BJP MLA: శివుడు మూడో కన్ను తెరిస్తే రాహుల్ గాంధీ బూడిదే.. పార్లమెంట్లోనే అతడిని కొట్టాలి..
- రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే..
- పార్లమెంట్లో బంధించి కొట్టాలి..
- శివుడు మూడో కన్ను తెరిస్తే అతడు బూడిదే..
- హిందూవులను కించపరిస్తే చూస్తూ ఊరుకునేది లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MLA: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే భరత్ శెట్టి, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ వ్యతిరేఖ వ్యాఖ్యలు చేసినందుకు అతడిని పార్లమెంట్లో బంధించి, కొట్టాలని అన్నారు. ‘‘ రాహుల్ గాందీని పార్లమెంట్ లోపల లాక్కెళ్లి కొట్టాలి. ఈ చర్య ఎడెనిమిది ఎఫ్ఐఆర్లకు దాది తీస్తుంది. మంగళూర్ నగరానికి వస్తే, నేను అతడికి ఈ విధంగానే ఏర్పాట్లు చేస్తాను’’ అని మంగళూరు సిటీ నార్త్ ఎమ్మెల్యే శెట్టి అన్నారు.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శివుడి చిత్రాన్ని పట్టుకున్నారని, శివుడు మూడో కన్ను తెరిస్తే అతను బూదిదగా మారుతాడని ఆ పిచ్చివాడికి తెలియదని, వారు హిందూ వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తున్నారని బీజేపీ నేత ఆరోపించారు. రాహుల్ గాంధీకి పిచ్చి పట్టిందని తేలిపోయిందని, హిందువులు తమ గురించి ఏం చెప్పినా నిశ్శబ్ధంగా వింటారని ఆయన భావిస్తున్నారని, రాహుల్ గాంధీ పార్లమెంట్లో మొరిగితే, స్థానిక నాయకులు ఇక్కడ తోక ఊపడం ప్రారంభిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Ayodhya Ram Mandir: రూ.4కోట్లు చెక్ ఇచ్చింది.. అకౌంట్లో చూస్తే 3 రూపాయలే ఉన్నాయ్..అయోధ్య చెక్ బౌన్స్ కథ వింటే..
- GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
- Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
Read Also: Ukrainian President: మోడీ ఓ క్రిమినల్ను కౌగిలించుకోవడం బాధేసింది..
హిందూ మతాన్ని, సంస్థల్ని రక్షించడం బీజేపీ కర్తవ్యమని ఆయన అన్నారు. హిందువులు, హిందుత్వ అనేది వేర్వేరు అని కాంగ్రెస్ చెప్పడం ప్రారంభించిందని, ఇలాంటి నాయకుల వల్ల భవిష్యత్తులో హిందువులు ప్రమాదంలో పడతారని, హిందువులు బయటకు రాని పరిస్థితి సృష్టిస్తారని అన్నారు. కేరళలో రాహుల్ గాంధీ పర్యటిస్తే సెక్యులర్ వ్యక్తిగా మారుతాడని, అదే తమిళనాడుకి వెళ్తే నాస్తికుడు అవుతారని ఆరోపించారు. గుజరాత్ వచ్చినప్పడు ఆయన పరమ శివ భక్తుడిగా మారారని ఎద్దేవా చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 99 లోక్సభ సీట్లను సాధించి, గొప్ప విజయం సాధించినట్లు రాహుల్ గాంధీ చెప్పుకుంటున్నారని, శివాజీ, మహరాణా ప్రతాప్ హిందూ సమాజంలో జన్మించారు, ఎప్పుడు అవసరం అవచ్చిన ఆయుధాలు తీసుకుంటాం, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో మాకు బాగా తెలుసు, పార్లమెంట్లో దెబ్బలు తిన్న రాహుల్ గాంధీ బాగానే ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Hatha: పిల్లి చుట్టూ తిరిగే మిస్టరీ!.. ఇంటెన్స్ గా కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!