Karnataka: ప్రభుత్వ పాఠశాలల్లో ‘చిక్కీ’ పంపిణీని నిలిపివేసిన కర్ణాటక సర్కార్
- 2021లో మధ్యాహ్న భోజనంలో చిక్కీని ప్రవేశ పెట్టిన కర్ణాటక సర్కార్..
- చిక్కీ తినడంతో పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని నివేదిక..
- వెంటనే చిక్కీ పంపిణీని నిలిపివేయాలని సీఎం సిద్ధరామయ్య ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ‘చిక్కీ’ పంపిణీని నిలిపివేసింది. దీని ఎఫెక్ట్ పిల్లల ఆరోగ్యంపై ఉంటుందని ధార్వాడ్ డిప్యూటీ కమిషనర్ (పాఠశాల విద్య) ఇచ్చిన నివేదికలో తెలింది. అలాగే, అక్రమ నిల్వలు, గడువు ముగిసిన చిక్కీలను పంపిణీ చేయడంపై అందిన నివేదిక ఆందోళన కలిగిస్తుంది. ఈ చిక్కీలో అధిక అసంతృప్త కొవ్వులు, అధిక చక్కెర కంటెంట్ ఉండటం వల్ల పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. వెంటనే దీన్ని నిలిపివేయాలని సిద్ధరామయ్య సర్కార్ ఆదేశించింది. మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలల్లో చిక్కీకి బదులుగా గుడ్లు లేదా అరటి పండ్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Read Also: Chilukuru: రంగరాజన్పై దాడి కేసులో పోలీస్ కస్టడీకి ‘రామరాజ్యం’ వీర రాఘవరెడ్డి
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
- UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
- INIDIA alliance: ఇండియా కూటమి సమావేశానికి విజయ్ పార్టీకి నో ఎంట్రీ.. కాంగ్రెస్ చెప్పిన కారణం ఇదే!
అయితే, గుడ్లు, అరటిపండ్ల తినని పాఠశాలలోని పిల్లలకు వేరుశనగ-బెల్లం చిక్కీని ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 2021 డిసెంబర్ చివరలో పైలట్ ప్రాజెక్ట్ కింద ముందు చిక్కీ నమూనాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ను కోరింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది పిల్లలు వేరుశెనగ మిఠాయిని పోషకాహార సప్లిమెంట్గా ఎంచుకున్నారు. మరోవైపు, డిసెంబర్ 2022లో పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ఇండియన్ ఎక్స్ప్రెస్కు అందించిన డేటా ప్రకారం.. 2.27 లక్షల మంది పిల్లలు మాత్రమే చిక్కీలను తినడానికి ఇష్టపడుతున్నారు. దాదాపు 80 శాతం మంది విద్యార్థులు తమ మధ్యాహ్న భోజనంలో గుడ్లను ఎంచుకున్నారు. చిక్కీని అనుబంధ ఆహారంగా ప్రవేశపెట్టిన ఒక ఏడాది తర్వాత 1 నుంచి 8 తరగతుల ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థుల నుంచి ఈ డేటాను సేకరించారు.
తాజావార్తలు
-
Vastu Tips: ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశం వాస్తు ప్రకారం ఎలా ఉండాలి? చాలామందికి తెలియని విషయాలు ఇవే!
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!