Joe Biden: మన్మోహన్ సింగ్కి నివాళి అర్పించిన అమెరికా అధ్యక్షుడు..
- మన్మోహన్ సింగ్కి జో బైడెన్ నివాళి..
- అమెరికా-ఇండియా సంబంధాలకు కృషి..
- అణు ఒప్పందం, క్వాడ్ ఏర్పాటులో మన్మోహన్ కృషిపై ప్రశంసలు..
Joe Biden: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కి నివాళులర్పించారు. భారతదేశానికి తమ సంతాపాన్ని తెలిపారు. ‘‘ప్రజాసేవకుడు, వినయపూర్వకమైన వ్యక్తి’’ అని బైడెన్ కొనియాడారు. అమెరికా-భారత్ ద్వైపాక్షిక సహకారం కోసం వ్యూహాత్మక దృష్టి, రాజకీయ ధైర్యాన్ని ప్రదర్శించారని ప్రశంసించారు. ‘‘భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లేరనే బాధలో ఉన్న భారతదేశ ప్రజలతో నేను, జిల్ కలిసి ఉన్నాం. ఈ క్లిష్ట సమయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తన జీవితాన్ని అంకితం చేసిన దార్శనికతను మేం గుర్తు చేసుకుంటున్నాము. జిల్, నేను మాజీ ప్రధాని భార్య గురుశరణ్ కౌర్, వారి ముగ్గురి పిల్లకు, భారత ప్రజలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము’’ అని జోబైడెన్ ప్రకటనను వైట్హౌజ్ విడుదల చేసింది.
Read Also: Jeevan Reddy: కేంద్రం మన్మోహన్ సింగ్ను భారత రత్నతో గౌరవించాలి..
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
భారతదేశానికి రెండు సార్లు ప్రధానిగా చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ 92 ఏళ్ల వయసులో గురువారం రాత్రి న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో మరణించారు. ఆయన మరణంపై జో బైడెన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యూహాత్మక దృక్పథం, రాజకీయ ధైర్యం లేకుండా ఈరోజు అమెరికా, బారత్ మధ్య అపూర్వ స్థాయి సహకారం సాధ్యమయ్యేది కాదు’’ అని ఆయన అన్నారు. యూఎస్-ఇండియా పౌర అణు ఒప్పందం, ఇండో-పసిఫిక్ భాగస్వాముల మధ్య మొదటి క్వాడ్ని ప్రారంభించడంలో ఆయన సాయం మరవలేనిదని కొనియాడారు. 2008లో సెనేట్ ఫారిన్ రిలేషన్స్ కమిటీ ఛైర్మన్గా, 2009లో వైస్ ప్రెసిడెంట్గా మన్మోహన్ సింగ్ని కలిసే అవకాశం లభించిందని జో బైడెన్ చెప్పారు. 2013లో న్యూఢిల్లీలో తనకు ఆతిథ్యం ఇచ్చినట్లు గుర్తు చేసుకున్నారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!