Soumya Vishwanathan Case: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హంతకులకు జీవిత ఖైదు విధించిన కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Soumya Vishwanathan Case: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్యకేసులో నిందితులకు ఢిల్లీ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. నలుగురు నిందితులను దోషులుగా తేల్చిన కోర్టు వీరికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు ఈ రోజు తీర్పు ప్రకటించింది. నలుగురు దోషుల చర్య ‘అరుదైన’ కేటగిరీ కిందికి రాదని, అందువల్ల వీరికి మరణశిక్ష విధించలేమని కోర్టు పేర్కొంది.
ఇండియా టుడే గ్రూప్లో జర్నలిస్టుగా పనిచేస్తున్న సౌమ్య విశ్వనాథాన్2ని సెప్టెంబర్ 30, 2008 తెల్లవారుజామున దక్షిణ ఢిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్లో హత్య చేశారు. పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో నిందితులు కాల్చి చంపారు. అయితే చోరీ చేయాలనే ఉద్దేశంతోనే ఆమెను చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. నేరం జరిగిన 15 ఏళ్ల తరువాత నిందితులకు శిక్షను విధించింది. హత్య, సాధారణ ఉద్దేశంతోనే రవి కపూర్, అమిత్ శుక్లా, అజయ్ కుమార్, బల్జీత్ మాలిక్, అజయ్ సేథీలను అక్టోబర్ 18న కోర్టు దోషులుగా నిర్ధారించింది.
Also Read
- Mamata Banerjee: కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోవడం ఖాయం.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు..
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Nationwide Medical Shop Strike: నేడు దేశవ్యాప్తంగా మెడికల్ ఎమర్జెన్సీ? బంద్ కానున్న 15 లక్షల మందుల దుకాణాలు!
- PM Modi: రోమ్లో మోదీ.. భారత్-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యంపై దృష్టి.!
Read Also: Uttar Pradesh: ప్రవక్తను అవమానించాడని కండక్టర్పై దాడి.. ఎన్కౌంటర్ చేసి నిందితుడి అరెస్ట్..
వ్యక్తి మరణానికి కారణమైన వ్యవస్థీకృత నేరానికి పాల్పడినందుకు మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ (MCOCA) నిబంధనల ప్రకారం దోషులు కూడా దోషులుగా నిర్ధారించబడ్డారు. నేరాలకు గరిష్ట శిక్షగా మరణశిక్ష విధించబడింది. సెక్షన్ 411 ప్రకారం నిజాయితీగా లేకుండా దొంగిలించిన ఆస్తిని స్వీకరించడం, వ్యవస్థీకృత నేరానికి సహకరించడానికి కుట్ర పన్నినందుకు ఐదవ వ్యక్తి అజయ్ సేధీని కోర్టు దోషిగా నిర్ధారించింది. అతనికి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
రవి కపూర్ ఆమెను దోచుకోవడానికి బాధితురాలి కారును వెంబడిస్తున్నప్పుడు, నెల్సన్ మండేలా మార్గ్లోకి విశ్వనాథ్ రాగానే, నాటు తుపాకీతో కాల్చారు. ఈ నేరంలో కపూర్ తోపాటు శుక్లా, కుమార్, మాలిక్ కూడా ఉన్నారు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం.. సౌమ్యవిశ్వనాథన్ తలపై బుల్లెట్ గాయం కావడంతోనే మరణించినట్లు వెల్లడైంది. అంతకుముందు దీన్ని కారు ప్రమాదంగా భావించారు.
తాజావార్తలు
-
Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
-
Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
-
Modi-Meloni: ఇటలీలో ప్రధాని మోడీ.. నేటి చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మెలోని ఫొటోలు షేర్ చేసిన పీఎం..
-
Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
-
Hyderabad: అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?