Karnataka: బెంగళూర్లో ఐటీ ఉద్యోగుల నిరసన.. హక్కుల కోసం పోరాటం..
- బెంగళూర్లో ఐటీ ఉద్యోగుల నిరసన..
- ఆరోగ్యకరమైన పని-జీవిత సమతుల్యత కోసం డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక రాష్ట్ర ఐటీ/ఐటీఈఎస్ ఉద్యోగుల సంఘం (కేఐటీయూ) నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. మార్చి 9వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూర్లోని ఫ్రీడమ్ పార్క్ వద్ద నిరసన కార్యక్రమం జరగనుంది. ఐటీ ఉద్యోగులు ‘‘ ఆరోగ్యకరమైన పని-జీవిత సమతుల్యత ప్రతీ ఉద్యోగి హక్కు’’ నినాదమిస్తున్నారు. అధిక పనిగంటలు, ఓవర్ టైమ్ పరిహారం లేకపోవడం, ఉద్యోగులు అధికారిక పని గంటలకు మించి అందుబాటులో ఉండాలని కోరడం వంటి ఆందోళనల్ని పరిష్కరించడం ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉంది.
న్యాయమైన పని పరిస్థితుల కోసం ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మార్చి 2024లో ఐటీ కంపెనీలు ఓవర్ టైం వేతన నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నాయంటూ, చట్టబద్ధమైన పని గంటల్ని పొడగిస్తున్నారంటూ కర్నాటక కార్మిక మంత్రికి ఐటీ ఉద్యోగం సంఘం మెమోరాండం సమర్పించింది. అనేక సమావేశాలు నిర్వహించినా, నిరసనలు తెలిపినప్పటికీ పని గంటల్ని నియంత్రించడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని యూనియన్ ఆరోపిస్తోంది. పలువురు సంస్థల యజమానులు పనిగంటల గురించి ఇటీవల కామెంట్స్ చేయడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు నిరసనకు పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ ఎన్ సుబ్రహ్మణ్యన్ వారానికి 90 గంటలు పని చేయాలని కోరారు. అదే విధంగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, వారానికి 70 గంటలు పనిచేయాలని కోరారు. ఇద్దరి స్టేట్మెంట్లపై ఉద్యో్గులు మండిపడ్డారు.
Also Read
- Modi-Suvendu: మోడీతో బెంగాల్ సీఎం భేటీ.. 45 నిమిషాలు సాగిన సమావేశం
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
- Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
- RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
ఉద్యోగుల డిమాండ్లు ఇవే:
*పని గంటల పరిమితుల అమలు: అధిక ఓవర్ టైం మరియు ఉద్యోగుల బర్న్ అవుట్ ను నివారించడానికి కఠినమైన రోజువారీ పని గంటల పరిమితులను అమలు చేయడం.
* ఐటీ రంగ మినహాయింపుల రద్దు: పారిశ్రామిక ఉపాధి (స్టాండింగ్ ఆర్డర్లు) చట్టం కింద ఐటీ రంగానికి మంజూరు చేసిన మినహాయింపులను తొలగించాలి, ఇది ప్రస్తుతం కంపెనీలు డిమాండ్ చేసే పని పరిస్థితులను విధించడానికి అనుమతిస్తుంది.
* కార్మిక చట్ట ఉల్లంఘనలపై కఠిన చర్యలు: కఠినమైన అమలు చర్యల ద్వారా కార్మిక చట్టాలను ఉల్లంఘించే కంపెనీలు జవాబుదారీగా ఉండేలా చూసుకోవాలి.
*’డిస్కనెక్ట్ హక్కు’ అమలు: ఉద్యోగులు పని గంటలు తర్వాత కమ్యూనికేషన్ను తిరస్కరించడానికి, పరిణామాలను ఎదుర్కోకుండా అనుమతించే విధానాలను ప్రవేశపెట్టడం. పని- వ్యక్తిగత జీవితానికి మధ్య స్పష్టమైన సరిహద్దును నిర్ధారించడం.
తాజావార్తలు
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
-
Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!