Tirumala Tickets: భక్తులకు అలర్ట్.. కాసేపట్లో డిసెంబర్ నెల శ్రీవారి దర్శన టికెట్లు..
- నేడు డిసెంబర్ నెల శ్రీవారి దర్శన టికెట్లు..
- లక్కీడిప్ టిక్కెట్లు పొందిన భక్తులు 22 మధ్యాహ్నం 12 గంటలలోపు రుసుం చెల్లించాలి..
- సెప్టెంబర్ 24న గదుల కేటాయింపు కోటాను విడుదల చేయనున్న టీటీడీ..
Tirumala Tickets: తిరుమల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ అధికారులు కాసేపట్లో (బుధవారం) విడుదల చేయనున్నారు. ఈ-సేవా టిక్కెట్ల ఎలక్ట్రానికి లక్కీడిప్ కోసం ఈ నెల 20వ తేదీన ఉదయం 10 గంటలకు నమోదు చేసుకునే అవకాశం. లక్కీడిప్ టిక్కెట్లు పొందిన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు రుసుం చెల్లించాల్సి ఉండబోతుంది. ఇక, లక్కీడిప్లో పొందిన టికెట్లు మంజూరు చేస్తారు టీటీడీ అధికారులు. డిసెంబర్ నెలకు సంబంధించిన వివిధ సేవలకు, దర్శనానికి ముందస్తుగా బుక్ చేసుకోవాలనుకునే భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూచిస్తున్నారు.
Also Read
- Tirumala Adulterated Ghee Case: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం.. ముగిసిన ఏక సభ్య కమిషన్ విచారణ..
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఇవాళ్టి నుంచే జులై నెల దర్శన టికెట్ల విడుదల
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సర్వదర్శనం టోకెన్ల సమయంలో మార్పులు..
- TTD Server Issue: టీటీడీ సర్వర్లో సాంకేతిక లోపం.. ఆన్లైన్ టికెట్ల జారీ రద్దు..
కాగా, డిసెంబరు నెలకు సంబంధించిన శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను సెప్టెంబరు 21 ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో టీటీడీ విడుదల చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటా రిలీజ్ తో పాటు.. వర్చువల్ సేవల దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను ఆన్ లైన్ లో విడుదల చేయబోతుంది. ఇక, సెప్టెంబరు 23వ తేదీన ఉదయం 10 గంటలకు డిసెంబరు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు టికెట్లను, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ కాలిక వ్యాధులున్నవారు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచితంగా స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కోటాను టీటీడీ ఆన్లైన్లో రిలీజ్ చేయబోతుంది.
Read Also: Jr. NTR : యంగ్ టైగర్ – వెట్రి మారన్ – Sun పిక్చర్స్.. ఫిక్స్..?
ఇక, డిసెంబరు నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను సెప్టెంబరు 24వ తేదీన ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలలో గదుల కేటాయింపు కోటాను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో తిరుమల తిరుపతి దేవాస్థానం విడుదల చేయనుంది. సెప్టెంబరు 27వ తేదీన శ్రీవారి సేవకు సంబంధించిన కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు ఆన్లైన్లో రిలీజ్ చేయబోతుంది టీటీడీ.
తాజావార్తలు
-
Srilanka Cricketలో కలకలం.. అధ్యక్షుడుతో సహా మొత్తం కమిటీ మూకుమ్మడి రాజీనామా.!
-
GPO Promotions : గ్రామ పంచాయతీ అధికారుల ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్
-
Toxic : టాక్సిక్ డీల్.. నిర్మాతలకు ముచ్చెమటలు పట్టిస్తున్న OTTలు!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో