PM Modi-Trump call: ఇరాన్ యుద్ధంపై ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో చర్చించారు. ఇరువురు నేతలు చర్చిస్తున్న సమయంలో అసాధారణ ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్లో బిలయనీర్ ఎలాన్ మస్క్ కూడా పాల్గొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. సాధారణంగా ఇరువురు దేశాధినేతలు మాట్లాడుకునేటప్పుడు మూడో వ్యక్తి కాల్లో కనిపించడం అసాధారణం. మంగళవారం అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని మోడీల మధ్య ఫోన్ కాల్లో ఎలాన్ మస్క్ పాల్గొన్నట్లు నివేదిక పేర్కొంది. Read Also: Akhil…
Modi-Trump: అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం ప్రారంభమై నాలుగో వారానికి చేరింది. ఇప్పటికీ ఇరాన్పై యూఎస్, ఇజ్రాయిల్ దాడులు చేస్తూనే ఉన్నాయి. ఇరాన్ ప్రతీకార దాడుల్ని ఆపడం లేదు, ఇజ్రాయిల్, గల్ఫ్ దేశాలపై అటాక్స్ చేస్తోంది. అయితే, యుద్ధం ప్రారంభమై ఇన్ని రోజులు గడిచిన తర్వాత, మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , భారత ప్రధాని నరేంద్రమోడీకి ఫోన్ చేశారు. ‘‘హార్ముజ్ జలసంధి’’, ఇరాన్ యుద్ధంపై ఇరువురు నేతలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే,…
Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ వెనిజులా ఆయిల్ కొనేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇరాన్ నుంచి చమురు కొనగోలుకు బదులుగా భారత్ వెనిజులా నుంచి చమురు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదర్చుకుందని ఆయన శనివారం చెప్పారు. ఎయిర్ ఫోర్స్ వన్లో విలేకరులతో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ విషయంపై న్యూఢిల్లీ నుంచి తక్షణ స్పందన రాలేదు.
Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ‘‘సార్’’ అని సంభోదించారని ట్రంప్ అన్నారు. అపాచీ హెలికాప్టర్ల డెలివరీలపై ప్రధాని మోడీ తనను నేరుగా సంప్రదించారని చెప్పారు.
Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ఫైటర్ జెట్లను కూల్చాము. భారత్ మా దెబ్బకు వణికిపోయింది.’’ అని ప్రగల్భాలు పలికిన పాకిస్తాన్ అసలు భయం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. భారత దాడులకు భయపడిన పాకిస్తాన్, అమెరికాను కాపాడాలని వేడుకున్నట్లు తెలుస్తోంది. తమ వైమానిక స్థావరాలు, ఉగ్రవాద శిబిరాలపై భారత్ విరుచుకుపడిన తర్వాత పాకిస్తాన్ సాయం కోసం అమెరికాకు పరిగెత్తిందని అమెరికా ప్రభుత్వ పత్రాలు తెలియజేస్తున్నాయి.
China: ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు వచ్చారు. డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్లో పర్యటించారు. ఈ పర్యటనలో భారత్, రష్యాల మధ్య అనేక ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. అంతకుమందు, పుతిన్ ఢిల్లీలోని పాలం ఎయిర్పోర్టులో దిగిన వెంటనే, స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ స్వాగతం పలికారు. ఇద్దరూ ఒకే కారులో ప్రధాని నివాసంలో నిర్వహించిన విందుకు హాజరయ్యారు.
Marko Rubio: ఢిల్లీ బాంబు పేలుళ్ల దర్యాప్తులో తమ దేశం భారతదేశానికి సహాయం అందించిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బుధవారం అన్నారు. భారత దర్యాప్తు సంస్థలను ప్రశంసించారు. "భారత్కు చెందిన దర్యాప్తు సంస్థలు చాలా ప్రొఫెషనల్, ఖచ్చితమైన దర్యాప్తును నిర్వహించగల పూర్తి సామర్థ్యం కలిగి ఉన్నాయి.
శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో పురోగతి లేకపోవడంతో అధ్యక్షుడు ట్రంప్ "ఎక్కువగా నిరాశ చెందారు" అని తెలిపారు. రష్యా చమురు సంస్థలపై తాజాగా విధించిన ఆంక్షలు మాస్కో ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీస్తాయని పేర్కొనింది.
Trump: వైట్హౌస్లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో దీపాలు వెలిగించి దీపావళి జరుపుకొన్నారు. భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ.. భారతీయులంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. భారత ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడాను. ఇద్దరం అద్భుతమైన సంభాషణ జరిపాం. వాణిజ్యం, అనేక విషయాలను చర్చించాం. ముఖ్యంగా వ్యాపార ప్రపంచం గురించి చర్చించుకున్నాం. ప్రపంచ వాణిజ్యంపై మోడీకి చాలా ఆసక్తి ఉంది.…
H-1B visa: H-1B visa వీసాపై డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయ టెక్కీలో తీవ్ర ఆందోళన పెంచింది. వీసాల కోసం ఏకంగా USD 100,000 (రూ. 88 లక్షలు) చెల్లించాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఈ నిర్ణయం అమెరికన్ డ్రీమ్ ఉన్న యువతను కంగారు పెట్టింది. ముఖ్యంగా, హెచ్1బీ వీసా కలిగిన వారిలో భారతీయులే 70 శాతం మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.