Congress: ఓటమి ఫలితం.. కమల్నాథ్ స్థానంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్గా జితూ పట్వారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది. గత రెండు దశాబ్ధాలుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే గతంలో పోలిస్తే ఈ సారి మరింత ఘోరంగా కాంగ్రెస్ ఓడిపోయింది. ఈ ఓటమి కారణంగా రాష్ట్ర పీసీసీ చీఫ్ కమల్ నాథ్ని మారుస్తుందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
అయితే తాజాగా శనివారం రోజు కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్గా కమల్ నాథ్ని తొలగించి, ఆయన స్థానంలో జితూ పట్వారీని నియమించింది. జితు పట్వారినీ తక్షణమే రాష్ట్ర పీసీసీ చీఫ్గా నియమిస్తూ.. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడి పేరిట ఆదేశాలు జారీ చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా కమల్ నాథ్ అందించిన సేవల్ని పార్టీ అభినందిస్తోందని ఒక ప్రకటనలో కాంగ్రెస్ తెలిపింది. రవ్ నియోజకవర్గం నుంచి 2018లో ఎమ్మెల్యేగా గెలుపొందిన జితు పట్వారీ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థి మధు శర్మ చేతిలో ఏకంగా 35 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్గా పనిచేశారు.
Also Read
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
- PoK: పీఓకేలో పాక్ అణచివేత.. భారత్ జోక్యం కోరిన JAAC
- Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
Read Also: Solar flare: సూర్యుడి నుంచి ఎగిసిపడిన అతిపెద్ద సౌరజ్వాల.. భూమి వైపు దూసుకొస్తోంది..
పీసీసీ చీఫ్తో పాటు ఉమంగ్ శింగార్ని ప్రతిపక్ష నేతగా, హేమంత్ కటారేని మధ్యప్రదేశ్ విధానసభలో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ లీడర్గా నియమించింది.పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకోనున్న జితూ పట్వారీ, గతంలో కమల్ నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉన్నతవిద్యా, యువజన, క్రీడా మంత్రిగా పనిచేశారు. 2018లో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపిసిసి) చీఫ్గా కమల్ నాథ్ నియమితులైనప్పుడు, పట్వారీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు.
ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. 230 స్థానాలు ఉన్న ఎంపీ అసెంబ్లీలో బీజేపీ 163 స్థానాలను గెలుచుకుంటే.. కాంగ్రెస్ కేవలం 66 సీట్లకు మాత్రమే పరిమితమైంది. బీజేపీ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహన్ స్థానంలో కొత్తగా మోహన్ యాదవ్ని సీఎంగా చేసింది.
తాజావార్తలు
-
Sreeleela: కాబోయే భర్తకు మూడు కండిషన్స్.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
-
Axar Patel: టీ20ల్లో ‘స్పెషల్ సెంచరీ’.. తొలి భారత స్పిన్నర్గా అక్షర్ పటేల్ అరుదైన రికార్డ్
-
Vijay Deverakonda: సేవా కార్యక్రమాలతో మరోసారి మనసులు గెలిచిన విజయ్.. రాజకీయాలపై కొత్త చర్చకు కారణమయ్యారా?
-
Donald Trump: ట్రంప్ కీలక ప్రకటన.. బాస్ ఎవరో నెతన్యాహుకు తెలుసు..!
-
Bhadra Rajyoga 2026: జూలై 7 నుంచి ఈ మూడు రాశుల అదృష్టం మారనుందా? బుధుడి సంచారం వల్ల ఎవరికి ఎక్కువ లాభం?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!