Karnataka: ప్రభుత్వ పాఠశాలల్లో ‘చిక్కీ’ పంపిణీని నిలిపివేసిన కర్ణాటక సర్కార్
- 2021లో మధ్యాహ్న భోజనంలో చిక్కీని ప్రవేశ పెట్టిన కర్ణాటక సర్కార్..
- చిక్కీ తినడంతో పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని నివేదిక..
- వెంటనే చిక్కీ పంపిణీని నిలిపివేయాలని సీఎం సిద్ధరామయ్య ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో ‘చిక్కీ’ పంపిణీని నిలిపివేసింది. దీని ఎఫెక్ట్ పిల్లల ఆరోగ్యంపై ఉంటుందని ధార్వాడ్ డిప్యూటీ కమిషనర్ (పాఠశాల విద్య) ఇచ్చిన నివేదికలో తెలింది. అలాగే, అక్రమ నిల్వలు, గడువు ముగిసిన చిక్కీలను పంపిణీ చేయడంపై అందిన నివేదిక ఆందోళన కలిగిస్తుంది. ఈ చిక్కీలో అధిక అసంతృప్త కొవ్వులు, అధిక చక్కెర కంటెంట్ ఉండటం వల్ల పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. వెంటనే దీన్ని నిలిపివేయాలని సిద్ధరామయ్య సర్కార్ ఆదేశించింది. మధ్యాహ్న భోజన పథకం కింద పాఠశాలల్లో చిక్కీకి బదులుగా గుడ్లు లేదా అరటి పండ్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Read Also: Chilukuru: రంగరాజన్పై దాడి కేసులో పోలీస్ కస్టడీకి ‘రామరాజ్యం’ వీర రాఘవరెడ్డి
Also Read
- Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
- Petrol-Diesel Price: హార్ముజ్లో భారీ దాడులు.. వాహనదారులకు ధరలు షాకిచ్చే ఛాన్స్!
- India-Sri Lanka: భారత్కు వ్యతిరేకంగా ఆ పని ఎప్పటికీ చేయబోం.. స్పష్టం చేసిన శ్రీలంక అధ్యక్షుడు!
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
అయితే, గుడ్లు, అరటిపండ్ల తినని పాఠశాలలోని పిల్లలకు వేరుశనగ-బెల్లం చిక్కీని ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో 2021 డిసెంబర్ చివరలో పైలట్ ప్రాజెక్ట్ కింద ముందు చిక్కీ నమూనాలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ను కోరింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది పిల్లలు వేరుశెనగ మిఠాయిని పోషకాహార సప్లిమెంట్గా ఎంచుకున్నారు. మరోవైపు, డిసెంబర్ 2022లో పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ ఇండియన్ ఎక్స్ప్రెస్కు అందించిన డేటా ప్రకారం.. 2.27 లక్షల మంది పిల్లలు మాత్రమే చిక్కీలను తినడానికి ఇష్టపడుతున్నారు. దాదాపు 80 శాతం మంది విద్యార్థులు తమ మధ్యాహ్న భోజనంలో గుడ్లను ఎంచుకున్నారు. చిక్కీని అనుబంధ ఆహారంగా ప్రవేశపెట్టిన ఒక ఏడాది తర్వాత 1 నుంచి 8 తరగతుల ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థుల నుంచి ఈ డేటాను సేకరించారు.
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!