BJP MLA: శివుడు మూడో కన్ను తెరిస్తే రాహుల్ గాంధీ బూడిదే.. పార్లమెంట్లోనే అతడిని కొట్టాలి..
- రాహుల్ గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే..
- పార్లమెంట్లో బంధించి కొట్టాలి..
- శివుడు మూడో కన్ను తెరిస్తే అతడు బూడిదే..
- హిందూవులను కించపరిస్తే చూస్తూ ఊరుకునేది లేదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP MLA: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే భరత్ శెట్టి, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ వ్యతిరేఖ వ్యాఖ్యలు చేసినందుకు అతడిని పార్లమెంట్లో బంధించి, కొట్టాలని అన్నారు. ‘‘ రాహుల్ గాందీని పార్లమెంట్ లోపల లాక్కెళ్లి కొట్టాలి. ఈ చర్య ఎడెనిమిది ఎఫ్ఐఆర్లకు దాది తీస్తుంది. మంగళూర్ నగరానికి వస్తే, నేను అతడికి ఈ విధంగానే ఏర్పాట్లు చేస్తాను’’ అని మంగళూరు సిటీ నార్త్ ఎమ్మెల్యే శెట్టి అన్నారు.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ శివుడి చిత్రాన్ని పట్టుకున్నారని, శివుడు మూడో కన్ను తెరిస్తే అతను బూదిదగా మారుతాడని ఆ పిచ్చివాడికి తెలియదని, వారు హిందూ వ్యతిరేక విధానాన్ని అవలంభిస్తున్నారని బీజేపీ నేత ఆరోపించారు. రాహుల్ గాంధీకి పిచ్చి పట్టిందని తేలిపోయిందని, హిందువులు తమ గురించి ఏం చెప్పినా నిశ్శబ్ధంగా వింటారని ఆయన భావిస్తున్నారని, రాహుల్ గాంధీ పార్లమెంట్లో మొరిగితే, స్థానిక నాయకులు ఇక్కడ తోక ఊపడం ప్రారంభిస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Modi-Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకానున్న భారత్.. ఎవరెళ్తున్నారంటే..!
- AIADMK MLA Resignation: ఏఐఏడీఎంకేకు మరో షాక్.. ఎమ్మెల్యే ఎంఆర్ విజయభాస్కర్ రాజీనామా
- Supreme Court: రామమందిర విరాళాల కేసు: అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నో
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
Read Also: Ukrainian President: మోడీ ఓ క్రిమినల్ను కౌగిలించుకోవడం బాధేసింది..
హిందూ మతాన్ని, సంస్థల్ని రక్షించడం బీజేపీ కర్తవ్యమని ఆయన అన్నారు. హిందువులు, హిందుత్వ అనేది వేర్వేరు అని కాంగ్రెస్ చెప్పడం ప్రారంభించిందని, ఇలాంటి నాయకుల వల్ల భవిష్యత్తులో హిందువులు ప్రమాదంలో పడతారని, హిందువులు బయటకు రాని పరిస్థితి సృష్టిస్తారని అన్నారు. కేరళలో రాహుల్ గాంధీ పర్యటిస్తే సెక్యులర్ వ్యక్తిగా మారుతాడని, అదే తమిళనాడుకి వెళ్తే నాస్తికుడు అవుతారని ఆరోపించారు. గుజరాత్ వచ్చినప్పడు ఆయన పరమ శివ భక్తుడిగా మారారని ఎద్దేవా చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 99 లోక్సభ సీట్లను సాధించి, గొప్ప విజయం సాధించినట్లు రాహుల్ గాంధీ చెప్పుకుంటున్నారని, శివాజీ, మహరాణా ప్రతాప్ హిందూ సమాజంలో జన్మించారు, ఎప్పుడు అవసరం అవచ్చిన ఆయుధాలు తీసుకుంటాం, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో మాకు బాగా తెలుసు, పార్లమెంట్లో దెబ్బలు తిన్న రాహుల్ గాంధీ బాగానే ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
ENE Repeat: ఈ నగరానికి ఏమైంది Repeat.. దుమ్మురేపెందుకు మళ్ళీ రెడీ
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Suriya: ‘హోంబాలే’తో చేతులు కలిపిన సూర్య.. డైరెక్టర్ ఎవరంటే?
-
Modi-Khamenei: ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకానున్న భారత్.. ఎవరెళ్తున్నారంటే..!
-
HYDRA Operation: హస్మత్పేటలో ఆపరేషన్.. రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా!
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!