Soumya Vishwanathan: దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో ఇటీవల నిందితులకు కోర్టు జీవితఖైదు విధించింది. తన కూతురికి న్యాయం జరిగిందని సంతోషించేలోపలే, సౌమ్య విశ్వనాథన్ తండ్రి ఎంకే విశ్వనాథన్ శనివారం కన్నుమూశారు. 82 ఏళ్ల ఎంకే విశ్వనాథన్ విచారణకు రెండు రోజుల ముందు గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారు. చికిత్స తీసుకుంటూనే, తన కూతురి హత్య కేసులో నిందితులకు శిక్ష పడిందని తెలుసుకున్నారు.
Soumya Vishwanathan Case: జర్నలిస్ట్ సౌమ్య విశ్వనాథన్ హత్యకేసులో నిందితులకు ఢిల్లీ కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. నలుగురు నిందితులను దోషులుగా తేల్చిన కోర్టు వీరికి జీవిత ఖైదు విధిస్తున్నట్లు ఈ రోజు తీర్పు ప్రకటించింది. నలుగురు దోషుల చర్య ‘అరుదైన’ కేటగిరీ కిందికి రాదని, అందువల్ల వీరికి మరణశిక్ష విధించలేమని కోర్టు పేర్కొంది.