Coimbatore Blast Case: కోయంబత్తూర్ పేలుడులో “జిహాద్” కోణాలు.. నిందితుడి ఇంట్లో కీలక విషయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jihad literature recovered from Coimbatore car bomb accused home: తమిళనాడులో కోయంబత్తూర్ కార్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఉగ్రకోణం ఉన్నట్లు ఇప్పటికే తమిళనాడు పోలీసులు గుర్తించారు. తాజాగా నిందితుడి ఇంట్లో కీలక విషయాలను గుర్తించారు. అక్టోబర్ 23న కోయంబత్తూర్ కారు పేలుడుతో మరణించిన నిందితుడు జమేషా ముబీన్ ఇంటి నుంచి జీహాద్ కు సంబంధించిన పత్రాలను, చిత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Theft In Apple Company: అట్లుంటది మనతోటి.. ఏడేళ్లుగా ఎవరికీ తెలియకుండా రూ.140కోట్లు కొట్టేసిండు
Also Read
- Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
- PM Kisan 23వ విడత: ఖరీఫ్ సీజన్ వేళ రైతులకు కీలక అప్డేట్.. జూన్ 18న రూ.2,000 ఖాతాలో జమ అవుతాయా?
- Narendra Modi: 'జవహర్ లాల్ నెహ్రూ'ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
- Petrol and Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా? వాహనదారులకు షాక్ తప్పదా?
కాఫిర్లు, జీహాద్ యువకుల కర్తవ్యం-పిల్లలు మరియు వృద్ధుల కానది చూపించే చిత్రాలు, హదీస్ కు సంబంధించిన చిత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముబీన్ ఇంటిలో ఓ పలకను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ‘‘ అల్లాహ్ ఇంటిని తాకడానికి ధైర్యం చేసే ఎవరినైనా మేము నిర్మూలిస్తాము’’ అనే వ్యాఖ్యాలను గుర్తించారు. ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఈ కేసును విచారిస్తోంది. నవంబర్ 2న ఈ కేసులో ఎన్ఐఏ మరన్ని దాడులు చేసింది.

అక్టోబర్ 23న తెల్లవారుజామున 4.30 గంటలకు కోయంబత్తూర్ లో ఓ మారుతి 800 కారులో ఎల్పీజీ సిలిండర్ కారు పేలుడు సంభవించింది. తొలుత సాధారణ పేలుడుగానే అనుకున్నప్పటికీ.. ఆ తరువాత ఉగ్రలింకులు బయటపడ్డాయి. ఈ పేలుడులో మరణించిన నిందితుడి ఇంట్లో పేలుడు పదార్థాలు అయిన పొటాషియం నైట్రేట్, అల్యూమినియం ఫైడర్, బొగ్గు, సల్ఫర్ వంటి వాటిని గుర్తించారు. దీంతో పాటు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో కారులో ఎల్పీజీ సిలిండర్ ని లోడ్ చేస్తున్న నలుగురిని గుర్తించారు. మొత్తం ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి యూఏపీఏ చట్టం కింద కేసులు నమోదు చేశారు. వీరిలో కొంతమంది ఇంతకు మందు కొంత మంది కేరళ వెళ్లారని కోయంబత్తూర్ కమిషనర్ బాలకృష్ణన్ వెల్లడించారు. 2019లో ఎన్ఐఏ వీరిని ప్రశ్నించిందని తెలిపారు. ఇదిలా ఉంటే ఈ పేలుడు ఘటన అధికార డీఎంకే, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఒకానొక సమయంలో తమిళనాడు పోలీసులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Fire Break : ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్లో భారీ అగ్ని ప్రమాదం
-
Gorilla Viral Video: సేమ్ టు సేమ్.. మనిషిలా గొరిల్లా ఎక్స్ప్రెషన్స్.. వీడియో వైరల్..!
-
Ather Energy: ఎలక్ట్రిక్ స్కూటర్లకు వాయిస్ కమాండ్ ఫీచర్.. కొత్త అప్డేట్ విడుదల చేసిన ఏథర్ ఎనర్జీ
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి