Soumya Vishwanathan Case: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హంతకులకు జీవిత ఖైదు విధించిన కోర్టు..
Soumya Vishwanathan Case: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్యకేసులో నిందితులకు ఢిల్లీ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. నలుగురు నిందితులను దోషులుగా తేల్చిన కోర్టు వీరికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు ఈ రోజు తీర్పు ప్రకటించింది. నలుగురు దోషుల చర్య ‘అరుదైన’ కేటగిరీ కిందికి రాదని, అందువల్ల వీరికి మరణశిక్ష విధించలేమని కోర్టు పేర్కొంది.
ఇండియా టుడే గ్రూప్లో జర్నలిస్టుగా పనిచేస్తున్న సౌమ్య విశ్వనాథాన్2ని సెప్టెంబర్ 30, 2008 తెల్లవారుజామున దక్షిణ ఢిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్లో హత్య చేశారు. పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో నిందితులు కాల్చి చంపారు. అయితే చోరీ చేయాలనే ఉద్దేశంతోనే ఆమెను చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. నేరం జరిగిన 15 ఏళ్ల తరువాత నిందితులకు శిక్షను విధించింది. హత్య, సాధారణ ఉద్దేశంతోనే రవి కపూర్, అమిత్ శుక్లా, అజయ్ కుమార్, బల్జీత్ మాలిక్, అజయ్ సేథీలను అక్టోబర్ 18న కోర్టు దోషులుగా నిర్ధారించింది.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Uttar Pradesh: ప్రవక్తను అవమానించాడని కండక్టర్పై దాడి.. ఎన్కౌంటర్ చేసి నిందితుడి అరెస్ట్..
వ్యక్తి మరణానికి కారణమైన వ్యవస్థీకృత నేరానికి పాల్పడినందుకు మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) నిబంధనల ప్రకారం దోషులు కూడా దోషులుగా నిర్ధారించబడ్డారు. నేరాలకు గరిష్ట శిక్షగా మరణశిక్ష విధించబడింది. సెక్షన్ 411 ప్రకారం నిజాయితీగా లేకుండా దొంగిలించిన ఆస్తిని స్వీకరించడం, వ్యవస్థీకృత నేరానికి సహకరించడానికి కుట్ర పన్నినందుకు ఐదవ వ్యక్తి అజయ్ సేధీని కోర్టు దోషిగా నిర్ధారించింది. అతనికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
రవి కపూర్ ఆమెను దోచుకోవడానికి బాధితురాలి కారును వెంబడిస్తున్నప్పుడు, నెల్సన్ మండేలా మార్గ్లోకి విశ్వనాథ్ రాగానే, నాటు తుపాకీతో కాల్చారు. ఈ నేరంలో కపూర్ తోపాటు శుక్లా, కుమార్, మాలిక్ కూడా ఉన్నారు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం.. సౌమ్యవిశ్వనాథన్ తలపై బుల్లెట్ గాయం కావడంతోనే మరణించినట్లు వెల్లడైంది. అంతకుముందు దీన్ని కారు ప్రమాదంగా భావించారు.
తాజావార్తలు
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
-
India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
-
SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
-
AP Govt: 99 పైసలకే ఎకరం భూమి కేటాయించిన ఏపీ.. మొత్తం 20 ఎకరాలు..
-
India Women vs SA Women: ఛేదనలో బొక్కబోర్లా పడ్డ టీమిండియా.. 4-1తో సిరీస్ ఓటమి.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!