Jihad literature recovered from Coimbatore car bomb accused home: తమిళనాడులో కోయంబత్తూర్ కార్ బ్లాస్ట్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఉగ్రకోణం ఉన్నట్లు ఇప్పటికే తమిళనాడు పోలీసులు గుర్తించారు. తాజాగా నిందితుడి ఇంట్లో కీలక విషయాలను గుర్తించారు. అక్టోబర్ 23న కోయంబత్తూర్ కారు పేలుడుతో మరణించిన నిందితుడు జమేషా ముబీన్ ఇంటి నుంచి జీహాద్ కు సంబంధించిన పత్రాలను, చిత్రాలను స్వాధీనం చేసుకున్నారు.