Lok Sabha elections: కాంగ్రెస్ కూటమి అభ్యర్థికి మద్దతుగా “ముంబై పేలుళ్ల” నిందితుడు ఇబ్రహీం మూసా ప్రచారం.. ఎవరు ఇతను..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lok Sabha elections: 1993 ముంబై పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న ఇబ్రహీం ముసా కాంగ్రెస్-శివసేన(ఉద్ధవ్)-ఎన్సీపీ(శరద్ పవార్)ల ‘మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)’ కూటమి అభ్యర్థి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం వివాదాస్పదమైంది. నార్ వెస్ట్ ముంబై ఎంపీ స్థానం నుంచి ఎంవీఏ కూటమి అభ్యర్థిగా శివసేన(ఉద్ధవ్) పార్టీకి చెందిన అమోల్ కీర్తీకర్ తరపున ఇజ్రహీం ముసా ప్రచారం చేసిన వీడియో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ షేర్ చేసింది. అమోల్ కీర్తికర్ బుధవారం చేసిన ర్యాలీలో ముసా కనిపించాడని బీజేపీ పేర్కొంది.
ఈ విషయంపై బీజేపీ ఎమ్మెల్యే అమిత్ సతమ్, అమోల్ కీర్తికర్పై విరుచుకుపడ్డారు. ‘‘నిన్న సాయంత్రం అంధేరీ వెస్ట్లో, 1993 బాంబు పేలుళ్ల కేసు నిందితుడు బాబా మూసా ఫీల్డ్లో ముంబై నార్త్ వెస్ట్ MVA అభ్యర్థి అమోల్ కీర్తికర్కు ప్రచారం చేస్తూ మరియు మద్దతు ఇస్తూ కనిపించాడు. ఇది జాతీయవాద శక్తులు మరియు తుక్డే తుక్డే గ్యాంగ్ మధ్య పోరు మాత్రమే ఇప్పుడు స్పష్టమైందని, ఇది భారత్-పాకిస్తాన్ మధ్య పోరుగా అందరూ గుర్తించాలి’’ అని ఆయన అన్నారు. ఈ వీడియో బయటకు రావడంతో ఎంవీఏలోని కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే పార్టీలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 1993 పేలుళ్లలో ముంబైని రక్షించేందుకు అనేక హిందువులు తమ ప్రాణాలను అర్పించారు. కాంగ్రెస్ ఉగ్రవాదులకు మద్దతుగా వ్యవహరిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
- UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
- CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
- Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
Read Also: Padma Rao Goud: ఎంపీగా గెలిపిస్తే సికింద్రాబాద్ పార్లమెంట్ అభివృద్ధికై కొట్లాడుతా..
ఇబ్రహీం ముసా ఎవరు..?
బాబా చౌహాన్ అని కూడా పిలువబడే మూసా 1993 బాంబే పేలుళ్ల కేసులో దోషి. ముంబై వరస బాంబు పేలుళ్ల కేసులో పేలుళ్లకు ముందు నటుడు సంజయ్ దత్ ఇంటికి ఆయుధాలు తీసుకెళ్లినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ప్రాసిక్యూషన్ ప్రకారం, మూసా గ్యాంగ్స్టర్ అబూ సలేం, ఇతరులు జనవరి 15, 1993న ఆయుధాలను మరుసటి రోజు డెలివరీ చేస్తామని అతడికి తెలియజేయడానికి సంజయ్ దత్ ఇంటికి వెళ్లారు. ఈ పేలుళ్లలో 257 మంది మరణించగా.. 700 మందికి పైగా గాయపడ్డారు.
రాజకీయ వివాదం:
ముంబై నార్త్ వెస్ట్ సీటులో ప్రధానం శివసేన(ఏక్నాథ్ షిండే), శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) పోటీ పడుతున్నాయి. బీజేపీ-శివసేన(షిండే)-ఎన్సీపీ(అజిత్ పవార్) కూటమి అయిన ‘మహాయుతి’ నుంచి రవీంద్ర వైకర్ పోటీలో ఉన్నారు. మరోవైపు ఎంవీఏ నుంచి అమోల్ కీర్తికర్ పోటీ చేస్తున్నారు. తాజాగా ఇజ్రహీం ముసా వీడియో వెలుగులోకి రావడంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ముంబై నార్త్ వెస్ట్ నియోజకవర్గానికి మే 20న ఎన్నికలు జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.
विचारांची पहा अधोगती
उबाठाची 'मशाल' दहशतवाद्यांच्या हातीउबाठा गटाचा निर्लज्जपणाचा कळस…
कुठे हिंदुह्रदयसम्राट वंदनीय बाळासाहेब ठाकरे आणि कुठे तुम्ही?
१९९३ च्या मुंबई बॉम्बस्फोटातील आरोपी इकबाल मुसा हा उत्तर पश्चिमचे उद्धव ठाकरे गट आणि महाविकास आघाडीचे उमेदवार अमोल कीर्तिकर… pic.twitter.com/FAo1JEj9u8— भाजपा महाराष्ट्र (@BJP4Maharashtra) May 9, 2024
తాజావార్తలు
-
Virat Kohli Record: రోహిత్ శర్మ రికార్డు సమం చేసిన ‘కింగ్’ కోహ్లీ.. ఐపీఎల్ చరిత్రలో టాప్లో ఇద్దరు దిగ్గజాలు!
-
Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!
-
Grok AI: నువ్వు భారత పౌరుడైతే ఎవరికి ఓటు వేస్తావు? మోడీకా? రాహుల్కా?.. షాకింగ్ సమాధానం ఇచ్చిన గ్రోక్ ఏఐ!
-
NTV Exclusive: 100 ఎకరాల్లో బడా నిర్మాణ సంస్థ కొత్త ‘ఫిలిం సిటీ’!
-
Gold and Silver Rates: 15% దిగుమతి సుంకం పెంపు ఎఫెక్ట్.. బంగారం ధర ఎంత? వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!