Karnataka: ప్రభుత్వ పాఠశాలల్లో ‘చిక్కీ’ పంపిణీని నిలిపివేసిన కర్ణాటక సర్కార్
- 2021లో మధ్యాహ్న భోజనంలో చిక్కీని ప్రవేశ పెట్టిన కర్ణాటక సర్కార్..
- చిక్కీ తినడంతో పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని నివేదిక..
- వెంటనే చిక్కీ పంపిణీని నిలిపివేయాలని సీఎం సిద్ధరామయ్య ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ‘చిక్కీ’ పంపిణీని నిలిపివేసింది. దీని ఎఫెక్ట్ పిల్లల ఆరోగ్యంపై ఉంటుందని ధార్వాడ్ డిప్యూటీ కమిషనర్ (పాఠశాల విద్య) ఇచ్చిన నివేదికలో తెలింది. అలాగే, అక్రమ నిల్వలు, గడువు ముగిసిన చిక్కీలను పంపిణీ చేయడంపై అందిన నివేదిక ఆందోళన కలిగిస్తుంది. ఈ చిక్కీలో అధిక అసంతృప్త కొవ్వులు, అధిక చక్కెర కంటెంట్ ఉండటం వల్ల పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. వెంటనే దీన్ని నిలిపివేయాలని సిద్ధరామయ్య సర్కార్ ఆదేశించింది. మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలల్లో చిక్కీకి బదులుగా గుడ్లు లేదా అరటి పండ్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Read Also: Chilukuru: రంగరాజన్పై దాడి కేసులో పోలీస్ కస్టడీకి ‘రామరాజ్యం’ వీర రాఘవరెడ్డి
Also Read
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
- PoK: పీఓకేలో పాక్ అణచివేత.. భారత్ జోక్యం కోరిన JAAC
- Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
అయితే, గుడ్లు, అరటిపండ్ల తినని పాఠశాలలోని పిల్లలకు వేరుశనగ-బెల్లం చిక్కీని ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 2021 డిసెంబర్ చివరలో పైలట్ ప్రాజెక్ట్ కింద ముందు చిక్కీ నమూనాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ను కోరింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది పిల్లలు వేరుశెనగ మిఠాయిని పోషకాహార సప్లిమెంట్గా ఎంచుకున్నారు. మరోవైపు, డిసెంబర్ 2022లో పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ఇండియన్ ఎక్స్ప్రెస్కు అందించిన డేటా ప్రకారం.. 2.27 లక్షల మంది పిల్లలు మాత్రమే చిక్కీలను తినడానికి ఇష్టపడుతున్నారు. దాదాపు 80 శాతం మంది విద్యార్థులు తమ మధ్యాహ్న భోజనంలో గుడ్లను ఎంచుకున్నారు. చిక్కీని అనుబంధ ఆహారంగా ప్రవేశపెట్టిన ఒక ఏడాది తర్వాత 1 నుంచి 8 తరగతుల ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థుల నుంచి ఈ డేటాను సేకరించారు.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!