Pakistan: భారీ ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న పాకిస్తాన్..
Pakistan: ఉగ్రవాదులకు స్వర్గధామంగా ప్రపంచంలోనే పేరు తెచ్చుకున్న పాకిస్తాన్, ఇప్పుడు ఆ ఉగ్రవాదానికే బలవుతోంది. పాకిస్తాన్ వ్యాప్తంగా గత కొంత కాలంగా ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. ముక్యంగా తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్(టీటీపీ)తో పాటు మరికొన్ని ఉగ్రసంస్థలు అక్కడి పోలీస్ అధికారులను, సైన్యాన్ని టార్గెట్ చేస్తున్నాయి. టీటీపీకి మంచి పట్టున్న ఖైబర్ ఫఖ్తుంఖ్వా, వజీరిస్తాన్ ప్రాంతాల్లో దాడులకు తెగబడుతోంది. మరోవైపు బెలూచిస్తాన్ పోరాటయోధులు తమ స్వాతంత్య్రం కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. వీరు చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ని, పాక్ సైన్యాన్ని, చైనీయులను టార్గెట్ చేసుకుంటూ బలూచిస్తాన్, సింధ్ ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య పాకిస్తాన్, పాక్ తాలిబాన్లను అరికట్టాలని ఆఫ్ఘన్ లోని తాలిబాన్ ప్రభుత్వాన్ని కోరుతోంది.
ఇదిలా ఉంటే తాజాగా పాకిస్తాన్ భారీ ఉగ్రదాడి నుంచి తప్పించుకుంది. పంజాబ్ ప్రావిన్సులో అతిపెద్ద ఉగ్రదాడిని అక్కడి అధికారులు భగ్నం చేశారు. 14 మంది పాక్ తాలిబాన్, ఐఎస్ఐ ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, నిషేధిత సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ లోని వివిధ జిల్లాల్లో తాము 147 ఇంటెలిజెన్స్ ఆధారిత దాడులు చేశామని, కౌంటర్ టెర్రరిజం డిపార్ట్మెంట్(సీటీడీ) పంజాబ్ తెలిపింది.
Also Read
- Donald Trump: ట్రంప్ను రోస్ట్ చేసిన కింగ్ చార్లెస్.. మేము లేకపోతే మీరు ఫ్రెంచ్ మాట్లాడేవారంటూ ఎగతాళి
- Ali Pervaiz Malik: పాక్ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు.. మా దగ్గర ఒక్క రోజుకు కూడా పెట్రోల్ లేదు.. భారత్తో మనం పోల్చుకోలేము
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- UAE: చమురు రాజకీయాల్లో ట్విస్ట్.. ఒపెక్ నుంచి యూఏఈ ఔట్.. సౌదీకి భారీ షాక్..
Read Also: Russia-Ukraine War: ప్రమాదం అంచున జపొరిజ్జియా అణు కర్మాగారం..
గుజ్రాన్వాలా, బహవల్పూర్, సాహివాల్, ఫైసలాబాద్, సర్గోధా జిల్లాలతో పాటు లాహోర్ నగరంలో ఇంటెలిజెన్స్ సమాచారంతో దాడులు నిర్వహించారు. పట్టుబడిని వారికి ఐఎస్ఐఎస్, తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (టిటిపి)లకు చెందిన ఉగ్రవాదులతో పాటు లష్కరే ఝాంగ్వీ(ఎల్ఈజే) ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు పాక్ అధికారులు తెలిపారు. వీరంతా పంజాబ్ ప్రావిన్సులో విధ్వంసానికి ప్లాన్ చేశారని సీటీడీ అధికారులు చెప్పారు. ఉగ్రవాదుల నుంచి దాదాపు 4.3 కిలోల పేలుడు పదార్థాలు, మూడు హ్యాండ్ గ్రెనేడ్లు, నాలుగు ఐఈడీ బాంబులు, 20 డిటోనేటర్లు, 32 అడుగుల సేఫ్టీ ఫ్యూజ్ వైర్, 6.5 అడుగుల ప్రైమా కార్డ్, నిషేధిత సాహిత్యం, నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఉగ్రవాదులపై 13 కేసులు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ కోసం వారిని గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు.
తాజావార్తలు
-
Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ‘భట్టి’ భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
-
Adhir Ranjan Chowdhury: మమతా బెనర్జీ కళ్లలో భయం, ఇలా ఎప్పుడూ చూడలేదు..
-
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’ నుండి బ్లాస్టింగ్ సాంగ్ దిగుతోంది!
-
Sandeep Virk: క్యాస్టింగ్ కౌచ్పై నటి షాకింగ్ కామెంట్స్.. “రాత్రి 12 గంటలకు నా రూమ్లోకి వచ్చి .. ఆ పని చేయమన్నాడు!”
-
Watermelon Prices: నలుగురు మృతి.. రూ. 7కు పడిపోయిన వాటర్మిలన్ ధరలు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో