Congress: ఓటమి ఫలితం.. కమల్నాథ్ స్థానంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్గా జితూ పట్వారీ..
Congress: ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది. గత రెండు దశాబ్ధాలుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంది. అయితే గతంలో పోలిస్తే ఈ సారి మరింత ఘోరంగా కాంగ్రెస్ ఓడిపోయింది. ఈ ఓటమి కారణంగా రాష్ట్ర పీసీసీ చీఫ్ కమల్ నాథ్ని మారుస్తుందనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి.
అయితే తాజాగా శనివారం రోజు కాంగ్రెస్ పార్టీ పీసీసీ చీఫ్గా కమల్ నాథ్ని తొలగించి, ఆయన స్థానంలో జితూ పట్వారీని నియమించింది. జితు పట్వారినీ తక్షణమే రాష్ట్ర పీసీసీ చీఫ్గా నియమిస్తూ.. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడి పేరిట ఆదేశాలు జారీ చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా కమల్ నాథ్ అందించిన సేవల్ని పార్టీ అభినందిస్తోందని ఒక ప్రకటనలో కాంగ్రెస్ తెలిపింది. రవ్ నియోజకవర్గం నుంచి 2018లో ఎమ్మెల్యేగా గెలుపొందిన జితు పట్వారీ.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మాత్రం బీజేపీ అభ్యర్థి మధు శర్మ చేతిలో ఏకంగా 35 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్గా పనిచేశారు.
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
Read Also: Solar flare: సూర్యుడి నుంచి ఎగిసిపడిన అతిపెద్ద సౌరజ్వాల.. భూమి వైపు దూసుకొస్తోంది..
పీసీసీ చీఫ్తో పాటు ఉమంగ్ శింగార్ని ప్రతిపక్ష నేతగా, హేమంత్ కటారేని మధ్యప్రదేశ్ విధానసభలో కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ లీడర్గా నియమించింది.పీసీసీ చీఫ్గా బాధ్యతలు తీసుకోనున్న జితూ పట్వారీ, గతంలో కమల్ నాథ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఉన్నతవిద్యా, యువజన, క్రీడా మంత్రిగా పనిచేశారు. 2018లో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపిసిసి) చీఫ్గా కమల్ నాథ్ నియమితులైనప్పుడు, పట్వారీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు.
ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. 230 స్థానాలు ఉన్న ఎంపీ అసెంబ్లీలో బీజేపీ 163 స్థానాలను గెలుచుకుంటే.. కాంగ్రెస్ కేవలం 66 సీట్లకు మాత్రమే పరిమితమైంది. బీజేపీ నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహన్ స్థానంలో కొత్తగా మోహన్ యాదవ్ని సీఎంగా చేసింది.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!