Karnataka: వెలుగులోకి కాంగ్రెస్ ఎన్నికల సర్వే.. రాహుల్గాంధీపై బీజేపీ విమర్శలు
- కర్ణాటకలో వెలుగులోకి ఎన్నికల సంచలన సర్వే
- ఈవీఎంలపై సర్వే చేపట్టిన సిద్ధరామయ్య ప్రభుత్వం
- రాహుల్ గాంధీకి చెంపదెబ్బ లాంటిదని బీజేపీ వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా బీజేపీ, ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్ అగ్ర నేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రెస్మీట్లు పెట్టి మరీ విమర్శిస్తున్నారు. డిజిటల్ బోర్డుపై ఆధారాలు చూపిస్తూ ధ్వజమెత్తుతున్నారు.
తాజాగా కర్ణాటకలో ఒక సంచలన సర్వే వెలుగులోకి వచ్చింది. ఈవీఎంల ఓటింగ్పై కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వే వెలుగులోకి వచ్చింది. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ సర్వే చేపట్టింది. ప్రధాన ఎన్నికల అధికారి అన్బుకుమార్ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టింది. తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సర్వేలో ఈవీఎంలపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందంటూ 83 శాతం మంది మద్దతు తెలిపారు. 69 శాతం మంది ప్రజలు ఈవీఎంలు కచ్చితమైన సమాచారం ఇస్తాయని.. 14 శాతం మంది ఈవీఎంలను తాము సంపూర్ణంగా విశ్వసిస్తున్నట్లు అభిప్రాయం చెప్పారు.
Also Read
- NTA: నీట్ వివాదం.. NTAలో భారీ ప్రక్షాళన.. 47 మందిపై వేటు..
- Ravneet Singh Bittu: కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు రాజీనామా.. ఆమోదం
- Delhi: చాట్జీపీటీకి శుభవార్త.. ఏఎన్ఐ కంటెంట్ వినియోగంపై ఢిల్లీ హైకోర్టులో ఊరట
- Modi-Instagram: వైరల్ వీడియోతో ప్రధాని మోడీకి భారీ క్రేజ్.. ఒక్క రాత్రిలోనే సరికొత్త చరిత్ర
ఇది కూడా చదవండి: Zohran Mamdani: పాతకాలపు దుస్తుల్లో మెరిసిన న్యూయార్క్ మేయర్ దంపతులు.. ఎవరు డిజైన్ చేశారంటే..!
కర్ణాటకలోని 102 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ సర్వేను చేపట్టారు. బెంగళూరు, బెలగావి, కలబురగి, మైసూర్ సహా 102 నియోజకవర్గాల్లో ఈ సర్వే చేపట్టారు. అత్యధిక శాతం కలబురగిలో 83 శాతం మంది ఈవీఎంలను బలంగా విశ్వసిస్తున్నట్లు అభిప్రాయం చెప్పారు. మైసూర్లో 70 శాతం, బెళగావిలో 63 శాతం, బెంగళూరులో 63 శాతం విశ్వాసం వ్యక్తం చేశారు.
బీజేపీ ఎదురుదాడి..
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వే.. రాహుల్ గాంధీకి చెంపదెబ్బ లాంటిదని ప్రతిపక్ష నేత అశోక్ వ్యాఖ్యానించారు. దేశ మంతా తిరుగుతూ రాహుల్ గాంధీ అబద్ధాలు చెబుతున్నారని.. ఇప్పుడు సిద్ధరామయ్య ప్రభుత్వం చేపట్టిన సర్వేతో నిజాలేంటో బయటపడ్డాయని పేర్కొన్నారు. ఈ సర్వే కచ్చితంగా రాహుల్ గాంధీకి చెంపదెబ్బ లాంటిదేనని బీజేపీ ధ్వజమెత్తింది. ఇంత స్పష్టంగా ప్రజలు విశ్వసిస్తుంటే.. సిద్ధరామయ్య మాత్రం బ్యాలెట్ పేపర్లతో స్థానిక ఎన్నికలు నిర్వస్తామని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. బ్యాలెట్ ద్వారా నిర్వహిస్తే మళ్లీ కర్ణాటకను వెనక్కి తీసుకెళ్లినట్లే అవుతుందన్నారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా.. సత్యాన్ని ఎవరూ మార్చలేరన్నారు.
ఇది కూడా చదవండి: MP: లేబర్తో భార్య ఎఫైర్.. ఉపాధ్యాయుడైన భర్తను ఏం చేసిందంటే..!
For years, @RahulGandhi has travelled the country telling one story:
that India’s democracy is “in danger”,
that EVMs are “untrustworthy”,
that our institutions cannot be believed.But Karnataka has just told a very different story.
A statewide survey covering thousands of… pic.twitter.com/d6I5vs0QZ7
— R. Ashoka (@RAshokaBJP) January 1, 2026
తాజావార్తలు
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
-
Tirupati: పోలీసుల సాక్షిగా ప్రేమజంటపై దాడి.. మెడలోని తాళిబొట్టు తెంచి..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!