసులు లాక్కున్నారు. ఈ ఘటన నవంబర్ 30న చోటు చేసుకుంది.
ఈ వ్యవహారం వివాదాస్పదం కావడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, దాడికి పాల్పడిన ఆరుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ట్రాఫిక్ ఉల్లంఘనకు జరిమానా చెల్లించేందుకు లాయర్ ప్రీతమ్ సిద్ధంగా ఉన్నప్పటికీ… పోలీసులు అతడిని స్టేషన్కి తీసుకెళ్లి రక్తం వచ్చేలా కొట్టారు. బాధిత వ్యక్తి ఛాతి, వీపు, చేతిపై రక్తపు మరకలు ఉన్నాయని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్లో ట్విస్ట్
Read Also: Russia-Ukraine War: ప్రమాదం అంచున జపొరిజ్జియా అణు కర్మాగారం..
పోలీసుల దాడిపై చిక్కమగళూర్ న్యాయవాదుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. రోడ్డెక్కారు. న్యాయవాదిని దుర్భాషలాడిన పోలీసులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు పోలీస్ అధికారుల సస్పెన్షన్కి వ్యతిరేకంగా వారి కుటుంబ సభ్యులు సిటి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఈ కేసులో దాడికి పాల్పడిన పోలీసులపై సెక్షన్ 307 హత్యాయత్నం, అవమానించడం, తప్పుడు నిర్భంధానికి చెందిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ చెప్పారు. ప్రస్తుతం బాధితుడు ప్రీతమ్ ఆస్పత్రిలో కోలుకుంటున్నాడని అతను వెల్లడించారు.
ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని అమాయకపు ప్రజలు, రైతులు, దేశభక్తి ఉన్న కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని, చిక్కమగళూర్లో యంగ్ లాయర్ ప్రీతమ్పై జరిగిన దాడిని ఖండిస్తున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..