Karnataka Governor: అవినీతికి పాల్పడిన ఉద్యోగులపై విచారణకు సంబంధించిన రిపోర్ట్ ఇవ్వడం..!
- కర్ణాటక ప్రభుత్వం- రాజ్భవన్ల మధ్య తీవ్ర స్థాయిలో వివాదం..
- అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై నివేదిక కోరిన గవర్నర్..
- వారంలోగా అన్ని వివరాలు ఇవ్వాలని కోరిన డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Governor: కర్ణాటక ప్రభుత్వం- రాజ్భవన్ల మధ్య తీవ్ర స్థాయిలో వివాదం కొనసాగుతుంది. మే 2023 నుంచి లోకాయుక్తలో ప్రభుత్వ అధికారులపై ప్రాసిక్యూషన్ కేసులపై గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ సమాచారం కోరారు. ఈ సందర్భంగా సిద్ధరామయ్య ప్రభుత్వంలోని అధికారులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న లోకాయుక్త అభ్యర్థన మేరకు కన్నడ సర్కార్ మంజూరు చేసిన ప్రాసిక్యూషన్పై సెప్టెంబర్ 5న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షాలినీ రజనీష్కు గవర్నర్ లేఖ రాశారు. ఇక, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతికి పాల్పడిన అధికారులు, ఉద్యోగులపై విచారణకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇవ్వాలని లేఖలో కోరారు.
Read Also: Womens T20 Worldcup 2024: భారీగా పెరిగిన మహిళల టి20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ..
Also Read
కాగా, లోకాయుక్త ప్రాసిక్యూషన్లకు సంబంధించి సమర్పించిన ప్రతిపాదనలపై సమగ్ర నివేదికను అందించాలని గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ తెలిపారు. క్యాబినెట్ నిర్ణయాలతో పాటు బిల్లులు ఆమోదం, సిఫార్సు చేసిన శిక్ష స్వభావంపై ఖచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాలని ఆయన కోరారు. అలాగే, తిరస్కరించబడిన ప్రతిపాదనలకు, వాటి నిర్ణయాల వెనుక గల కారణాలను పూర్తిగా వివరించాలని గవర్నర్ తెలిపారు. ఇక, థావర్చంద్ గెహ్లాట్ లేఖకు ప్రతిస్పందనగా సెప్టెంబర్ 10న డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్లోని విజిలెన్స్ సెల్.. ప్రాసిక్యూషన్ ఆంక్షల కోసం లోకాయుక్త చేసిన అభ్యర్థనను “అత్యవసరంగా” అందించాలని అన్ని విభాగాలను కోరింది. వారంలోగా అన్ని వివరాలను అందజేయాలని అన్ని శాఖలను ఆదేశించింది.
Read Also: Tirumala Tickets: భక్తులకు అలర్ట్.. కాసేపట్లో డిసెంబర్ నెల శ్రీవారి దర్శన టికెట్లు..
ఇక, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి, మాజీ మంత్రులు, బీజేపీ నేతలు సహా జనతాదళ్ (సెక్యులర్) నాయకులపై విచారణకు ఆదేశించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కోరిన నేపథ్యంలో గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) ద్వారా ప్రత్యామ్నాయ స్థలాల కేటాయింపులో అవకతవకలకు సంబంధించి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విచారణకు ఆగస్టు 17వ తేదీన గవర్నర్ అనుమతి ఇచ్చారు.
తాజావార్తలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
-
Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!