Supreme court: సుప్రీంకు ఇద్దరు కొత్త జడ్జీలు.. తొలిసారి మణిపూర్ నుంచి నియామకం
- సుప్రీంకోర్టుకు ఇద్దరు కొత్త జడ్జీలు
- తొలిసారి మణిపూర్ నుంచి నియామకం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ సర్వోన్నత న్యాయస్థానానికి కొత్తగా ఇద్దరు జడ్జీల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఈ నియామకాలను న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్లో పోస్టు చేశారు. జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్ మహదేవన్ను కేంద్రం నియమించింది. దీంతో ఇప్పుడు సుప్రీం కోర్టులో న్యాయమూర్తుల సంఖ్య భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్తో సహా 34 మంది అయ్యారు. ఈ ఇద్దరు న్యాయమూర్తులు పదోన్నతిని సుప్రీంకోర్టు కొలీజియం గతంలో సిఫారసు చేసింది.
ఇది కూడా చదవండి: SIIMA 2024: సైమా 2024.. దసరా vs హాయ్ నాన్న.. నానితో నానికే పోటీ!
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
- Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
- 1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ మణిపూర్ నుంచి సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందిన మొదటి న్యాయమూర్తిగా నిలిచారు. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. జస్టిస్ కోటీశ్వర్ సింగ్ మణిపూర్ మొదటి అడ్వకేట్ జనరల్ ఎన్ ఇబోటోంబి సింగ్ కుమారుడు. ఢిల్లీ యూనివర్శిటీలోని కిరోరి మాల్ కాలేజ్ మరియు క్యాంపస్ లా సెంటర్లో పూర్వ విద్యార్థి. 1986లో న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించారు. న్యాయమూర్తి కాకముందు మణిపూర్ అడ్వకేట్ జనరల్గా కూడా పనిచేశారు. అనంతరం గౌహతి హైకోర్టు మరియు మణిపూర్ హైకోర్టులలో పనిచేశారు.
ఇది కూడా చదవండి: Crime News: యువతిని కిడ్నాప్ చేసి వేళ్లు, గొంతు కోసి హత్య..
ఇక జస్టిస్ మహదేవన్ ప్రస్తుతం మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. చెన్నైలో జన్మించిన జస్టిస్ మహదేవన్ మద్రాసు న్యాయ కళాశాల పూర్వ విద్యార్థి. న్యాయవాదిగా 9,000 కేసులకు పైగా డీల్ చేశారు. తమిళనాడు ప్రభుత్వానికి అదనపు గవర్నమెంట్ ప్లీడర్ (పన్నులు), అదనపు కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్ మరియు మద్రాసు హైకోర్టులో భారత ప్రభుత్వానికి సీనియర్ ప్యానెల్ న్యాయవాదిగా కూడా పనిచేశారు. 2013లో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
In exercise of the powers conferred by the Constitution of India, Hon’ble President, after consultation with Hon’ble Chief Justice of India, is pleased to appoint the following as
Supreme Court Judges:- pic.twitter.com/OWQ9iGIooG— Arjun Ram Meghwal (@arjunrammeghwal) July 16, 2024
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..